
Ys Jagan : బాబు 11 నెలల్లో ఈ ఘోరాలా..? జగన్ సూటి ప్రశ్న..!
Ys Jagan : సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం లో చందనోత్సవం సందర్భంగా జరిగిన గోడ కూలిన ఘటన రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్లో ఆలయ గోడ కూలి ఏడుగురు మృతిచెందడం అందరినీ విషాదంలో ముంచింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటంతో ఈ ఘటన మరింత దురదృష్టకరంగా మారింది. సంఘటన అనంతరం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ చేరుకుని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
#image_title
ఈ ఘటనపై స్పందించిన జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. “పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు తరలివస్తారన్న విషయం ప్రభుత్వానికి తెలియదా? కనీస భద్రతా చర్యలు తీసుకోకుండా ఎందుకు నిర్లక్ష్యం వహించారు?” అని ప్రశ్నించారు. గతంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాటను గుర్తు చేస్తూ, అదే తరహాలో సింహాచలంలో కూడా అధికారుల ఘోర తప్పిదం కారణంగానే ప్రాణ నష్టం జరిగిందని ఆరోపించారు.
గోడ నిర్మాణంపై అనుమానాలు వ్యక్తం చేసిన జగన్ ఇటీవలే ప్రారంభించిన నిర్మాణాన్ని నాసిరకంతో పూర్తి చేయడం ఏంటి ? అని ప్రశ్నించారు. టెండర్లు లేకుండా పనులు అప్పగించడం, కాలమ్స్ లేకుండా గోడ నిర్మించడం అవినీతి పరంపరకి నిదర్శనమని వ్యాఖ్యానించారు. గత 11 నెలల చంద్రబాబు పాలనలో వరుసగా జరుగుతున్న సంఘటనలు .. తిరుపతిలో తొక్కిసలాట, శ్రీకూర్మం ఆలయంలో తాబేళ్ల మృతి, గోశాలలో గోవుల మృతి వంటి ఘటనలన్నీ ప్రభుత్వ యంత్రాంగం ఎంతగా విఫలమైందో చాటుతున్నాయని జగన్ మండిపడ్డారు.
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
Gold Ban In India : భారతీయులకు బంగారానికి ఉన్న భావోద్వేగ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.…
TATA : ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడుల…
సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు ఎప్పుడూ నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల స్కూల్ డేస్ ఫొటోలు బయటకు వస్తే…
Hantavirus : ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి జ్ఞాపకాలు ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు మరో వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.…
LPG Cylinder Rule : దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్న వేళ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో…
CM Vijay Trisha : తమిళనాడు రాజకీయాల్లో చరిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతూ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ…
Eluru : నమ్మకమే పెట్టుబడిగా, భక్తిని అడ్డం పెట్టుకుని సామాన్య ప్రజలను వంచించే వారు సమాజంలో పెరిగిపోతున్నారు. పశ్చిమ గోదావరి…
Neem Water Bath Benefits : వేపలో వేల ఏళ్లుగా గుర్తించబడిన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ…
Sweating : చెమట పట్టడం అనేది శరీరంలో జరిగే ఒక అత్యంత సంక్లిష్టమైన జీవక్రియ. దీనిని శాస్త్రీయ పరిభాషలో 'థర్మోరెగ్యులేషన్'…
Coffee : చాలామంది ఉదయం కళ్లు తెరవగానే బెడ్ కాఫీ కోసం వెతుకుతుంటారు. అల్పాహారం కంటే ముందే ఖాళీ కడుపుతో…
Mother : లోకంలో ఏ బంధమైనా ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశిస్తుందేమో కానీ, అమ్మ ప్రేమ మాత్రం ఎప్పుడూ నిస్వార్థంగానే…
This website uses cookies.