
Chandrababu Naidu : వారిలాగా చేస్తే తిరిగి అధికారంలోకి రాలేం : చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu : గత ప్రభుత్వం మాదిరిగా ప్రజా సమస్యలు ఆలకించక, వారు చెబితే వినకుండా ఉంటే తిరిగి అధికారంలోకి రాలేమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గత ప్రభుత్వంలో చాలా మంది మంత్రులు ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సోమవారం సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపై, ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, ప్రజలను సంతృప్తి పరిచేలా పాలన చేయాలని వారికి సూచించారు. ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టక ముందు నుంచే అధికారులతో ఆయన మమేకమవుతున్న సంగతి తెలిసిందే. పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత పలు విధానపరమైన నిర్ణయాలు వేగంగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా సోమవారం సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొని పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసిందన్న ఆయన విమర్శించారు. గతంలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రా ఐఏఎస్ అధికారులు జగన్ పాలనలో అపఖ్యాతి పాలయ్యారన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల పనితీరుతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారుల పనితీరును బట్టి కూడా ప్రభుత్వ పనితీరును ప్రజలు అంచనా వేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలని పేర్కొన్నారు.
Chandrababu Naidu : వారిలాగా చేస్తే తిరిగి అధికారంలోకి రాలేం : చంద్రబాబు నాయుడు
రాష్ట్ర పునర్నిర్మాణానికి కలెక్టర్ల సదస్సు నాంది పలకాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ప్రభుత్వానికి వస్తున్న ఫిర్యాదుల్లో 50 శాతానికి పైగా భూ సమస్యలపైనే ఉన్నట్లు తెలిపిన ఆయన వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని అధికారులకు సూచించారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంపద సృష్టికి కొత్త విధానాలు, నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులను గౌరవించాలని, ఎమ్మెల్యేలు చెబితే వినాలన్నారు. ప్రజలు తమకు అధికారాన్ని కట్టబెట్టారని తప్పు చేస్తే మళ్లీ అధికారంలోకి రాలేమని, అసెంబ్లీకి పోలేమన్నారు. పరదాలు కట్టడాలు, రోడ్ బ్లాక్ చేయడాలు వంటివి చేయవద్దన్నారు. ప్రభుత్వం అంతరంగాన్ని అనుసంధానం చేస్తూ ఒక యాప్ క్రియేట్ చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత ఆసక్తికర మ్యాచ్లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
This website uses cookies.