YSRCP : ఆంధ్ర రాజకీయాలలో వైసీపీ గ్రాఫ్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటి..?

YSRCP : ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలాగైనా అధికారం సాధించాలనే ఆలోచనతో రాజకీయ పార్టీలు కొనసాగుతున్నాయి. అయితే మొదట్లో వైసీపీ పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో మనందరికీ తెలిసిందే. కాని ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ గ్రాఫర్ క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. రెండు నెలల క్రితం గమనించినట్లయితే వైసీపీ పరిస్థితి ఓటమి పాలవుతుందని చాలామంది భావించారు. ఈ క్రమంలోనే ఎన్నికల సమయానికి వైసీపీ పార్టీపై మరింత వ్యతిరేకత వస్తుందని చాలామంది అనుకున్నారు. వాస్తవానికి అదే జరిగి ఉండాలి కానీ వైసీపీ గ్రాఫ్ పడిపోకుండా అమాంతం పెరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే దీనికి ప్రధాన కారణం వైయస్ జగన్మోహన్ రెడ్డిని గద్దే దించాలనే ఆలోచనతో కూటమితో ముందుకు వెళుతున్న ప్రతిపక్షాల మార్గం సరిగా లేకపోవడం అని చెప్పాలి .అయితే వైసీపీ పార్టీని ఒంటరిగా ఎదుర్కోలేమనే ఉద్దేశంతో టీడీపీ , జనసేన పొత్తు కలిసాయి. ఈ రెండు పార్టీలు పొత్తు కుదరడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కూడా విపరీతంగా పెరిగింది. ఈ తరుణంలో వైసీపీ శ్రేణుల్లో కలవరం కూడా మొదలైంది. అయితే ఇల్లు అలకగానే పండగ కాదన్న సామితే… టీడీపీ జనసేన పొత్తుతో సమన్వయం ప్రధాన సమస్యగా మారింది. అయితే రాజకీయాలలో 2+2=4 కాదని అంటూ ఉంటారు. ఇక టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకోవడంతో అధికారం పై పార్టీ నేతల్లో ఆశలు కూడా చిగురించాయి.

ఈ క్రమంలోనే రెండు పార్టీల మధ్య టికెట్ల డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు అదే స్థాయిలో పెరగడం మొదలయ్యాయి. దీంతో ఈ రెండు పార్టీలలో ఒకరికి టికెట్ ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే కోపం వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక దీనికి మంచి ఉదాహరణ రాజమండ్రి రూరల్ సిటీ అని చెప్పాలి.ఎందుకంటే టీడీపీ తో చర్చలు జరుపుకుండానే కందుల దుర్గేష్ కు రాజమండ్రిలో టికెట్ ప్రకటించారు పవన్ కళ్యాణ్ . అయితే అక్కడ అసలేం జరిగింది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా రాజోలు మరియు రాజనగరంలో కూడా జనసేన పోటీ చేయబోతుందంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ క్రమంలోని పొత్తు ధర్మాన్ని పాటించకుండా చంద్రబాబు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారని పవన్ కళ్యాణ్ రీ పబ్లిక్ డే సందర్భంగా తెలియజేసిన విషయం తెలిసిందే.అయితే టీడీపీ మరియు జనసేన అధినేతలు ముందుగా అభ్యర్థులను ప్రకటించకుండానే పార్టీలో లొల్లి ప్రారంభమైంది. దీంతో అధినేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెప్పిన కూడా నేతలు వినిపించుకోలేని పరిస్థితి నెలకొంది. ఇక వైసీపీ అభ్యర్థుల విషయానికొస్తే…అభ్యర్థుల మార్పు చేర్పులు చిన్నచిన్న అలకలు తప్ప సీఎం వైయస్ జగన్ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత కనిపించడం లేదు. ఇక దీనికి గల ప్రధాన కారణం మళ్లీ వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సానుకూల వాతావరణమని చెప్పాలి. ఇక టీడీపీ మరియు జనసేన పొత్తులో చాలామంది టికెట్లు గల్లంతూ అవుతున్నాయనే భయం కూడా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తుంది. ఇక ఇప్పుడు బీజేపీ కూడా ఈ పొత్తులో తోడవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో నేతలు చాలామంది త్యాగాలకు సిద్ధపడాల్సి వస్తుంది. పోనీ కూటమి అధికారంలోకి వస్తుందని నమ్మకం ఉంటే వారి నాయకత్వాన్ని పోగొట్టుకొని త్యాగలకు సిద్ధమవుతారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణం బట్టి చూస్తే అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి క్రమంలో వైసీపీ ఎన్నికల శంఖారావం భీమిలిలో మొదలుపెట్టి ఇప్పటికే మూడు సభలను పూర్తి చేసింది. ఇక ఇక్కడ వాస్తవంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒకదానికి మించి మరొక సభ సూపర్ డూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి.దీంతో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడనే బలమైన సంకేతాలు వైసీపీ సిద్ధం సభలు విజయవంతం అవడం ద్వారా తెలుస్తోంది. దీంతో ఇప్పటికే వైసీపీ పార్టీని వీడిన నేతలు కూడా ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా పార్టీ వీడి నెల రోజులు కాకుండానే తిరిగి మళ్ళీ పాత గుటికి చేరుకున్నారు.ఇక కూటమిలో సీట్లు టికెట్లు కీచులాట జరుగుతుంటే వైసీపీ మాత్రం సిద్ధం సభలతో సానుకూల వాతావరణంలో దూసుకుపోతుంది. దీంతో జనసేన టీడీపీ బీజేపీ కూటమితో అధికారంలోకి వచ్చేది లేదని భావించిన నేతలు వైసీపీ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

1 hour ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

2 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

3 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

5 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

6 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

7 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

8 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

9 hours ago