Home » Andhra Pradesh » Ys Jagan Announced Ycp Candidates
andhra pradesh

YS Jagan : అభ్యర్థులను ప్రకటిస్తున్న జగన్.. జనంలోకి వచ్చేది ఎప్పుడు..?

Authored By
aruna
The Telugu News | Published on: January 18, 2024, 2:00 pm
Advertisement

YS Jagan : ముందుగా వైసిపి అభ్యర్థులందరినీ ప్రకటించిన తర్వాతే పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ అభ్యర్థుల ఎంపికపై జగన్ తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే నాలుగో జాబితాను కూడా విడుదల చేసేందుకు వైసిపి పార్టీ సిద్ధమైంది. అయితే ఇప్పటికే మూడు జాబితాలను విడుదల చేసిన వైసిపి పార్టీ 59 స్థానాలలో ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే వచ్చే నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారాలు జరుగుతున్నాయి. దీని కారణంగా ముందుగానే మార్పు చేర్పులు చేపడితే అసంతృప్తులు సర్దుకుంటారనే భావనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

అంతేకాదు ఈనెల 25 నుంచి జగన్ జనంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని వైసిపి పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దాని కంటే ముందుగా కేడర్ తో సమీకరించడానికి సమాయత్తం చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే మొట్టమొదట ఉత్తరాంధ్రలో జగన్ పర్యటించనున్నారు.భీమిలిలో కార్యక్రమాలు నిర్వహించి సమావేశాలు జరిపి వైసీపీ శ్రేణులకు ముందుగా దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుపొందాలో అనే విషయాలపై ఆయన చర్చించనున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం చూసినట్లయితే జగన్ ఒక్కడే ఒకవైపు మిగిలిన ప్రతిపక్షాలన్నీ మరోవైపు అన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలవాలంటే వైసిపి పార్టీ శ్రేణులు మరియు కేడర్ క్రియాశీలకంగా పని చేయాల్సి ఉంటుంది.

అయితే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో గత నాలుగున్నర ఏళ్లవైసిపి పాలన కేడర్ తీవ్ర నిరుత్సాహానికి గురిచేసినట్లుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందుగా కేడర్ లోని అసంతృప్తులను పోగొట్టి వారిలో ఉత్సాహం నింపాలసి ఉంది. కాబట్టి జగన్ ముందుగానే అభ్యర్థులను ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్నారు.అది చేసినప్పుడే ప్రత్యర్థులతో డీ అంటే డీ అని అధికార పార్టీ పోటీ పడగలుగుతుంది. ఇక వైసిపి శ్రేణుల అసంతృప్తిని గమనించిన జగన్ ముందుగా వారితో సమావేశాలు నిర్వహించి అనంతరం కోస్తా రాయలసీమ క్యాడర్ తో కూడా సమావేశాలు జరుపుతారు అని తెలుస్తోంది.ఆ తరువాత జనంలోకి జగన్ వెళ్ళనున్నట్లు సమాచారం.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి