Farmer : తొలకరి జల్లు కురిసింది.. రైతును లక్షాధికారుడ్ని చేసింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Farmer : తొలకరి జల్లు కురిసింది.. రైతును లక్షాధికారుడ్ని చేసింది..!

 Authored By ramu | The Telugu News | Updated on :26 May 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Farmer : తొలకరి జల్లు కురిసింది.. రైతును లక్షాధికారుడ్ని చేసింది..!

Farmer : కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో ప్రతి సంవత్సరం తొలకరి జల్లులతో వజ్రాల వేటకు గ్రామస్తులు పెద్దఎత్తున తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో పెరవలి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి అదృష్టం కలిసొచ్చింది. వజ్రాల వేటలో పాల్గొన్న అతనికి ఓ విలువైన వజ్రం దొరికినట్లు సమాచారం. ఈ వజ్రం స్థానికంగా రూ.30 లక్షలకు అమ్ముడు అయినట్టు తెలుస్తోంది.

Farmer తొలకరి జల్లు కురిసింది రైతును లక్షాధికారుడ్ని చేసింది

Farmer : తొలకరి జల్లు కురిసింది.. రైతును లక్షాధికారుడ్ని చేసింది..!

Farmer : తొలకరి జల్లు కురిసింది..రైతుకు వజ్రాన్ని అందించింది.. ఎక్కడంటే..!

తాజాగా దొరికిన ఈ వజ్రానికి బహిరంగ మార్కెట్‌లో కోట్ల రూపాయల విలువ ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సహజ వనరులుగా ఉండే ఈ విలువైన రత్నాలు సాధారణంగా నల్లమల అడవుల పరిసర ప్రాంతాల్లో మాత్రమే లభిస్తాయని చెబుతున్నారు. వర్షాకాలంలో భూమి ఉపరితలానికి ఈ రత్నాలు వస్తుండటంతో వేట ప్రారంభమవుతోంది. స్థానికులు పెద్ద సంఖ్యలో పొలాలు, అడవుల చుట్టూ వేటను కొనసాగిస్తుంటారు.

అలాగే వజ్రం దొరికిన వెంటనే దానిని మార్కెట్‌కి తీసుకెళ్లకుండా, ప్రభుత్వం నియమించిన అధికారుల ద్వారా ధృవీకరించాలి అనే సూచనలు ఉన్నప్పటికీ, అనధికారికంగా పలు వజ్రాలు కొనుగోలు, విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం. ఇటువంటి అమూల్యమైన రత్నాలు ప్రభుత్వ పర్యవేక్షణలో నిబంధనల ప్రకారం విక్రయించాలనే అవసరం నెలకొంది. పత్తికొండలో ఈ విధంగా జాక్‌పాట్ కొట్టిన ఘటన వజ్రాల వేటపై ప్రజల్లో మళ్లీ ఆసక్తిని పెంచుతోంది.

Tags :

    ramu

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది