YS Jagan : అభ్యర్థులను ప్రకటిస్తున్న జగన్.. జనంలోకి వచ్చేది ఎప్పుడు..?
YS Jagan : ముందుగా వైసిపి అభ్యర్థులందరినీ ప్రకటించిన తర్వాతే పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ అభ్యర్థుల ఎంపికపై జగన్ తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే నాలుగో జాబితాను కూడా విడుదల చేసేందుకు వైసిపి పార్టీ సిద్ధమైంది. అయితే ఇప్పటికే మూడు జాబితాలను విడుదల చేసిన వైసిపి పార్టీ 59 స్థానాలలో ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారాలు జరుగుతున్నాయి. దీని కారణంగా ముందుగానే మార్పు చేర్పులు చేపడితే అసంతృప్తులు సర్దుకుంటారనే భావనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు ఈనెల 25 నుంచి జగన్ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని వైసిపి పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దాని కంటే ముందుగా కేడర్ తో సమీకరించడానికి సమాయత్తం చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే మొట్టమొదట ఉత్తరాంధ్రలో జగన్ పర్యటించనున్నారు.భీమిలిలో కార్యక్రమాలు నిర్వహించి సమావేశాలు జరిపి వైసీపీ శ్రేణులకు ముందుగా దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుపొందాలో అనే విషయాలపై ఆయన చర్చించనున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం చూసినట్లయితే జగన్ ఒక్కడే ఒకవైపు మిగిలిన ప్రతిపక్షాలన్నీ మరోవైపు అన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలవాలంటే వైసిపి పార్టీ శ్రేణులు మరియు కేడర్ క్రియాశీలకంగా పని చేయాల్సి ఉంటుంది.
అయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో గత నాలుగున్నర ఏళ్లవైసిపి పాలన కేడర్ తీవ్ర నిరుత్సాహానికి గురిచేసినట్లుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందుగా కేడర్ లోని అసంతృప్తులను పోగొట్టి వారిలో ఉత్సాహం నింపాలసి ఉంది. కాబట్టి జగన్ ముందుగానే అభ్యర్థులను ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నారు.అది చేసినప్పుడే ప్రత్యర్థులతో డీ అంటే డీ అని అధికార పార్టీ పోటీ పడగలుగుతుంది. ఇక వైసిపి శ్రేణుల అసంతృప్తిని గమనించిన జగన్ ముందుగా వారితో సమావేశాలు నిర్వహించి అనంతరం కోస్తా రాయలసీమ క్యాడర్ తో కూడా సమావేశాలు జరుపుతారు అని తెలుస్తోంది.ఆ తరువాత జనంలోకి జగన్ వెళ్ళనున్నట్లు సమాచారం.
Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…
Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. 4,687 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
This website uses cookies.