
Ys Jagan : జగన్ పెద్ద తప్పిదమే చేస్తున్నారా.. అలా చేస్తే పరువు అంతా గంగలో కలిసినట్టే..!
YS Jagan : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో దేశం తన వైపు చూసేలా చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి. కాగా 2024లో వై నాట్ 175 అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లారు ఆయన. కానీ తాను ఒకటి తలిస్తే ఏపీ ప్రజలు మరొకటి తలిచారు. ఘోరంగా ఓడించారు. అయితే ఇంత ఘోర ఓటమికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్. అంతులేని మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించి గెలుపు వరమాలను వేసిన ప్రజలు అంతకుమించి ఓటమిని కట్టబెట్టడానికి మధ్య కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం జగన్ పై ఉంది. వైఫల్యాలను అధిగమించి ముందుకెళ్లాలి. పార్టీ శ్రేణులను సమాయత్తపరిచి కూటమి ప్రభుత్వంపై పోరాటం పోరాడాలి. తాను పలావ్ పెట్టాను. చంద్రబాబు బిర్యానీ పెట్టారు. ఆ బిర్యానీకి నచ్చే వారంతా చంద్రబాబు వెంట వెళ్లారు. ఇప్పుడు పస్తులతో గడుపుతున్నారంటూ జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు
. ఇంకా ఆ సంక్షేమ పథకాల భ్రమలోనే ఆయన ఉన్నట్టున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తే ప్రజలు ఓటు వేస్తారని భావించారు. ఇప్పుడు ఇచ్చింది చెప్పడం కాదు. వైఫల్యాలను అధిగమించి కూటమి ఇచ్చిన హామీలను ప్రజలు గుర్తించేలా చేయాలి. అలా చేయాలంటే పోరాటాలు చేయాలి. ఆ పోరాటాలకు పార్టీ నాయకులు కలిసి రావాలి. విలువలు, విశ్వసనీయతల నమ్మి తాను రాజకీయం చేస్తున్నానని జగన్ చెప్పుకొస్తున్నారు. బలం లేకపోతే పోటీ చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి కూటమికి బలం లేకున్నా పోటీ చేస్తున్న విషయాన్ని ఆయన ఈ సదర్భంగా ప్రస్తావిస్తున్నారు. దాన్ని అధర్మ పోరాటంగా అభివర్ణిస్తున్నారు.
వైసిపి హయాంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో అధికార పార్టీగా ఉన్న ఆ ఎమ్మెల్సీ స్థానాలను వదులుకునేందుకు వైసీపీ ఇష్టపడలేదు. సాధారణంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలను వామపక్షాలు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు దక్కించుకునేవి. వాటిపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టేవి కావు. కానీ శాసన మండలిని చుట్టేయాలని జగన్ భావించారు. ఆ స్థానాల్లో సైతం పోటీ చేసి ఎమ్మెల్సీలను హస్తగతం చేసుకున్నారు. దాంతో విలువలు, విశ్వసనీయతల గురించి జగన్ మాట్లాడుతుండడాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
YS Jagan : వారు దూరం జరుగడంతో అధికారం దూరమైందంటున్న వైఎస్ జగన్
వారు దూరం జరుగడంతో అధికారం దూరం..
విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలతో జగన్ మాట్లాడారు. తన వైఫల్యాన్ని స్పష్టంగా ఒప్పుకున్నారు. గతంలో తనను అభిమానించిన వర్గాల్లో 10 శాతం మంది చేజారిపోయారన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. తన పాలనా వైఫల్యాన్ని పరోక్షంగా అంగీకరించారు. తాను నచ్చకో.. లేకుంటే చంద్రబాబు హామీలకు లొంగిపోయో 10 శాతం మంది కూటమి వైపు మొగ్గు చూపారని అందుకే తనకు ఓటమి ఎదురైందన్నారు. మొత్తానికి జగన్ ఇప్పుడిప్పుడే తన ఓటమిని అంగీకరిస్తున్నారు. అందుకు కారణాలనూ చెబుతుండటం విశేషం.
Hyderabad : హైదరాబాద్ నగరంలో పెట్రోల్ సరఫరా సమస్యలు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో ఐటీ రంగంపై దాని ప్రభావం స్పష్టంగా…
TVK Vijay Tamilnadu : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు అంతా విజయ్ మాయ నడుస్తోంది. తన సొంత పార్టీ తమిళగ వెట్రి…
Band Melam Movie Review : గతేడాది వచ్చిన 'కోర్ట్' సినిమాతో మంచి హిట్ అందుకుని ప్రేక్షకులను మెప్పించిన హర్ష్…
Iran vs USA Latest : ప్రస్తుతం ప్రపంచం చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే యుద్ధం ఆగిపోయిందని, ఇక అంతా…
YS Jagan : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత రాజకీయ వ్యూహాలు ఆ పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో…
KTR Arrest vs Revanth Reddy : ప్రస్తుత తెలంగాణ Telangana Politics రాజకీయాల్లో ఫార్ములా ఈ రేస్ ఉదంతం…
HPV Virus : సాధారణంగా సురక్షితమైన శృ0గారం అంటే అందరికీ కండోమ్స్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ చాలామందికి తెలియని విషయం…
Shakepet : హైదరాబాద్ నగరంలోని ఫిలింనగర్ పరిధిలోని షేక్పేట్ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్యాస్…
Lockdown In India : కరోనా మహమ్మారి సృష్టించిన లాక్డౌన్ కష్టాలను దేశ ప్రజలు ఇంకా మర్చిపోకముందే, ఇప్పుడు మరో…
Markapuram : తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా మార్కాపురం జిల్లాలో తెల్లవారుజామున…
Maddur : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి మార్గదర్శకులుగా నిలవాల్సిన ఒక ఉపాధ్యాయుడు, తన బాధ్యతలను విస్మరించి బాలిక పట్ల అసభ్యంగా…
Samsung Galaxy A Series : స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరోసారి తన సత్తాను చాటుతూ Samsung తన కొత్త గెలాక్సీ…
This website uses cookies.