YSRCP : ఆంధ్ర రాజకీయాలలో వైసీపీ గ్రాఫ్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటి..?

Advertisement
Advertisement

YSRCP : ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలాగైనా అధికారం సాధించాలనే ఆలోచనతో రాజకీయ పార్టీలు కొనసాగుతున్నాయి. అయితే మొదట్లో వైసీపీ పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో మనందరికీ తెలిసిందే. కాని ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ గ్రాఫర్ క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. రెండు నెలల క్రితం గమనించినట్లయితే వైసీపీ పరిస్థితి ఓటమి పాలవుతుందని చాలామంది భావించారు. ఈ క్రమంలోనే ఎన్నికల సమయానికి వైసీపీ పార్టీపై మరింత వ్యతిరేకత వస్తుందని చాలామంది అనుకున్నారు. వాస్తవానికి అదే జరిగి ఉండాలి కానీ వైసీపీ గ్రాఫ్ పడిపోకుండా అమాంతం పెరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం వైయస్ జగన్మోహన్ రెడ్డిని గద్దే దించాలనే ఆలోచనతో కూటమితో ముందుకు వెళుతున్న ప్రతిపక్షాల మార్గం సరిగా లేకపోవడం అని చెప్పాలి .అయితే వైసీపీ పార్టీని ఒంటరిగా ఎదుర్కోలేమనే ఉద్దేశంతో టీడీపీ , జనసేన పొత్తు కలిసాయి. ఈ రెండు పార్టీలు పొత్తు కుదరడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కూడా విపరీతంగా పెరిగింది. ఈ తరుణంలో వైసీపీ శ్రేణుల్లో కలవరం కూడా మొదలైంది. అయితే ఇల్లు అలకగానే పండగ కాదన్న సామితే… టీడీపీ జనసేన పొత్తుతో సమన్వయం ప్రధాన సమస్యగా మారింది. అయితే రాజకీయాలలో 2+2=4 కాదని అంటూ ఉంటారు. ఇక టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకోవడంతో అధికారం పై పార్టీ నేతల్లో ఆశలు కూడా చిగురించాయి.

Advertisement

ఈ క్రమంలోనే రెండు పార్టీల మధ్య టికెట్ల డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు అదే స్థాయిలో పెరగడం మొదలయ్యాయి. దీంతో ఈ రెండు పార్టీలలో ఒకరికి టికెట్ ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే కోపం వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక దీనికి మంచి ఉదాహరణ రాజమండ్రి రూరల్ సిటీ అని చెప్పాలి.ఎందుకంటే టీడీపీ తో చర్చలు జరుపుకుండానే కందుల దుర్గేష్ కు రాజమండ్రిలో టికెట్ ప్రకటించారు పవన్ కళ్యాణ్ . అయితే అక్కడ అసలేం జరిగింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా రాజోలు మరియు రాజనగరంలో కూడా జనసేన పోటీ చేయబోతుందంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ క్రమంలోని పొత్తు ధర్మాన్ని పాటించకుండా చంద్రబాబు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారని పవన్ కళ్యాణ్ రీ పబ్లిక్ డే సందర్భంగా తెలియజేసిన విషయం తెలిసిందే.అయితే టీడీపీ మరియు జనసేన అధినేతలు ముందుగా అభ్యర్థులను ప్రకటించకుండానే పార్టీలో లొల్లి ప్రారంభమైంది. దీంతో అధినేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పిన కూడా నేతలు వినిపించుకోలేని పరిస్థితి నెలకొంది. ఇక వైసీపీ అభ్యర్థుల విషయానికొస్తే…అభ్యర్థుల మార్పు చేర్పులు చిన్నచిన్న అలకలు తప్ప సీఎం వైయస్ జగన్ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత కనిపించడం లేదు. ఇక దీనికి గల ప్రధాన కారణం మళ్లీ వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సానుకూల వాతావరణమని చెప్పాలి. ఇక టీడీపీ మరియు జనసేన పొత్తులో చాలామంది టికెట్లు గల్లంతూ అవుతున్నాయనే భయం కూడా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తుంది. ఇక ఇప్పుడు బీజేపీ కూడా ఈ పొత్తులో తోడవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

దీంతో నేతలు చాలామంది త్యాగాలకు సిద్ధపడాల్సి వస్తుంది. పోనీ కూటమి అధికారంలోకి వస్తుందని నమ్మకం ఉంటే వారి నాయకత్వాన్ని పోగొట్టుకొని త్యాగలకు సిద్ధమవుతారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణం బట్టి చూస్తే అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి క్రమంలో వైసీపీ ఎన్నికల శంఖారావం భీమిలిలో మొదలుపెట్టి ఇప్పటికే మూడు సభలను పూర్తి చేసింది. ఇక ఇక్కడ వాస్తవంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒకదానికి మించి మరొక సభ సూపర్ డూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి.దీంతో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడనే బలమైన సంకేతాలు వైసీపీ సిద్ధం సభలు విజయవంతం అవడం ద్వారా తెలుస్తోంది. దీంతో ఇప్పటికే వైసీపీ పార్టీని వీడిన నేతలు కూడా ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా పార్టీ వీడి నెల రోజులు కాకుండానే తిరిగి మళ్ళీ పాత గుటికి చేరుకున్నారు.ఇక కూటమిలో సీట్లు టికెట్లు కీచులాట జరుగుతుంటే వైసీపీ మాత్రం సిద్ధం సభలతో సానుకూల వాతావరణంలో దూసుకుపోతుంది. దీంతో జనసేన టీడీపీ బీజేపీ కూటమితో అధికారంలోకి వచ్చేది లేదని భావించిన నేతలు వైసీపీ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

30 mins ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

1 hour ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

2 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

3 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

4 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

5 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

15 hours ago

This website uses cookies.