Geethanjali : మహిళల జీవితాల్లో సోషల్ మీడియా ట్రోలింగ్ .. గీతాంజలి లాగే ఎందరో మహిళలు.. దీని వెనుక అసలు ఏం జరుగుతుంది ..!

Advertisement
Published by
Advertisement

Geethanjali : ప్రభుత్వ పథకాలతో తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందని ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ తో గీతాంజలి మాట్లాడిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో అనుచితంగా పోస్ట్ పెట్టడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నారని గీతాంజలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై ట్రోలింగ్ చేసిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలను గుర్తించమని మరికొన్ని ఫేక్ ఖాతాలను కూడా గుర్తించామని నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తల ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. అయితే గీతాంజలి మరణ విషయంలో వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని టీడీపీ ఆరోపిస్తుంది.

Advertisement

Geethanjali : మహిళలపైనే ఎందుకు ట్రోలింగ్ .. అసలేం జరుగుతుంది

సోషల్ మీడియాలో మహిళలే లక్ష్యంగా ట్రోలింగ్స్ బెదిరింపులకు సంబంధించిన కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఏపీ మంత్రి ఆర్కే రోజా, తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్, రచయిత్రి కొండెపూడి నిర్మల, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ, సినీ నటి అనసూయ, జర్నలిస్ట్ తులసి చందు ఇలా ఎందరో మహిళలు సోషల్ మీడియా ట్రోలింగ్ కి గురవుతున్నారు. నిత్యం ఏదో ఒక సందర్భంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడుతున్న మహిళల్లో కొందరు వీరు. కొందరు నెటిజెన్లు అసభ్య పదజాలంతో మార్ఫింగ్ చేసిన ఫోటోలు వాడుతూ చదవలేని రీతిలో కామెంట్స్ పెడుతూ ట్రోలింగ్ చేస్తున్నారు.

Advertisement

Geethanjali : ట్రోల్స్ ఎవరు చేస్తున్నారు?

ట్రోల్స్ చేసే వారెవరు అనేది చెప్పడం కష్టమే. వీరిపై కేసులు పెట్టినా పట్టుకోవడం కష్టంగా మారుతుంది. ఎందుకంటే ఫేక్ ఐడీలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాటితోనే ట్రోల్స్ చేస్తుంటారు. వారి ఐడీలను ట్రాక్ చేసిన ఫేక్ కావడంతో పట్టుకోవడం కష్టం అయితే ఎవరైనా ట్రోల్స్ బారిన పడ్డారంటే వారిని ఏ వర్గం వారు ట్రోల్స్ చేస్తున్నారో గుర్తించవచ్చు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు, మతపరమైన వ్యక్తులు, పార్టీల సానుభూతిపరులు వారికి వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు ట్రోల్స్ చేస్తుంటారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ లలో ట్రోల్స్ చేయడం సర్వసాధారణంగా మారింది. ఇందుకు ప్రత్యేకంగా పేజీలు క్రియేట్ చేయడం లేదా యూట్యూబ్లో ప్రత్యేకంగా ఛానల్స్ పెడుతున్నారు. రాజకీయాలలోకి ఎప్పుడైతే వచ్చాను అప్పటి నుంచి ట్రోల్స్ ఎదుర్కొంటున్నానని పొలిటికల్ వీడియోలు చేయకపోతే ఎవరి మీద ట్రోల్స్ రావని జర్నలిస్టు తులసి చెందు చెబుతున్నారు. ఇదే విషయంపై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ స్పందించారు. పాలిటిక్స్ కి వచ్చేసరికి సోషల్ మీడియాను మంచి కంటే చెడుగా ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు. ఒక రాజకీయ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు అవతల రాజకీయ పార్టీలను నాయకులను కొన్నిసార్లు విమర్శలు చేస్తాం. అది రాజకీయంగా చూడకుండా కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు వ్యక్తిగతంగా తీసుకొని అవతల ఉన్నది మహిళలని, ఆమె ఎందుకు అనాల్సి వచ్చిందో కనీస ఆలోచన లేకుండా విపరీతంగా ట్రోల్స్ చేస్తారని ఆమె చెప్పారు.

Geethanjali : అభిప్రాయాలు వ్యక్తపరిచిన అవమానాలే..

ఒక వ్యక్తి తన అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు అవి ఎదుటి వ్యక్తికి లేదా వర్గానికి నచ్చకపోతే ట్రోలింగ్ కి దిగుతున్నారు. ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడే ఆలోచనలను వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1) (a) కల్పిస్తుంది. రచయితలు, కవులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిస్తుంటారు.కొన్నిసార్లు ఎవరిని కించపరిచే ఉద్దేశం లేకపోయినా వారి వ్యాఖ్యలను కొన్ని వర్గాలకు చెందిన కొందరు వ్యక్తులు లేదా పార్టీలను సానుభూతిపరులు అవి తమను ఉద్దేశించి చేసినవేనని అనుకొని ట్రోల్స్ చేస్తుంటారు.ఈ విషయంలో మహిళా రచయితలపై మరింతగా ట్రోల్స్ వస్తుంటాయి.ప్రముఖ రచయిత్రి కొండెపూడి నిర్మల రాసిన బొట్టు అని కవిత విషయంలో తీవ్రంగా ఎదుర్కొన్నారు.

Geethanjali : మహిళల జీవితాల్లో సోషల్ మీడియా ట్రోలింగ్ .. గీతాంజలి లాగే ఎందరో మహిళలు.. దీని వెనుక అసలు ఏం జరుగుతుంది ..!

Geethanjali : ట్రోల్స్ లో మూకల దాడులు ఎక్కువ

ఒకరిద్దరు కామెంట్లు పెట్టి వదిలేయడం లేదు. మొత్తం వర్గాన్ని ప్రేరేపిస్తూ కామెంట్లు పెడతారు. తమకు సపోర్టుగా ఉన్న గ్రూపులలో షేర్ చేసి నెగిటివ్ కామెంట్లు పెట్టడం లేదా? అసభ్య పదజాలంతో దూషించడం చేస్తారుష ఈ ట్రోల్స్ ద్వారా ఎదుటి వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఈమె మనకు వ్యతిరేకంగా మాట్లాడింది అంటూ గ్రూపుల్లో షేర్ చేస్తారు. అప్పుడు ఒకేసారి మూకలా వచ్చి బూతులను కామెంట్లు గా పెడతారు. అదే సమయంలో ఎవరైనా మనల్ని అభిమానించే వాళ్ళు లేదా కంటెంట్ ను పొగడాలని భావించేవారు అక్కడ వచ్చే నెగటివ్ కామెంట్స్ చూసి సపోర్ట్ గా కామెంట్ పెట్టేందుకు ధైర్యం చేయరు. ఎవరైనా పాజిటివ్ కామెంట్ పెడితే వారిపై దాడికి దిగుతారు అని జర్నలిస్టు తులసి చందు తెలిపారు.

Geethanjali : సర్వేలు ఏమంటున్నాయి

ఒక సర్వేలో 35 ఏళ్లలోపు ఉన్న 33 శాతం మంది యువతులు ఆన్లైన్లో లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపారు. మైనారిటీ వయసు వేధింపులు మరింత ఎక్కువ. ఇండియా అమెరికా బ్రెజిల్ సహా 22 దేశాల్లో 15 , 22 ఏళ్ళ వయసున్న 14,000 మంది యువతులపై సర్వే నిర్వహించింది. తామ వేధింపులకు గురైన తర్వాత ప్రతి ఐదుగురులో ఒకరు సోషల్ మీడియా చూడటం మానేశారు. అదే సమయంలో ప్రతి పది మందిలో ఒకరు వేరొక మాధ్యమం లేదా ఐడిని మార్చుకున్నారు. ఇన్ స్టాలో 23%, వాట్సాప్ లో 14%, స్నాప్ చాట్ లో 10% , ట్విట్టర్లో తొమ్మిది శాతం, టిక్ టాక్ లో ఆరు శాతం చొప్పున వేధింపులకు గురవుతున్నట్లు సర్వేలో తేలింది.

Geethanjali : అసభ్య పోస్టుల నియంత్రణ

ఐదేళ్ల కిందట హైదరాబాదులోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాజెక్ట్ ఏంజిల్ అనే సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసింది. సోషల్ మీడియాలో టీనేజ్ అమ్మాయిలకు వ్యతిరేకంగా వచ్చే పోస్టులు అసభ్య పదజాలాన్ని నియంత్రించడం మెసేజ్ లోని కంటెంట్ కనిపించకుండా చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం. దాదాపుగా 20 లక్షల మెసేజ్ లోని పదాలు వేధింపులకు గురి చేసే విధంగా ఉన్నట్లు ఉన్నాయని అంటున్నారు. ఆ స్థాయిలో సోషల్ మీడియా అసభ్య పదజాలం, బాడీ షేమింగ్, దూషణలు జరుగుతున్నాయని వివరించారు.

సాధారణ సమయాల్లో మామూలుగా కనిపించే వ్యక్తులు కూడా ఆన్లైన్లోకి వచ్చేసరికి చాలా క్రూరమైన వ్యక్తిత్వాన్ని కనబరుస్తున్నారని పరిశోధనలో తేలింది. బంద్ లు, రాస్తారోకోలు చేసినప్పుడు సహజంగా కనిపించే వాళ్ళు గుంపులో కలిసినప్పుడు రాళ్లు విసురుతుంటారు. అద్దాలు పగలగొడతారు. మనల్ని ఎవరు చూడరని భావించినప్పుడు ప్రవర్తన మారుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఫేక్ నేమ్స్ తో ఉంటారు. ఎవరు చేశారనేది తెలుసుకోవడం కష్టం. నన్ను ఎవరు పట్టించుకోరు అన్న సందర్భంలో విపరీత ప్రవర్తనను బయటపెడుతున్నారు.

Geethanjali : ట్రోల్స్ వెనుక మూడు కారణాలు

ఎదుటి వ్యక్తులు పాపులర్ అవుతుంటే డీఫేమ్ చేయాలనుకోవడం. పుట్టి పెరిగిన వాతావరణం, చదువు, స్నేహితులు తన గురించి తెలుసుకోలేరులే అనే భావనతో ట్రోల్స్ కు పాల్పడుతున్నారు. మహిళలు అవి పట్టించుకోకుండా పట్టుదల ఆత్మవిశ్వాసం కనబరిస్తేనే లక్ష్యాలు చేరుకోగలుగుతారు. మహిళలు ఎదుగుతుంటే కొంతమంది ప్రోత్సహిస్తారు కొంతమంది రాళ్లేస్తుంటారు. అయినా లక్ష్యం మాత్రం సూటిగా ఉండాలి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలిన మనోధైర్యాన్ని వీడకుండా బలంగా మహిళా శక్తిని ప్రపంచానికి చాటాలి.

Geethanjali : మహిళల జీవితాల్లో సోషల్ మీడియా ట్రోలింగ్ .. గీతాంజలి లాగే ఎందరో మహిళలు.. దీని వెనుక అసలు ఏం జరుగుతుంది ..!

Geethanjali : ఫిర్యాదులకు ప్రత్యేక పోర్టల్

2022 లో దేశవ్యాప్తంగా మహిళలపై 3001 వేధింపు కేసులు నమోదయ్యాయి. ఆన్లైన్లో లైంగికంగా వేధించిన 2305 కేసులు ఇందులో ఉన్నాయి. మహిళలను బ్లాక్ మెయిల్ చేయడం డెఫినేషన్ మార్ఫింగ్, ఫేక్ ప్రొఫైల్ తయారు చేయడం వంటి ఘటనలపై 696 కేసులు ఉన్నాయి. మహిళలకు ఆన్లైన్లో వేధింపుల గురించి ఫిర్యాదు చేసేందుకు జాతీయ స్థాయిలో పోర్టల్ అందుబాటులో ఉంది. నేరుగా పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేకుండానే www.cybercrime.gov.in అనే పోర్టల్ లో ఫిర్యాదు చేయవచ్చు. వెంటపడి వేదించడం అసభ్య పదజాలంతో దూషించడం వంటి విషయంలో కొన్ని చట్టాలు వర్తింపజేస్తాయి. ఐటీ చట్టంలోని సెక్షన్ 67, 67ఏ కింద ఆన్లైన్ ట్రోలింగ్ విషయంలో కేసులు నమోదు చేయవచ్చు. ఎలక్ట్రానిక్ రూపంలో అశ్లీల విషయాలను ప్రచురించడం, లైంగికంగా అసభ్యకరమైన చర్యల వంటివి ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురించడం పరిగణిస్తారు. కానీ ఇండియాలో సోషల్ మీడియా ట్రోలింగ్ పై నమోదు చేసేందుకు ప్రత్యేకించి చట్టాలు లేవు. దీనిపై కొత్త చట్టాలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఐపీసీ 499 ప్రకారం సోషల్ మీడియాలో అభ్యంతరకర ఫోటోలు వీడియోలు వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకునేందుకు మహిళను డీఫేమ్ చేసినట్లు రుజువైతే రెండేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎవరైనా వ్యక్తి మహిళపై లైంగిక వేధింపుల మాటలు ఎలక్ట్రానిక్ రూపంలో పోస్ట్ చేస్తే అది రుజువైతే ఐదు నుంచి ఏడు సంవత్సరాల జైలు శిక్ష , పది లక్షల జరిమానా విధిస్తారు. మహిళలు, యువతులు తమపై జరుగుతున్న సోషల్ మీడియా దాడులు ఆన్లైన్ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయాలి. వాటిని దాచేస్తే నేరం చేసిన వారిపై చర్యలు తీసుకునే వీలు ఉండదు అని అంటున్నారు.

Advertisement

Recent Posts

Revanth Reddy vs Harish Rao : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి హరీశ్ రావు వస్తారా?.. రేవంత్ వ్యాఖ్యల వెనుక ఐదు కారణాలు

Revanth Reddy vs Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి A. Revanth Reddy మరియు బీఆర్ఎస్…

3 hours ago

Hyper Aadi : హైపర్ ఆది చదువు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. జబర్దస్త్ స్టార్ మార్కుల మెమోలు వైరల్..!

Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…

4 hours ago

PM Kisan : రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ విడతపై కీలక అప్‌డేట్, ఇలా స్టేటస్ చెక్ చేయండి..!

దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…

5 hours ago

WhatsApp : వాట్సాప్‌లో కాల్ రికార్డింగ్ ఎలా చేయాలి? చాలా మందికి తెలియని ట్రిక్స్ ఇవే!

WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…

6 hours ago

Pirzadiguda Pedda Cheruvu : పిర్జాదిగూడ పెద్ద చెరువు కబ్జాలపై అధికారుల కంటితుడుపు చర్యలా..?

Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…

7 hours ago

Cousins and Kalyanams Movie Review : కజిన్స్ అండ్ కళ్యాణమ్స్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్..!

Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…

7 hours ago

Koppula Vena Reddy : పిన్నాని యల్లయ్య వర్ధంతి.. వృద్ధాశ్రమంలో అన్నదానం.. కొప్పుల వేణారెడ్డి..!

Koppula Vena Reddy  : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్‌పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…

8 hours ago

Vijay Trisha : అజిత్ ఇంటికి ఒకే కాన్వాయ్‌లో విజయ్, త్రిష.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..!

Vijay Trisha : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన Vijay మరియు Trisha Krishnan మరోసారి వార్తల్లో నిలిచారు.…

8 hours ago

Parameshwar Reddy : ఉప్పల్ ప్రజలకు భరోసా.. సమస్యల పరిష్కారమే నా లక్ష్యం : ఎంపీఆర్

Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…

9 hours ago

Husband : నేను చ‌చ్చిపోతా.. నా భార్య టార్చ్ త‌ట్టుకోలేక‌పోతున్న‌.. భ‌ర్త కలెక్టర్‌కు లేఖ..!

Husband  : గుజరాత్‌లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…

10 hours ago

Farmers Good News : రైతులకు శుభవార్త.. వ్యవసాయ రంగంలో కొత్త ఆశలు..!

Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…

11 hours ago

Vivo S60 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో Vivo కొత్త సంచలనం.. S60 సిరీస్ ఫీచర్లు చూస్తే ఆశ్చర్యమే!

Vivo S60 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…

12 hours ago