Husband Wife : ఇదేం పాపంరా నాయనా..? సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య..?

 Authored By sudheer | The Telugu News | Updated on :20 February 2026,12:00 pm

ప్రధానాంశాలు:

  •  దేవుడా... భర్తకు టీవీ సౌండ్ తగ్గించమనే అధికారం కూడా లేదా..? సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య

  •  టీవీ సౌండ్ తగ్గించమ పాపనికి భర్తను చంపిన భార్య

Husband Wife  : ఏపీలోని గుంటూరు జిల్లాలో అత్యంత విషాదకరమైన, విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. కేవలం టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు ఓ భార్య తన భర్తను కత్తితో పొడిచి ప్రాణాలు తీసింది. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో జరిగిన ఈ దారుణం స్థానికంగా పెను కలకలం రేపింది. మృతుడు షేక్ అహ్మద్ (26) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఏడాదిన్నర క్రితం క్రాంతి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. క్రాంతికి అప్పటికే వివాహం కాగా, ఆమె మొదటి భర్త ఒక నేరారోపణలో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో అహ్మద్, క్రాంతి మధ్య ఏర్పడిన వివాహేతర సంబంధం కాస్తా పెళ్లికి దారితీసింది. వీరిద్దరూ రెండో వివాహం చేసుకుని పెదవడ్లపూడిలో కాపురం ఉంటున్నారు. అయితే, వీరి మధ్య చిన్నపాటి వివాదాలు తరచూ జరుగుతుండేవని సమాచారం.

Husband Wife : ఇదేం పాపంరా నాయనా..? సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య..?

Husband Wife : ఇదేం పాపంరా నాయనా..? సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య..?

Husband Wife  ప్రాణం తీసిన టీవీ సౌండ్

గురువారం నాడు ఇంట్లో క్రాంతి టీవీ చూస్తుండగా, సౌండ్ ఎక్కువగా ఉండటంతో అహ్మద్ ఆమెను సౌండ్ తగ్గించమని కోరాడు. కేవలం ఈ చిన్న విషయానికే ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం మొదలైంది. కోపంతో ఊగిపోయిన క్రాంతి, ఇంట్లోని కత్తిని తీసుకుని అహ్మద్‌పై విచక్షణారహితంగా దాడి చేసింది. కత్తిపోట్లు తీవ్రంగా తగలడంతో అహ్మద్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. అది చూసిన స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.

 

Husband Wife  : సమాజంలో పెరుగుతున్న అసహనం

అతి చిన్న గొడవలకు కూడా దారుణ హత్యలు జరగడం చూస్తుంటే సమాజంలో సహనం ఎంతలా క్షీణిస్తుందో అర్థమవుతోంది. భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అన్యోన్యత పోయి, క్షణికావేశంలో నేరాలకు పాల్పడుతున్న ఉదంతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితురాలు క్రాంతిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. టీవీ సౌండ్ వంటి సామాన్య కారణానికి భర్తను చంపిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి