
Ys Jagan : కూటమి పాలన లో ఆడవారికి రక్షణ కరువు : వైఎస్ జగన్
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ‘ఆటవిక రాజ్యం’లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మహిళా రక్షణ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మరియు మంత్రుల అనుచరులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నా ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసు వ్యవస్థ అధికార పక్షానికి కొమ్ముకాస్తోందని జగన్ ధ్వజమెత్తారు.
Ys Jagan : కూటమి పాలన లో ఆడవారికి రక్షణ కరువు : వైఎస్ జగన్
జగన్ తన విమర్శల్లో పలువురు ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావిస్తూ నిర్దిష్టమైన ఆరోపణలు చేశారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ MLA Arava Sreedhar ఒక మహిళను మోసం చేసిన ఉదంతం, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వచ్చిన బలాత్కారం ఆరోపణలు రాష్ట్రంలో మహిళల భద్రతకు అద్దం పడుతున్నాయని అన్నారు. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపుల వల్ల ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యకు యత్నించడం, మంత్రి సంధ్యారాణి పీఏపై ఫిర్యాదు చేసిన బాధితురాలినే తిరిగి జైలుకు పంపడం వంటి ఘటనలు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ఆయన పేర్కొన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మంత్రి వాసంశెట్టి సుభాష్ల ప్రవర్తనపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న వారిని ప్రభుత్వం వెనకేసుకొస్తోందని జగన్ విమర్శించారు. బాధితులు సాక్ష్యాధారాలతో సహా బయటకు వచ్చి మొరపెట్టుకున్నా, వ్యవస్థలు స్తంభించిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ఈ ఘటనలపై స్పందించి బాధ్యులైన ప్రజా ప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళల గౌరవం మరియు భద్రత కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని జగన్ స్పష్టం చేశారు. ఇక రోజా అయితే జనసేన కాదు కామాంధుల సేన అంటూ దారుణమైన కామెంట్స్ చేసింది. మొత్తానికి శ్రీధర్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
వేసవి తాపం తీర్చుకోవడానికి పుచ్చకాయ (Watermelon) అమృతంలా పనిచేస్తుంది. కానీ, ఇటీవల ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు…
Myrobalan : చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య మలబద్ధకం. ఉదయాన్నే విరేచనం సాఫీగా కాకపోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా, కడుపు…
Software Engineer : సాఫ్ట్వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. హాయిగా సాగిపోతున్న అశోక్ జీవితంలోకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా 'పూజిత…
Pregnant Summer : గత కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి, ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యక్ష…
ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం.. ఫోర్లు, సిక్సర్ల జాతర! ఈ మెగా లీగ్లో బ్యాటర్లు అందరూ ప్రాణం ఇచ్చేది ఆ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
This website uses cookies.