wheat distribution in ration card holders
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. విజయవాడలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి, కొంతమంది లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఏటీఎం సైజులో ఉండే ఈ కార్డుల్లో క్యూఆర్ కోడ్ సదుపాయం కల్పించారు. రేషన్ తీసుకున్న వెంటనే కేంద్ర, జిల్లా కార్యాలయాలకు సమాచారం చేరేలా టెక్నాలజీ వినియోగం జరుగుతోందని మంత్రి వివరించారు.
wheat distribution in ration card holders
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ పేదలకు మరో శుభవార్త తెలిపారు. త్వరలో రేషన్ దుకాణాల ద్వారా గోధుమలను కూడా అందజేస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు రేషన్లో బియ్యం మాత్రమే క్రమం తప్పకుండా అందుతున్నా, కందిపప్పు, పంచదార సరఫరాలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో గోధుమలను అందించడం ద్వారా ప్రజలకు మరో ఆప్షన్ లభిస్తుందని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 15 నాటికి రాష్ట్రంలోని 1.46 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామని కూడా స్పష్టం చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం కూడా రేషన్లో కొన్ని వస్తువులు ఇవ్వడానికి ప్రయత్నించినా అవి క్రమం తప్పకుండా అందలేకపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా రాగులు ఇవ్వాలనుకున్నా, ధరలు ఎక్కువగా ఉండటంతో ఆ ఆలోచన ఆగిపోయినట్లు కనిపిస్తోంది. అయితే, కేంద్రం ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో గోధుమలను అందజేస్తున్నందున, ఏపీలో కూడా వాటిని అందించే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. రేషన్ కార్డుల పంపిణీ, రేషన్ దుకాణాల సంఖ్య పెంపుతో పాటు సబ్డిపోలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…
Samantha- Naga Chaitanya | టాలీవుడ్లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…
Sawai Madhopur | దేశవ్యాప్తంగా వర్షాలు విరుచుకుపడుతుండగా, రాజస్థాన్లో వర్ష బీభత్సం జనజీవితాన్ని స్తంభింపజేస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న…
భర్త ప్రాణాలు రక్షించేందుకు తన అవయవాన్ని దానం చేసిన ఓ భార్య... చివరకు ప్రాణాన్ని కోల్పోయిన విషాదకర ఘటన మహారాష్ట్రలోని…
Health Tips | వేరుశెనగలు మనందరికీ ఎంతో ఇష్టమైన ఆహార పదార్థం. వీటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మరియు ఇతర…
This website uses cookies.