
AP Home Minister : హోం మంత్రి, మాజీ హోం మంత్రిల మధ్య డిష్యూం డిష్యూం.. ఆడాళ్ల పంచాయతీ ఇలానే ఉంటది మరి..!
AP Home Minister : ఏపీలో జగన్ వైఖరి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఏపీలో రాష్ట్రపతి పాలన రావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల అంశంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్తే తానూ కూడా అక్కడికే వెళ్లి తేల్చుకుంటానని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. . వైఎస్ వివేకానంద హత్యతో పాటు వైసీపీ పాలనలో ఏపీలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు తమ పాలనలో రాష్ట్రం ఎలా ఉందో చర్చించేందుకు తానే వస్తానని సవాలు విసిరారు అనిత.
అసెంబ్లీకి వస్తే జగన్ చేసిన పనులు బయటపడతాయని అనిత విమర్శించారు. అసెంబ్లీలో ఈ నెల 24న శాంతి భద్రతలపై శ్వేతపత్రం పెట్టి ప్రభుత్వం చర్చ చేపట్టనుందని తెలిపారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని అన్నారు. ఢిల్లీకి వెళ్లాలనుకుంటే అసెంబ్లీలో చర్చ తర్వాత కూడా వెళ్లొచ్చని చెప్పారు. జగన్ చేస్తున్న శవ రాజకీయాలకు ఆయనకు సిగ్గనిపించకపోయినా ఏపీ ప్రజలు ఆయన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నారని అనిత అన్నారు. జగన్ చెప్పినట్లు నెల రోజుల వ్యవధిలో 36 రాజకీయ హత్యలు జరిగితే ఆ వివరాలు బయటపెట్టాలని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 4 రాజకీయ హత్యలు జరిగితే అందులో చనిపోయిన ముగ్గురు తెలుగుదేశం వారేనని తెలిపారు.
AP Home Minister : హోం మంత్రి, మాజీ హోం మంత్రిల మధ్య డిష్యూం డిష్యూం.. ఆడాళ్ల పంచాయతీ ఇలానే ఉంటది మరి..!
ఇక ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై మాజీ హోంమంత్రి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో వనిత మాట్లాడుతూ.. అనిత చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దాడులు జరుగుతుంటే హోం మంత్రి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. అనిత కూడా ఎమ్మేల్యేగా గెలిచే మంత్రి అయ్యారని చెప్పారు. చంద్రబాబు కూడా కుప్పానికి ఎమ్మేల్యేనే అని అన్నారు. పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని, వాళ్ల పనిని వాళ్లు చేసుకోనివ్వాలని చెప్పారు. టీడీపీ నేతలు దాడులు చేసి, తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు.
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్,…
Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…
Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…
This website uses cookies.