Pawan Kalyan : పవన్ కు వచ్చిన నష్టమేం లేదు.. కూటమిని కూలుస్తున్న గాజు గ్లాసు..!
Pawan Kalyan : ఈ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడం వల్ల పవన్ కల్యాన్ కు గానీ, ఆయన పార్టీకి గానీ వచ్చిన నష్టమేం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే పవన్ కల్యాణ్ కు గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కు దారుణమైన ఓట్లు వచ్చాయి. ఒక్క ఎమ్మెల్యేమాత్రమే గెలిచాడు. జనసేనకు కేవలం 6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో ఆ ఎన్నికల్లో గాజు గ్లాసు పర్మినెంట్ […]
ప్రధానాంశాలు:
Pawan Kalyan : పవన్ కు వచ్చిన నష్టమేం లేదు.. కూటమిని కూలుస్తున్న గాజు గ్లాసు..!
![Pawan Kalyan : పవన్ కు వచ్చిన నష్టమేం లేదు.. కూటమిని కూలుస్తున్న గాజు గ్లాసు..! Pawan Kalyan : పవన్ కు వచ్చిన నష్టమేం లేదు.. కూటమిని కూలుస్తున్న గాజు గ్లాసు..!](https://thetelugunews.com/wp-content/uploads/2024/05/Pawan-Kalyan-1.jpg)
![Pawan Kalyan : పవన్ కు వచ్చిన నష్టమేం లేదు.. కూటమిని కూలుస్తున్న గాజు గ్లాసు..! Pawan Kalyan : పవన్ కు వచ్చిన నష్టమేం లేదు.. కూటమిని కూలుస్తున్న గాజు గ్లాసు..!](https://thetelugunews.com/wp-content/uploads/2024/05/Pawan-Kalyan-1.jpg)
Pawan Kalyan : ఈ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవడం వల్ల పవన్ కల్యాన్ కు గానీ, ఆయన పార్టీకి గానీ వచ్చిన నష్టమేం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే పవన్ కల్యాణ్ కు గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కు దారుణమైన ఓట్లు వచ్చాయి. ఒక్క ఎమ్మెల్యేమాత్రమే గెలిచాడు. జనసేనకు కేవలం 6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో ఆ ఎన్నికల్లో గాజు గ్లాసు పర్మినెంట్ కాకుండా ఓయింది. ఒకవేళ పవన్ కల్యాణ్ గనక ఆ ఎన్నికల్లో గెలిచి ఉంటే రెండు ఎమ్మెల్యే సీట్లు ఉండటం వల్ల జనసేనకు గాజు గ్లాసు గుర్తు పర్మినెంట్ అయిపోయి ఉండేది.
Pawan Kalyan : జనసేన సేఫ్..
కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి అలా లేదు. దాంతో ఇప్పుడు గాజు గ్లాసు ఇప్పుడు ఫ్రీ సింబల్ అయిపోయింది. దాంతో ఇండిపెండెంట్లకు ఈ గుర్తు వశం అయిపోయింది. జనసేన పోటీ చేయని చోట ఇప్పుడు గాజు గ్లాసు గుర్తు ఇండిపెండెంట్ అభ్యర్థులకు వరంగా మారిపోయింది. దాంతో ఇప్పుడు టీడీపీ, బీజేపీలకు ఇది పెద్ద నష్టం తెస్తోంది. ఎటొచ్చి జనసేన మాత్రం సేఫ్ గానే ఉండిపోయింది. కానీ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయని చోట ఇప్పుడు టీడీపీ, బీజేపీలకు గాజుగ్లాసు గుర్తు పెద్ద టెన్షన్ పెడుతోంది. దాంతో ఇప్పుడు కోర్టులో ఆ గుర్తు ఇండిపెండెంట్లకు ఇవ్వొద్దని టీడీపీ కూడా వాదిస్తోంది.
![Pawan Kalyan పవన్ కు వచ్చిన నష్టమేం లేదు కూటమిని కూలుస్తున్న గాజు గ్లాసు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్తలు | Today Telugu News Pawan Kalyan పవన్ కు వచ్చిన నష్టమేం లేదు కూటమిని కూలుస్తున్న గాజు గ్లాసు](https://thetelugunews.com/wp-content/uploads/2024/05/Pawan-Kalyan-1.jpg)
![Pawan Kalyan పవన్ కు వచ్చిన నష్టమేం లేదు కూటమిని కూలుస్తున్న గాజు గ్లాసు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్తలు | Today Telugu News Pawan Kalyan పవన్ కు వచ్చిన నష్టమేం లేదు కూటమిని కూలుస్తున్న గాజు గ్లాసు](https://thetelugunews.com/wp-content/uploads/2024/05/Pawan-Kalyan-1.jpg)
Pawan Kalyan : పవన్ కు వచ్చిన నష్టమేం లేదు.. కూటమిని కూలుస్తున్న గాజు గ్లాసు..!
దాని వల్ల తమ పార్టీకి నష్టం వాటిల్లుతోందని చెబుతున్నారు. కానీకోర్టు తాము ఇప్పుడు జోక్యం చేసుకోలేమని చెబుతోంది. ఎందుకంటే ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా పూర్తి అయిపోయిందని చెబుతోంది కోర్టు. అంతే కాకుండా 85 ఏళ్లవృద్ధుల ఓట్లను ఇంటి వద్దనే వేపించే ప్రక్రియను కూడా స్టార్ట్ చేసేసింది. దాంతో ఇప్పుడు కుదరదని కోర్టు చెప్పేసింది. కాబట్టి ఇప్పుడు కోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని చెబుతోంది. ఇంకేముంది ఇప్పుడు కూటమి అభ్యర్థులుగా టీడీపీ, బీజేపీ పోటీ చేస్తున్న చోట గాజు గ్లాసుకు ఓట్లు ఎక్కువ పడే ఛాన్స్ ఉంది. దాని వల్ల టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు ఓటమి భయం పట్టుకుంది. కానీ జనసేన పోటీ చేస్తున్న చోట మాత్రం వారి ఓట్లు వారికి పడుతాయి. కానీ కూటమి ఓట్లు మాత్రం టీడీపీ, బీజేపీకి పడే అవకాశం లేదని అంటున్నారు.