Ys Jagan : కూటమి పాలన లో ఆడవారికి రక్షణ కరువు : వైఎస్ జగన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : కూటమి పాలన లో ఆడవారికి రక్షణ కరువు : వైఎస్ జగన్..!

 Authored By sudheer | The Telugu News | Updated on :29 January 2026,5:00 am

ప్రధానాంశాలు:

  •  జనసేన ఎమ్మెల్యే వీడియోల పై జగన్ కీలక వ్యాఖ్యలు

  •  Ys Jagan : కూటమి పాలన లో ఆడవారికి రక్షణ కరువు : వైఎస్ జగన్..!

Ys Jagan  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ‘ఆటవిక రాజ్యం’లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మహిళా రక్షణ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మరియు మంత్రుల అనుచరులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నా ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసు వ్యవస్థ అధికార పక్షానికి కొమ్ముకాస్తోందని జగన్ ధ్వజమెత్తారు.

Ys Jagan కూటమి పాలన లో ఆడవారికి రక్షణ కరువు వైఎస్ జగన్

Ys Jagan : కూటమి పాలన లో ఆడవారికి రక్షణ కరువు : వైఎస్ జగన్

Ys Jagan  మహిళా రక్షణ విషయంలో ప్రభుత్వం విఫలం – జగన్

జగన్ తన విమర్శల్లో పలువురు ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావిస్తూ నిర్దిష్టమైన ఆరోపణలు చేశారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ MLA Arava Sreedhar  ఒక మహిళను మోసం చేసిన ఉదంతం, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వచ్చిన బలాత్కారం ఆరోపణలు రాష్ట్రంలో మహిళల భద్రతకు అద్దం పడుతున్నాయని అన్నారు. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపుల వల్ల ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యకు యత్నించడం, మంత్రి సంధ్యారాణి పీఏపై ఫిర్యాదు చేసిన బాధితురాలినే తిరిగి జైలుకు పంపడం వంటి ఘటనలు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ఆయన పేర్కొన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మంత్రి వాసంశెట్టి సుభాష్‌ల ప్రవర్తనపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Ys Jagan  జనసేన కాదు కామాంధుల సేన – రోజా

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న వారిని ప్రభుత్వం వెనకేసుకొస్తోందని జగన్ విమర్శించారు. బాధితులు సాక్ష్యాధారాలతో సహా బయటకు వచ్చి మొరపెట్టుకున్నా, వ్యవస్థలు స్తంభించిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ఈ ఘటనలపై స్పందించి బాధ్యులైన ప్రజా ప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళల గౌరవం మరియు భద్రత కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని జగన్ స్పష్టం చేశారు. ఇక రోజా అయితే జనసేన కాదు కామాంధుల సేన అంటూ దారుణమైన కామెంట్స్ చేసింది. మొత్తానికి శ్రీధర్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

sudheer

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది