why pawan kalyan is targeting only caste, Telugu News
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుసు కదా. తన తొలి విడత వారాహి యాత్ర తాజాగా ముగిసింది. వారాహి యాత్ర అనగానే మనకు గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ విమర్శలు. అవును.. వారాహి యాత్ర పేరుతో పవన్ కళ్యాన్.. వైసీపీ ప్రభుత్వం మీద, సీఎం జగన్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసలు వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టేందుకే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభించారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
వారాహి యాత్ర తొలి విడత ముగియడంతో.. రెండో విడత వారాహి యాత్రకు ముహూర్తం ఖరారు చేశారు. తొలి విడతలో భాగంగా గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రను నిర్వహించిన విషయం తెలిసిందే. రెండోసారి కూడా అదే గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఈనెల 9న ఏలూరులో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత తొలి విడతలో కవర్ చేయని ప్రాంతాల్లో రెండో విడతలో భాగంగా పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.అసలు.. పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల మీదనే ఎందుకు ఫోకస్ పెట్టారో అర్థం కావడం లేదు. అసలు రాయలసీమలో వారాహి యాత్ర ప్రారంభిస్తారని అంతా అనుకున్నారు. తొలి విడతనే తిరుపతి నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ కుదరలేదు. రెండో యాత్ర అయినా తిరుపతి నుంచి ఉంటుందని అనుకున్నారు. అదీ లేదు. అసలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయినా చేయాలి కదా. కానీ.. రెండోసారి కూడా పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలనే ఎందుకు ఎంచుకున్నారు.
why pawan kalyan is targeting only caste, Telugu News
అంటే.. దాని వెనుక పెద్ద కారణమే ఉందట. పవన్ కళ్యాణ్ కేవలం గోదావరి జిల్లాలనే టార్గెట్ చేస్తున్నారు అంటే దానికి అర్థం కుల సమీకరణలో భాగమే అని అంటున్నారు. గోదావరి జిల్లాల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఆ జిల్లాల్లో ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తోంది. అంటే.. కేవలం కులాన్నే నమ్ముకొని పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారా? ఇలా అయితే కష్టమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Brinjal | వంకాయను సాధారణంగా మనం కూరగాయగా చూస్తాం. కానీ, ఈ సాధారణంగా కనిపించే కూరగాయకు ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు…
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
This website uses cookies.