
YS Jagan : షర్మిలని బయటకు పంపేందుకు జగన్ కొత్త ప్లాన్.. ఏకంగా కాంగ్రెస్లో విలీనం చేస్తారా..!
YS Jagan : ఈ సారి ఎన్నికలలో దారుణమైన ఓటమి చవి చూసిన జగన్ సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఎన్నికలలో ఘోర ఓటమిపాలై 11సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుండి హుటాహుటిన బెంగళూరుకు ఎందుకు వెళ్ళారు అన్నది ఏపీలో చర్చిస్తున్నారు. అయితే ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సిద్ధమయ్యారని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలను తొలగిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని ఆయన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జగన్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే విషయం గురించి మాట్లాడేందుకు బెంగళూరు వెళ్లారని అంటున్నారు. బెంగళూరు వేదికగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ తో జగన్ భేటీ అయ్యారని ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి షర్మిలను తొలగిస్తే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని డీకే ముందు ఆఫర్ పెట్టారని పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. అయితే డీకే శివకుమార్ కాంగ్రెస్ హై కమాండ్ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం చెబుతామని చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. ఇక ఇదే విషయాన్ని బిజెపి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెల్లడించారు. వైఎస్ షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపిస్తే.. తన పార్టీని విలీనం చేస్తాననే నిస్సహాయత స్థితికి వెళ్లిపోయారు. 11 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది తనతో ఉంటారో తెలియని పరిస్థితి. నలుగురు ఎంపీలలో ఎంత మంది తనతో ప్రయాణిస్తారో తెలియని పరిస్థితి. రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి. దిక్కుతోచని పరిస్థితిలో జగన్ ఉన్నారు” అంటూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
YS Jagan : షర్మిలని బయటకు పంపేందుకు జగన్ కొత్త ప్లాన్.. ఏకంగా కాంగ్రెస్లో విలీనం చేస్తారా..!
అయితే వైసీపీ ఎంపీలు పార్టీ మారుతున్నారంటూ వస్తున్న ప్రచారాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఖండించారు. మరోవైపు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విషయానికి వస్తే.. ఆయన తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనపర్తి సీటు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లింది. ఆ పార్టీ తరుఫున అభ్యర్థిని సైతం ప్రకటించారు. అయితే తొలుత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించి.. ఆ తర్వాత బీజేపీకి ఇవ్వటంతో తెలుగుతమ్ముళ్లు భగ్గుమన్నారు. దీంతో చంద్రబాబు.. వ్యూహాత్మకంగా నల్లమిల్లిని బీజేపీలోకి పంపించారు. ఆ పార్టీ తరుఫున పోటీ చేయించారు. ఈ ఎన్నికల్లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 20 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొంది అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
Karthika Deepam 2 Today 07 March 2026 Episode : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్…
Tears-Sweet : మనకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కారుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు తిరిగినా లేదా శారీరకంగా కష్టపడినా చెమట…
Tea : మనలో చాలా మందికి భోజనం పూర్తయ్యాక వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటుగా…
Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…
Gold : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ఈ వింత ఉదంతం, నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు…
AI : బెంగళూరు ఐటీ నిపుణుడు పంకజ్ తన్వార్ తన ఇంట్లో జరుగుతున్న చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఉపయోగించిన వినూత్న…
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'సూపర్ సిక్స్' హామీలలో ఒకటైన 'తల్లికి వందనం' పథకం అమలుపై అసెంబ్లీ…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్, తన వినియోగదారుల సౌకర్యార్థం ఎన్నో దాగి…
Telangana Farmers : తెలంగాణలోని మొక్కజొన్న రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు…
Social Media Ban for Children : ఏపీ ప్రభుత్వం చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వినియోగంపై…
Ration Cards : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం…
This website uses cookies.