Categories: andhra pradeshNews

Vasireddy Padma : వైసీపీకి గుడ్ బై చెప్పాక జ‌గ‌న్‌పై క‌డుపులో ఉంద‌తా క‌క్కేసిన వాసిరెడ్డి ప‌ద్మ‌

Advertisement
Advertisement

Vasireddy Padma : వైసీపీ అధినేత జ‌గ‌న్‌కి షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీకి చెందిన నాయ‌కులు.ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఇలా ఒక్కొక్క‌రుగా రాజీనామా చేశారు. తాజాగా తాజాగా మరో సీనియర్ మహిళా నేత, మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా పార్టీని వీడారు. తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధినేత జగన్‌కు లేఖ రాశారు. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత వాసిరెడ్డి పద్మ ఎక్కడా పెద్దగా కనిపించలేదు.. వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రాజీనామా లేఖలో జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. కేడర్ ను ఏ మాత్రం జగన్ పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఎవరూ జగన్ పక్క ఉండే పరిస్థితి లేదన్నారు. తనకు అనేక అవమానాలు జరిగాయన్నారు.

Advertisement

Vasireddy Padma జ‌గన్ పై ఆగ్ర‌హావేశం..

వాసిరెడ్డి పద్మ ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట సీటు ఆశించారు.. కానీ ఆ అవకాశం దక్కలేదు. ఇటీవల జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైఎస్సార్‌సీపీని వీడి జనసేన పార్టీలో చేరడంతో.. నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి ఖాళీ అయ్యింది. వాసిరెడ్డి పద్మ జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఇంఛార్జ్ పదవి ఇస్తారని భావించారట.. అయితే ఇటీవల పార్టీ అధినేత వైఎస్ జగన్ తన్నీరు నాగేశ్వరరావును జగ్గయ్యపేట ఇంఛార్జ్ గా నియమించారు. ఈ క్రమంలోనే వాసిరెడ్డి పద్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీని నడిపించడంలో జగన్ కి బాధ్యత లేదని.. పరిపాలన చేయడంలోనూ బాధ్యత లేదని.. సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదని విమర్శించారు.

Advertisement

Vasireddy Padma : వైసీపీకి గుడ్ బై చెప్పాక జ‌గ‌న్‌పై క‌డుపులో ఉంద‌తా క‌క్కేసిన వాసిరెడ్డి ప‌ద్మ‌

వ్యక్తిగతంగా, విధానాలపరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా పార్టీలో పనిచేసినట్లు తెలిపారు. అయితే… ప్రజాతీర్పు తర్వాత అనేక విషయాలను సమీక్షించుకుని, అంతర్మధనం చెంది వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఇటీవల ప్రస్థావించిన “గుడ్ బుక్”పై సెటైర్లు పేల్చారు వాసిరెడ్డి పద్మ! ఇందులో భాగంగా… నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది “గుడ్ బుక్” కాదని, “గుండె బుక్” అని పద్మ కామెంట్ చేశారు. ఇదే సమయంలో.. ప్రమోషన్ అనే పదం వాడటానికి రాజకీయ పార్టీ వ్యాపార కంపెనీ కాదని.. పార్టీకోసం ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదనుకునే జగన్ “గుడ్ బుక్” పేరుతో మరోసారి మోసం చేయడానికి సిద్ధపడుతున్నారని వాసిరెడ్డి ప‌ద్మ ఫుల్ ఫైర్ అయ్యారు.

Advertisement

Recent Posts

T20 World Cup 2026: కివీస్ కోట బద్దలు.. న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం!

T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…

3 hours ago

Telangana : తెలంగాణా హంగ్ మున్సిపాలిటీల్లో అధికారం ఎవరిది..?

Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…

4 hours ago

Rashmi Gautam : బంగారం లాంటి వాడు దొరికాడు .. యాంకర్ రష్మీ పెళ్లి కి అంతా రెడీ !

Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…

5 hours ago

Shivajyothi : బిడ్డని కన్న ఆనందం కూడా లేకుండా శివజ్యోతి కి బిగ్ బ్యాడ్ న్యూస్..!

Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…

6 hours ago

Womens : ఏపీ లో మహిళల కు బంపర్ గుడ్ న్యూస్..!

Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government  2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…

8 hours ago

Nara Lokesh : బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పటాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ..!

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…

9 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్..మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు జమ !!

Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…

12 hours ago