
Chandrababu Naidu : వారిలాగా చేస్తే తిరిగి అధికారంలోకి రాలేం : చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu : గత ప్రభుత్వం మాదిరిగా ప్రజా సమస్యలు ఆలకించక, వారు చెబితే వినకుండా ఉంటే తిరిగి అధికారంలోకి రాలేమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గత ప్రభుత్వంలో చాలా మంది మంత్రులు ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సోమవారం సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపై, ప్రతి మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని, ప్రజలను సంతృప్తి పరిచేలా పాలన చేయాలని వారికి సూచించారు. ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టక ముందు నుంచే అధికారులతో ఆయన మమేకమవుతున్న సంగతి తెలిసిందే. పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత పలు విధానపరమైన నిర్ణయాలు వేగంగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా సోమవారం సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొని పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసిందన్న ఆయన విమర్శించారు. గతంలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రా ఐఏఎస్ అధికారులు జగన్ పాలనలో అపఖ్యాతి పాలయ్యారన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల పనితీరుతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారుల పనితీరును బట్టి కూడా ప్రభుత్వ పనితీరును ప్రజలు అంచనా వేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గమనించాలని పేర్కొన్నారు.
Chandrababu Naidu : వారిలాగా చేస్తే తిరిగి అధికారంలోకి రాలేం : చంద్రబాబు నాయుడు
రాష్ట్ర పునర్నిర్మాణానికి కలెక్టర్ల సదస్సు నాంది పలకాలని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ప్రభుత్వానికి వస్తున్న ఫిర్యాదుల్లో 50 శాతానికి పైగా భూ సమస్యలపైనే ఉన్నట్లు తెలిపిన ఆయన వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని అధికారులకు సూచించారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంపద సృష్టికి కొత్త విధానాలు, నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులను గౌరవించాలని, ఎమ్మెల్యేలు చెబితే వినాలన్నారు. ప్రజలు తమకు అధికారాన్ని కట్టబెట్టారని తప్పు చేస్తే మళ్లీ అధికారంలోకి రాలేమని, అసెంబ్లీకి పోలేమన్నారు. పరదాలు కట్టడాలు, రోడ్ బ్లాక్ చేయడాలు వంటివి చేయవద్దన్నారు. ప్రభుత్వం అంతరంగాన్ని అనుసంధానం చేస్తూ ఒక యాప్ క్రియేట్ చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
CM Revanth Reddy : తెలంగాణ ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం.…
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
This website uses cookies.