Ys Jagan : కర్నూలు జైలు ఘటనపై జగన్ ఆగ్రహం.. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 13 August 2026, 10:59 pm
  •  Ys Jagan , కర్నూలు జైల్లో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని కలిసిన జగన్.. బయటకు వచ్చిన తర్వాత జైలు వద్ద తనను అవమానించారంటూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Ys Jagan : ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ YS Jagan తనదైన శైలిలో పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లిన జగన్.. జిల్లా జైలులో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్‌లో కలిశారు. అయితే ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఓ పరిణామం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం జగన్‌ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను మాజీ ముఖ్యమంత్రినని, తనను జైలు వద్ద అవమానించేలా వ్యవహరించారని ఆరోపించారు. జైలులోకి వెళ్లే ముందు సాధారణంగా లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి కెమెరాతో ఫొటో తీస్తారని తాను భావించానని చెప్పారు. అయితే తన విషయంలో మాత్రం జైలు గ్రిల్‌ బయటే నిలబెట్టి ఫొటో తీసి పంపించారని జగన్‌ పేర్కొన్నారు.

Ys Jagan : కర్నూలు జైలు ఘటనపై జగన్ ఆగ్రహం.. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు..!

Ys Jagan : కర్నూలు జైలు ఘటనపై జగన్ ఆగ్రహం.. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు..!

Ys Jagan జైలు వద్ద తనను అవమానించారన్న జగన్

తనను ఇలా ఎందుకు ఫొటో తీశారని జైలు అధికారులను ప్రశ్నించానని జగన్‌ తెలిపారు. అందరినీ ఇదే విధంగా ఫొటోలు తీస్తారా అని అడిగినట్లు చెప్పారు. అయితే పై స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తనను గ్రిల్‌ వద్ద నిలబెట్టి ఫొటో తీసినట్లు అధికారులు చెప్పారని జగన్‌ వెల్లడించారు.ఈ వ్యవహారంపై స్పందిస్తూ సీఎం చంద్రబాబుపై జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు శాడిస్టిక్ మనస్తత్వం ఉందంటూ ఆరోపించారు. తనను మాజీ ముఖ్యమంత్రిగా గౌరవించకుండా అవమానించేలా వ్యవహరించారని విమర్శించారు.తమ వైసీపీ ప్రభుత్వ హయాంలో ‘పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లు’ ఏర్పాటు చేశామని జగన్‌ గుర్తుచేశారు. పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చే ప్రజలను కూర్చోబెట్టి, చిరునవ్వుతో వారి సమస్యలను విని ఫిర్యాదులు స్వీకరించే విధంగా వ్యవస్థను రూపొందించామని చెప్పారు. కానీ ఇప్పుడు తన విషయంలోనే జైలు వద్ద అవమానకరంగా వ్యవహరించారని జగన్‌ ఆరోపించారు.

Ys Jagan చంద్రబాబుకు జగన్‌ వార్నింగ్.. “ఏది విత్తితే అదే పండుతుంది

జైలు అధికారులు పై స్థాయి నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పడం తనను మరింత ఆశ్చర్యానికి గురిచేసిందని జగన్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వానికి ఆయన హెచ్చరికలు జారీ చేశారు.“ఎప్పటికీ మీ ప్రభుత్వమే ఉండదు” అనే అర్థంలో జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎలాంటి సంప్రదాయాలకు శ్రీకారం చుడుతున్నారో, భవిష్యత్తులో అవే మీకు ఎదురయ్యే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఏది విత్తితే అదే పంటగా తిరిగి వస్తుందని వ్యాఖ్యానించారు. తప్పుడు సంప్రదాయాలను ప్రారంభిస్తే అవి భవిష్యత్తులో రెండింతలై చుట్టుకుంటాయని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.ఇప్పటికే చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయని, మిగిలిన మరో మూడేళ్లు కూడా ఇలాగే పూర్తవుతాయని జగన్‌ వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా పర్యటనలో జైలు వద్ద జరిగిన ఈ ఘటనపై జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp