Venu Swamy : చంద్రబాబుతో ఈ పూజ చేయించాలని బాలకృష్ణకు ముందే చెప్పా.. కానీ మూర్ఖుడు వినలేదు.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

Authored By Breaking News 2 | The Telugu News | Published on: September 29, 2023, 10:00 am

Venu Swamy : ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీల గురించి కీలక వ్యాఖ్యలు చేస్తుంటారు. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు వేణు స్వామి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. యూట్యూబ్ ఓపెన్ చేసి వేణు స్వామి అని కొడితే పుంఖానుపుంఖలుగా వీడియోలు కనిపిస్తాయి. వేణు స్వామికి తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులారిటీ ఉంది. ఆయన ఎవరి గురించి జ్యోతిష్యం చెప్పినా అది నూటికి నూరు పాళ్లు నిజం అవుతుందని ఇప్పటికే చాలాసార్లు రుజువు అయింది. రష్మిక మందన్నాకు రాజశ్యామల యాగం చేయడం వల్లే తను ఇప్పుడు నేషనల్ క్రష్ అయింది. స్టార్ హీరోయిన్ అయింది అని జనాలు నమ్ముతారు. అలాగే.. చాలామంది హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకులకు వేణు స్వామి రాజశ్యామల యాగం చేయించినట్టు తెలుస్తోంది.

జగన్ సీఎం కాకముందు.. 2018 లో నాలుగు సార్లు జగన్ సీఎం కావాలని వేణు స్వామి రాజశ్యామల యాగం చేశారట. వైజాగ్ దగ్గర భీమిలీలో ఈ యాగం చేసినట్టు తెలుస్తోంది. అయితే.. అదే సమయంలో చంద్రబాబుకు కూడా రాజశ్యామల యాగం చేయించుకోవాలని వేణు స్వామి చాలా సార్లు చెప్పారట. చంద్రబాబు వినరని.. బాలకృష్ణకు వేణు స్వామి చెప్పారట. బాలకృష్ణ చెప్పినా కూడా చంద్రబాబు అస్సలు వినలేదట. 2019 లో ఎలాగైనా రాజశ్యామల యాగం చేయించాలని బాలకృష్ణ పట్టుపట్టారట. చంద్రబాబును అడిగారట. కానీ.. చంద్రబాబు మాత్రం ససేమిరా అన్నారట. ఆ యాగంలో తాను కూర్చోనని చంద్రబాబు అన్నారట. బాలకృష్ణ.. వేణు స్వామిని యాగం చేయడానికి ఒప్పించారు కానీ.. చంద్రబాబును ఒప్పించలేకపోయారట.

venu swamy suggested pooja to balakrishna over chandrababu arrest

#image_title

Venu Swamy : చీరాలలో బాలకృష్ణ కోసం రాజశ్యామల యాగం చేశా

చంద్రబాబు ఒప్పుకోకపోయినా పర్వాలేదు.. మీరు ఎమ్మెల్యే అవుతారు.. ఒప్పుకోండి. మీ పార్టీ మాత్రం రూలింగ్ లో ఉండదు అని బాలకృష్ణకు చెప్పా అని వేణు స్వామి చెప్పాడు. దీంతో బాలకృష్ణ ఒప్పుకున్నారని.. అప్పుడు బాలకృష్ణ కోసం చీరాలలో రాజశ్యామల యాగం చేశానని.. అందుకే ఆయన ఎమ్మెల్యే అయ్యారని చెప్పుకొచ్చారు. మరి చంద్రబాబు ఎందుకు ఒప్పుకోలేదు అని యాంకర్ అడిగితే.. ఆయన అంతే.. ఆయన ఎవ్వరినీ నమ్మరు. ఆయనదంతా ఒక లోకం. ఆయన వెరైటీ. ఆయన మెంటాలిటీ వేరు. ఆయన మనం చెప్పకముందే మన గురించి చెప్పేస్తారు. ఆయనంటేనే భయం అంటూ వేణు స్వామి చెప్పుకొచ్చారు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp