YS Jagan : మళ్లీ నేనే సీఎం .. వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తా.. మరోసారి తెరపైకి రాజధాని అంశం..!
YS Jagan : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి కొనసాగుతుంది. ఇక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా నేనే గెలుస్తాను అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా వైయస్ జగన్ వైజాగ్ లో మాట్లాడుతూ ఈసారి నేనే ముఖ్యమంత్రిగా గెలుస్తా. వైజాగ్ లోనే ప్రమాణస్వీకారం చేస్తా అని వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా వైయస్ జగన్ వైజాగ్ వెళతారని, అక్కడే ఉండి ఆంధ్రప్రదేశ్ పాలన సాగిస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఆయన ఇంతవరకు వైజాగ్ షిఫ్ట్ అవ్వలేదు. కానీ అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన సీఎం అయితే వైజాగ్ లోనే ఉంటానని చెప్పడం వెనుక రెండు అంశాలు ఉన్నాయి. మళ్లీ ముఖ్యమంత్రి నేనే అని కాన్ఫిడెన్స్ గా చెప్పడం, రెండవది వైజాగ్ రాజధాని అనే అంశాన్ని తెర పైకి తేవడం.
రాజధానిగా అమరావతి పై చర్చలు మొదలయ్యాయి. గతంలో రాజధాని కోసం రైతుల కష్టాలు ఉద్యమాలు గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం వాళ్లను చర్చలకు కూడా పిలిపించలేదు. రాజధాని విషయంలో వైయస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలి. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదని అంశం ఎలక్షన్స్ పై ప్రభావితం కాదని అంటున్నారు. అమరావతి రాజధాని కావాలని కృష్ణ, కోస్తా, గుంటూరు, ప్రకాశం ప్రజలు కోరుకుంటారేమో కానీ రాజధాని ఇవ్వనందుకు వైయస్ జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని మాత్రం చెప్పరు. ఉత్తరాంధ్ర ప్రజాలు, వైజాగ్ ప్రజలు వైజాగ్ రాజధాని ఇస్తున్నాడని వైయస్ జగన్ కి ఓటు వేస్తామని అనరు. అయితే రాజధాని ఎక్కడైనా పెట్టండి, రాష్ట్రంలో ఉద్యోగాలు తీసుకురండి అని ప్రజలు భావిస్తున్నారు.
అయితే వైయస్ జగన్ వైజాగ్ వస్తానని చెప్పడం గెలిచిన తర్వాత ప్రమాణస్వీకారం వైజాగ్ లోనే జరగబోతుంది అని చెప్పడం వెనుక పెద్ద స్ట్రాటజీ కనిపిస్తుంది. గుంటూరు, విజయవాడ ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రాంతాలన్నీ పవన్ కళ్యాణ్ పొత్తు కారణంగా టీడీపీ జనసేనకు ఓటు వేయబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే వైయస్ జగన్ టీడీపీని క్లీన్ స్వీప్ గా ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రను హైలెట్ చేయడానికి వైయస్ జగన్ చూస్తున్నారు. ముఖ్యంగా వైజాగ్ ను హైలెట్ చేయడానికి వైఎస్ జగన్ ఆసక్తి చూపిస్తున్నారు. గుంటూరు, విజయవాడ, ఉభయగోదావరి ప్రాంతాలలో వైసీపీ గెలవదని స్పష్టంగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే వైయస్ జగన్ ఉత్తరాంధ్రలో కచ్చితంగా వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే అక్కడ వైజాగ్ ను హైలెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.