YS Jagan : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి కొనసాగుతుంది. ఇక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా నేనే గెలుస్తాను అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా వైయస్ జగన్ వైజాగ్ లో మాట్లాడుతూ ఈసారి నేనే ముఖ్యమంత్రిగా గెలుస్తా. వైజాగ్ లోనే ప్రమాణస్వీకారం చేస్తా అని వ్యాఖ్యానించారు. గత రెండేళ్లుగా వైయస్ జగన్ వైజాగ్ వెళతారని, అక్కడే ఉండి ఆంధ్రప్రదేశ్ పాలన సాగిస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఆయన ఇంతవరకు వైజాగ్ షిఫ్ట్ అవ్వలేదు. కానీ అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన సీఎం అయితే వైజాగ్ లోనే ఉంటానని చెప్పడం వెనుక రెండు అంశాలు ఉన్నాయి. మళ్లీ ముఖ్యమంత్రి నేనే అని కాన్ఫిడెన్స్ గా చెప్పడం, రెండవది వైజాగ్ రాజధాని అనే అంశాన్ని తెర పైకి తేవడం.
రాజధానిగా అమరావతి పై చర్చలు మొదలయ్యాయి. గతంలో రాజధాని కోసం రైతుల కష్టాలు ఉద్యమాలు గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం వాళ్లను చర్చలకు కూడా పిలిపించలేదు. రాజధాని విషయంలో వైయస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలి. ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదని అంశం ఎలక్షన్స్ పై ప్రభావితం కాదని అంటున్నారు. అమరావతి రాజధాని కావాలని కృష్ణ, కోస్తా, గుంటూరు, ప్రకాశం ప్రజలు కోరుకుంటారేమో కానీ రాజధాని ఇవ్వనందుకు వైయస్ జగన్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని మాత్రం చెప్పరు. ఉత్తరాంధ్ర ప్రజాలు, వైజాగ్ ప్రజలు వైజాగ్ రాజధాని ఇస్తున్నాడని వైయస్ జగన్ కి ఓటు వేస్తామని అనరు. అయితే రాజధాని ఎక్కడైనా పెట్టండి, రాష్ట్రంలో ఉద్యోగాలు తీసుకురండి అని ప్రజలు భావిస్తున్నారు.
అయితే వైయస్ జగన్ వైజాగ్ వస్తానని చెప్పడం గెలిచిన తర్వాత ప్రమాణస్వీకారం వైజాగ్ లోనే జరగబోతుంది అని చెప్పడం వెనుక పెద్ద స్ట్రాటజీ కనిపిస్తుంది. గుంటూరు, విజయవాడ ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రాంతాలన్నీ పవన్ కళ్యాణ్ పొత్తు కారణంగా టీడీపీ జనసేనకు ఓటు వేయబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే వైయస్ జగన్ టీడీపీని క్లీన్ స్వీప్ గా ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రను హైలెట్ చేయడానికి వైయస్ జగన్ చూస్తున్నారు. ముఖ్యంగా వైజాగ్ ను హైలెట్ చేయడానికి వైఎస్ జగన్ ఆసక్తి చూపిస్తున్నారు. గుంటూరు, విజయవాడ, ఉభయగోదావరి ప్రాంతాలలో వైసీపీ గెలవదని స్పష్టంగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే వైయస్ జగన్ ఉత్తరాంధ్రలో కచ్చితంగా వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే అక్కడ వైజాగ్ ను హైలెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.