Ys Sharmila : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల మధ్య దూరం క్రమేపీ పెరుగుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. రాఖీ పండుగ సందర్భంగా కూడా రాజకీయాలను పక్కనపెట్టి అన్నా చెల్లెళ్ళు కలవలేదు. షర్మిల జగన్ కు రాఖీ కట్టలేదు.ఇది అందరిని ఆశ్చర్యపరచింది. గతంలో ఒక తాటి మీద నడిచిన అన్నా చెల్లెలు ఇప్పుడు రాజకీయంగా బద్ధ శత్రువులుగా మారారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా షర్మిల ప్రధానంగా వైఎస్ జగన్ పాలనను టార్గెట్ చేసి జగన్ ను ఓడించాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసింది. ఇది కాస్త పని చేసిందని కొందరు భావిస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ తన పరాజయం పై ప్రభావం చూపిన అంశాల పై ఫోకస్ చేసారు. పార్టీ ప్రక్షాళన మొదలు పెట్టారు.
షర్మిల పరంగా జరిగిన నష్టం గుర్తించారు. ఫలితంగా జగన్ – షర్మిల మధ్య రాజీ చర్చలకు ఇద్దరు పెద్దలు చొరవ తీసుకున్నారు. ఎట్టకేలకు రాజీకి వచ్చారు. రాజకీయంగా ఇప్పుడు ఈ ఇద్దరు తీసుకునే నిర్ణయం ఏపీలో ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్నికల్లో జగన్ ఓటమి పాలయ్యే వరకూ షర్మిల తన అన్న ఓటమే లక్ష్యంగా పని చేసారు. కూటమి కంటే తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. ఇక.. జగన్ తన ఓటమికి కారణాల విశ్లేషణ..దిద్దుబాటులో భాగంగా పార్టీతో పాటుగా కుటుంబంలోనూ తీసుకోవాల్సిన నిర్ణయాల పైన కసరత్తు ప్రారంభించారు. రాజకీయంగా..కుటుంబ పరంగా జగన్ – షర్మిలతో దగ్గరగా ఉండే ఇద్దరు “పెద్దలు” రంగంలోకి దిగారు. బెంగళూరు కేంద్రంగా కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. జగన్ ఎన్నికల ఫలితాల తరువాత వారంలో మూడు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటూ.. మిగిలిన రోజులు బెంగళూరులో ఉంటున్నారు.
అక్కడే అన్నా – చెల్లి మధ్య చర్చలు పలు విడతలుగా జరిగినట్టు సమాచారం.. ముందుగా జగన్ – షర్మిల మధ్య ఆర్దిక పరమైన అంశాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. చర్చల సమయంలో షర్మిల కోరిన విధంగా ఆస్తిలో వాటాలు పంచుకోవాలని డిసైడ్ అయ్యారు. రెండు అంశాల్లో మినహా ఆస్తుల అంశాల్లో ఇద్దరి మధ్య దాదాపు రాజీ పూర్తయిందని సమాచారం. జమిలి ఎన్నికల ప్రచారం వేళ..పార్టీలో దిద్దుబాటు చర్యలతో పాటుగా.. తనను డామేజ్ చేసిన అంశాలను సరి దిద్దుకోవాలని..ఆ తరువాతనే ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ సిద్దం చేసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారు. అయితే.. ఇప్పుడు జగన్ – షర్మిల తాజా రాజీతో ఏపీ రాజకీయం ఎలా మారుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Lakshmi Devi : దీపావళి పండుగ అంటే దీపాల పండుగ.. మనదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు దీపావళి పండుగను…
Zodiac Signs : శనీశ్వరుడు కర్మ ఫలదాత. అలాగే న్యాయ దేవత. శని దేవుడు మనుషుల కర్మలను బట్టి ఫలితాలను…
Naga Chaitanya - Sobhita Dhulipala : అక్కినేని వారసుడు నాగ చైతన్య టాలీవుడ్ హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి…
Property Rules : ఈమధ్య ఎక్కువగా భూ మోసాలు జరుగుతున్నాయి. వాటి వల్ల చాలా కేసులు అవుతున్నాయి. ఆస్తిని కొనుగోలు…
Sundeep Kishan : టాలీవుడ్ హీరోలు సంపాదించడమే కాదు అందులో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకి కూడా ఉపయోగిస్తున్నారు. వారిలో…
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ మసాబ్ట్యాంక్లోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) ఖాళీగా ఉన్న జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి…
YS Sharmila : గత కొద్ది రోజులుగా జగన్,షర్మిళ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.…
Chandrababu - Pawan Kalyan : వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తీవ్ర వివాదాస్పదమైన అంశం.. రుషికొండ ప్యాలెస్ అన్న…
This website uses cookies.