Chandrababu Naidu : గత ప్రభుత్వం మాదిరిగా ప్రజా సమస్యలు ఆలకించక, వారు చెబితే వినకుండా ఉంటే తిరిగి అధికారంలోకి రాలేమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గత ప్రభుత్వంలో చాలా మంది మంత్రులు ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సోమవారం సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపై, ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, ప్రజలను సంతృప్తి పరిచేలా పాలన చేయాలని వారికి సూచించారు. ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టక ముందు నుంచే అధికారులతో ఆయన మమేకమవుతున్న సంగతి తెలిసిందే. పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత పలు విధానపరమైన నిర్ణయాలు వేగంగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా సోమవారం సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొని పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసిందన్న ఆయన విమర్శించారు. గతంలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రా ఐఏఎస్ అధికారులు జగన్ పాలనలో అపఖ్యాతి పాలయ్యారన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల పనితీరుతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారుల పనితీరును బట్టి కూడా ప్రభుత్వ పనితీరును ప్రజలు అంచనా వేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలని పేర్కొన్నారు.
రాష్ట్ర పునర్నిర్మాణానికి కలెక్టర్ల సదస్సు నాంది పలకాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ప్రభుత్వానికి వస్తున్న ఫిర్యాదుల్లో 50 శాతానికి పైగా భూ సమస్యలపైనే ఉన్నట్లు తెలిపిన ఆయన వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని అధికారులకు సూచించారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంపద సృష్టికి కొత్త విధానాలు, నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులను గౌరవించాలని, ఎమ్మెల్యేలు చెబితే వినాలన్నారు. ప్రజలు తమకు అధికారాన్ని కట్టబెట్టారని తప్పు చేస్తే మళ్లీ అధికారంలోకి రాలేమని, అసెంబ్లీకి పోలేమన్నారు. పరదాలు కట్టడాలు, రోడ్ బ్లాక్ చేయడాలు వంటివి చేయవద్దన్నారు. ప్రభుత్వం అంతరంగాన్ని అనుసంధానం చేస్తూ ఒక యాప్ క్రియేట్ చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.