Ys Jagan : ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదు జగన్… ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వైయస్ జగన్ క్లారిటీ…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ys Jagan : ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదు జగన్… ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వైయస్ జగన్ క్లారిటీ…!

Ys Jagan : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీవ్ర చర్చనీ యాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష పార్టీలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఆసరాగా చేసుకుని అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మరి ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరితోపాటు ఎన్డీఏ కూటమి నేతలు అందరూ కూడా ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 May 2024,7:30 pm

ప్రధానాంశాలు:

  •  Ys Jagan : ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదు జగన్... ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వైయస్ జగన్ క్లారిటీ...!

Ys Jagan : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీవ్ర చర్చనీ యాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష పార్టీలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఆసరాగా చేసుకుని అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మరి ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరితోపాటు ఎన్డీఏ కూటమి నేతలు అందరూ కూడా ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక ఈ చట్టం ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులను దోచేస్తుందని కూటమి వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే కూటమి వర్గాలు చేస్తున్న ఈ విమర్శలకు వైసీపీ శ్రేణులు కూడా అంతే దీటుగా సమాధానం చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. తమ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు.

Ys Jagan : మీ బిడ్డ జగన్ ఇచ్చే వాడే కానీ లాక్కునేవాడు కాదు…

ఈ నేపథ్యంలోనే ఇటీవల విశాఖపట్నం జిల్లా పాయకారావుపేటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా… దాని గురించి ఏమీ తెలియకుండానే చంద్రబాబు నాయుడు దుష్ప్రచారాలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. బహుశా చంద్రబాబు నాయుడుకి జగన్ అంటే ఏంటో తెలియకపోవచ్చు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసని చెప్పుకొచ్చారు. జగన్ ఇచ్చే వాడే కానీ లాక్కునేవాడు కాదని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

Ys Jagan : భూములపై సర్వహక్కులు కల్పించటమే లక్ష్యం…

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ప్రజలకు వారి యొక్క భూములు పై సర్వహక్కులు కల్పించడమేనని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. దాదాపు వందేళ్ళ కిందట ఎప్పుడో బ్రిటిష్ కాలంలో మన రాష్ట్రంలో భూముల సర్వేలు జరిగాయి. ఇక ఆ తర్వాత నుండి సర్వేలు జరగలేదు. దీని కారణంగా భూములు యొక్క సబ్ డివిజన్ జరగలేదు. దీంతో రైతులు వారి భూములను అమ్మే సమయంలో మరియు విక్రయించే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని , అలాంటి ఇబ్బందులు లేకుండా ఇబ్బందులను దూరం చేయడమే ల్యాండ్ టైటిలింగ్ ప్రధాన లక్ష్యం అని జగత్ తెలిపారు. భూముల విషయంలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ దూరం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15వేల సచివాలయాలలో సర్వేయర్లను నియమించి భూములను రీ సర్వే చేపిస్తున్నట్లుగా తెలియజేశారు.

Ys Jagan ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదు జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వైయస్ జగన్ క్లారిటీ

Ys Jagan : ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదు జగన్… ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై వైయస్ జగన్ క్లారిటీ…!

ప్రతి ఒక్కరి వారి భూములపై సంపూర్ణ హక్కులు కల్పించేందుకే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములను రిసర్వే చేస్తున్నామని…సర్వే పూర్తి చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పత్రాలను భూమి యజమానులకు అందిస్తామని జగన్ తెలిపారు. భూ యజమానులకు ఎంతగానో మేలును చేకూర్చే ఇలాంటి కార్యక్రమానికి ప్రతిపక్షాలు మద్దతు తెలపకుండా ఆరోపిస్తున్నాయని జగన్ మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదని ఎవరు భూమిపై వారికి పూర్తి హక్కు లభిస్తుందని స్పష్టం చేశారు. ప్రజలకు నష్టం కలిగించే ఏ ఒక్క పని కూడా జగన్ చేయడని కావున ప్రతిపక్ష పార్టీలు చెప్పే అసత్యపు మాటలను ఎవరు నమ్మవద్దని ఈ సందర్భంగా జగన్ ప్రజలకు తెలిపారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది