TDP : ఇప్పుడు ఏపీలో పోలింగ్ ముగిసింది. ఎన్నో ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ ప్రచారం ముగిసింది. విధ్వంసాల నడుమ పోలింగ్ పూర్తి అయింది. ఇప్పుడు పార్టీల భవితవ్యం కాస్త బ్యాలెట్ బాక్సుల రూపంలో ఉంది. అయితే రాజకీయ నేతల్లో ఆశలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటాయి. మొదటగా నోటిఫికేషన్ వచ్చినప్పుడు టికెట్ ఎవరికి వస్తుందో అనే టెన్షన్ ఉంటుంది. తమకే రావాలని చాలా మంది కోరుకుంటారు. కానీ ఎవరికి టికెట్ వస్తుందో.. ఎవరికి దెబ్బ పడుతుందో చెప్పలేం. ఇక టికెట్ వచ్చిన తర్వాత గెలవడం ఓ పెద్ద యుద్ధమే అనుకోవాలి.
ఎందుకంటే ప్రచారం దగ్గరి నుంచి పోలింగ్ మేనేజ్ మెంట్ వరకు అన్నీ అనుకూలించాలి. చివరకు గెలిచిన తర్వాత పార్టీ గెలవాలని కోరుకోవాలి. ఒకవేళ పార్టీ కూడా గెలిస్తే అప్పుడు ఏ పదవులు దక్కుతాయా అని ఎదురు చూడాలి. చాలా మంది ఎమ్మెల్యేలు తమ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా మంత్రి పదవులే కోరుకుంటారు. అయితే ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే తమకు ఏ పదవి దక్కుతుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. వైసీపీలాగా తామే అధికారంలోకి వస్తామని కూటమి నేతలు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. కానీ పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు.
ఇక కూటమి టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రం కచ్చితంగా ఓ వ్యక్తికి స్పీకర్ పదవి దక్కుతుందని చర్చ జరుగుతోంది. ఆయన ఎవరో కాదు చివరి నిముషంలో ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రఘురామకృష్ణం రాజు. ఆయన వైసీపీకి మొన్నటి వరకు రెబల్ గాఉన్నారు. జగన్ ను వ్యక్తిగతంటా టార్గెట్ చేసిన వారిలో రఘురామ ముందు వరుసలో ఉంటారు. అలాంటి వ్యక్తికి స్పీకర్ పదవి ఇస్తే అసెంబ్లీలో రచ్చ వేరేలా ఉంటుందని భావిస్తున్నారంట కూటమి నేతలు. అందుకే ఏరికోరి మరీ ఆయనకే స్పీకర్ పదవి ఇవ్వాలని అందరూ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
రఘురామ ఎప్పటికప్పుడు సెన్సేషనల్ గానే ఉంటున్నారు. చాలా విషయాల్లో ఆయన జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. చూడాలి మరి ఆయన స్పీకర్ అవుతారా లేదా అనేది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.