YS Jagan : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో దేశం తన వైపు చూసేలా చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి. కాగా 2024లో వై నాట్ 175 అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లారు ఆయన. కానీ తాను ఒకటి తలిస్తే ఏపీ ప్రజలు మరొకటి తలిచారు. ఘోరంగా ఓడించారు. అయితే ఇంత ఘోర ఓటమికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్. అంతులేని మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించి గెలుపు వరమాలను వేసిన ప్రజలు అంతకుమించి ఓటమిని కట్టబెట్టడానికి మధ్య కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం జగన్ పై ఉంది. వైఫల్యాలను అధిగమించి ముందుకెళ్లాలి. పార్టీ శ్రేణులను సమాయత్తపరిచి కూటమి ప్రభుత్వంపై పోరాటం పోరాడాలి. తాను పలావ్ పెట్టాను. చంద్రబాబు బిర్యానీ పెట్టారు. ఆ బిర్యానీకి నచ్చే వారంతా చంద్రబాబు వెంట వెళ్లారు. ఇప్పుడు పస్తులతో గడుపుతున్నారంటూ జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు
. ఇంకా ఆ సంక్షేమ పథకాల భ్రమలోనే ఆయన ఉన్నట్టున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తే ప్రజలు ఓటు వేస్తారని భావించారు. ఇప్పుడు ఇచ్చింది చెప్పడం కాదు. వైఫల్యాలను అధిగమించి కూటమి ఇచ్చిన హామీలను ప్రజలు గుర్తించేలా చేయాలి. అలా చేయాలంటే పోరాటాలు చేయాలి. ఆ పోరాటాలకు పార్టీ నాయకులు కలిసి రావాలి. విలువలు, విశ్వసనీయతల నమ్మి తాను రాజకీయం చేస్తున్నానని జగన్ చెప్పుకొస్తున్నారు. బలం లేకపోతే పోటీ చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి కూటమికి బలం లేకున్నా పోటీ చేస్తున్న విషయాన్ని ఆయన ఈ సదర్భంగా ప్రస్తావిస్తున్నారు. దాన్ని అధర్మ పోరాటంగా అభివర్ణిస్తున్నారు.
వైసిపి హయాంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో అధికార పార్టీగా ఉన్న ఆ ఎమ్మెల్సీ స్థానాలను వదులుకునేందుకు వైసీపీ ఇష్టపడలేదు. సాధారణంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలను వామపక్షాలు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు దక్కించుకునేవి. వాటిపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టేవి కావు. కానీ శాసన మండలిని చుట్టేయాలని జగన్ భావించారు. ఆ స్థానాల్లో సైతం పోటీ చేసి ఎమ్మెల్సీలను హస్తగతం చేసుకున్నారు. దాంతో విలువలు, విశ్వసనీయతల గురించి జగన్ మాట్లాడుతుండడాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
వారు దూరం జరుగడంతో అధికారం దూరం..
విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలతో జగన్ మాట్లాడారు. తన వైఫల్యాన్ని స్పష్టంగా ఒప్పుకున్నారు. గతంలో తనను అభిమానించిన వర్గాల్లో 10 శాతం మంది చేజారిపోయారన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. తన పాలనా వైఫల్యాన్ని పరోక్షంగా అంగీకరించారు. తాను నచ్చకో.. లేకుంటే చంద్రబాబు హామీలకు లొంగిపోయో 10 శాతం మంది కూటమి వైపు మొగ్గు చూపారని అందుకే తనకు ఓటమి ఎదురైందన్నారు. మొత్తానికి జగన్ ఇప్పుడిప్పుడే తన ఓటమిని అంగీకరిస్తున్నారు. అందుకు కారణాలనూ చెబుతుండటం విశేషం.
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
Electric Tractor : రైతులకు శుభవార్త... వ్యవసాయంలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచే సరికొత్త ట్రాక్టర్ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి…
This website uses cookies.