
wheat distribution in ration card holders
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. విజయవాడలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి, కొంతమంది లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఏటీఎం సైజులో ఉండే ఈ కార్డుల్లో క్యూఆర్ కోడ్ సదుపాయం కల్పించారు. రేషన్ తీసుకున్న వెంటనే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం చేరేలా టెక్నాలజీ వినియోగం జరుగుతోందని మంత్రి వివరించారు.
wheat distribution in ration card holders
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ పేదలకు మరో శుభవార్త తెలిపారు. త్వరలో రేషన్ దుకాణాల ద్వారా గోధుమలను కూడా అందజేస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు రేషన్లో బియ్యం మాత్రమే క్రమం తప్పకుండా అందుతున్నా, కందిపప్పు, పంచదార సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో గోధుమలను అందించడం ద్వారా ప్రజలకు మరో ఆప్షన్ లభిస్తుందని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 15 నాటికి రాష్ట్రంలోని 1.46 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామని కూడా స్పష్టం చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం కూడా రేషన్లో కొన్ని వస్తువులు ఇవ్వడానికి ప్రయత్నించినా అవి క్రమం తప్పకుండా అందలేకపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా రాగులు ఇవ్వాలనుకున్నా, ధరలు ఎక్కువగా ఉండటంతో ఆ ఆలోచన ఆగిపోయినట్లు కనిపిస్తోంది. అయితే, కేంద్రం ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో గోధుమలను అందజేస్తున్నందున, ఏపీలో కూడా వాటిని అందించే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. రేషన్ కార్డుల పంపిణీ, రేషన్ దుకాణాల సంఖ్య పెంపుతో పాటు సబ్డిపోలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
Vijay Jason vs Vijay : తమిళ సూపర్ స్టార్ విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒక పెద్ద మలుపు…
Hyderabad : భాగ్యనగరం అంటేనే రకరకాల రుచులకు మరియు విందు వినోదాలకు పెట్టింది పేరు. దేశ విదేశాల నుండి పర్యాటకులు…
YS Jagan good news : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గెలుపోటముల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఆశించిన…
Iran New Supreme : ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన…
Velidanda : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక కీలకమైన అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సీసీ…
Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి తన మనసులో మాటను…
Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…
students : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
Kushi Movie Sequel : పవన్ కళ్యాణ్ Pawan Kalyan కెరీర్ లో అతిపెద్ద హిట్ గా నిలిచిన ఖుషి…
Gold and Silver Price 13 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి, పసిడి…
This website uses cookies.