
YS Jagan : షర్మిలని బయటకు పంపేందుకు జగన్ కొత్త ప్లాన్.. ఏకంగా కాంగ్రెస్లో విలీనం చేస్తారా..!
YS Jagan : ఈ సారి ఎన్నికలలో దారుణమైన ఓటమి చవి చూసిన జగన్ సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఎన్నికలలో ఘోర ఓటమిపాలై 11సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుండి హుటాహుటిన బెంగళూరుకు ఎందుకు వెళ్ళారు అన్నది ఏపీలో చర్చిస్తున్నారు. అయితే ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సిద్ధమయ్యారని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలను తొలగిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని ఆయన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జగన్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే విషయం గురించి మాట్లాడేందుకు బెంగళూరు వెళ్లారని అంటున్నారు. బెంగళూరు వేదికగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ తో జగన్ భేటీ అయ్యారని ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి షర్మిలను తొలగిస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని డీకే ముందు ఆఫర్ పెట్టారని పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. అయితే డీకే శివకుమార్ కాంగ్రెస్ హై కమాండ్ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం చెబుతామని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే విషయాన్ని బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వైఎస్ షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపిస్తే.. తన పార్టీని విలీనం చేస్తాననే నిస్సహాయత స్థితికి వెళ్లిపోయారు. 11 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది తనతో ఉంటారో తెలియని పరిస్థితి. నలుగురు ఎంపీలలో ఎంత మంది తనతో ప్రయాణిస్తారో తెలియని పరిస్థితి. రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి. దిక్కుతోచని పరిస్థితిలో జగన్ ఉన్నారు” అంటూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
YS Jagan : షర్మిలని బయటకు పంపేందుకు జగన్ కొత్త ప్లాన్.. ఏకంగా కాంగ్రెస్లో విలీనం చేస్తారా..!
అయితే వైసీపీ ఎంపీలు పార్టీ మారుతున్నారంటూ వస్తున్న ప్రచారాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఖండించారు. మరోవైపు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విషయానికి వస్తే.. ఆయన తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనపర్తి సీటు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లింది. ఆ పార్టీ తరుఫున అభ్యర్థిని సైతం ప్రకటించారు. అయితే తొలుత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించి.. ఆ తర్వాత బీజేపీకి ఇవ్వటంతో తెలుగుతమ్ముళ్లు భగ్గుమన్నారు. దీంతో చంద్రబాబు.. వ్యూహాత్మకంగా నల్లమిల్లిని బీజేపీలోకి పంపించారు. ఆ పార్టీ తరుఫున పోటీ చేయించారు. ఈ ఎన్నికల్లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 20 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొంది అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
Peddi Box Office Collection Day 3 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం…
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈరోజు మంచి వార్త వచ్చింది. గత కొన్ని…
Eat Eggs in Summer : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి…
Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…
Bandi Ramesh : కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…
This website uses cookies.