
Ys Sharmila : కాంగ్రెస్ పెద్దల చొరవతో జగన్,షర్మిళ కలవబోతున్నారా.. ఒప్పందం ఏంటంటే..!
Ys Sharmila : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల మధ్య దూరం క్రమేపీ పెరుగుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. రాఖీ పండుగ సందర్భంగా కూడా రాజకీయాలను పక్కనపెట్టి అన్నా చెల్లెళ్ళు కలవలేదు. షర్మిల జగన్ కు రాఖీ కట్టలేదు.ఇది అందరిని ఆశ్చర్యపరచింది. గతంలో ఒక తాటి మీద నడిచిన అన్నా చెల్లెలు ఇప్పుడు రాజకీయంగా బద్ధ శత్రువులుగా మారారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా షర్మిల ప్రధానంగా వైఎస్ జగన్ పాలనను టార్గెట్ చేసి జగన్ ను ఓడించాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసింది. ఇది కాస్త పని చేసిందని కొందరు భావిస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ తన పరాజయం పై ప్రభావం చూపిన అంశాల పై ఫోకస్ చేసారు. పార్టీ ప్రక్షాళన మొదలు పెట్టారు.
షర్మిల పరంగా జరిగిన నష్టం గుర్తించారు. ఫలితంగా జగన్ – షర్మిల మధ్య రాజీ చర్చలకు ఇద్దరు పెద్దలు చొరవ తీసుకున్నారు. ఎట్టకేలకు రాజీకి వచ్చారు. రాజకీయంగా ఇప్పుడు ఈ ఇద్దరు తీసుకునే నిర్ణయం ఏపీలో ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్నికల్లో జగన్ ఓటమి పాలయ్యే వరకూ షర్మిల తన అన్న ఓటమే లక్ష్యంగా పని చేసారు. కూటమి కంటే తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. ఇక.. జగన్ తన ఓటమికి కారణాల విశ్లేషణ..దిద్దుబాటులో భాగంగా పార్టీతో పాటుగా కుటుంబంలోనూ తీసుకోవాల్సిన నిర్ణయాల పైన కసరత్తు ప్రారంభించారు. రాజకీయంగా..కుటుంబ పరంగా జగన్ – షర్మిలతో దగ్గరగా ఉండే ఇద్దరు “పెద్దలు” రంగంలోకి దిగారు. బెంగళూరు కేంద్రంగా కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. జగన్ ఎన్నికల ఫలితాల తరువాత వారంలో మూడు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటూ.. మిగిలిన రోజులు బెంగళూరులో ఉంటున్నారు.
Ys Sharmila : కాంగ్రెస్ పెద్దల చొరవతో జగన్,షర్మిళ కలవబోతున్నారా.. ఒప్పందం ఏంటంటే..!
అక్కడే అన్నా – చెల్లి మధ్య చర్చలు పలు విడతలుగా జరిగినట్టు సమాచారం.. ముందుగా జగన్ – షర్మిల మధ్య ఆర్దిక పరమైన అంశాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. చర్చల సమయంలో షర్మిల కోరిన విధంగా ఆస్తిలో వాటాలు పంచుకోవాలని డిసైడ్ అయ్యారు. రెండు అంశాల్లో మినహా ఆస్తుల అంశాల్లో ఇద్దరి మధ్య దాదాపు రాజీ పూర్తయిందని సమాచారం. జమిలి ఎన్నికల ప్రచారం వేళ..పార్టీలో దిద్దుబాటు చర్యలతో పాటుగా.. తనను డామేజ్ చేసిన అంశాలను సరి దిద్దుకోవాలని..ఆ తరువాతనే ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ సిద్దం చేసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారు. అయితే.. ఇప్పుడు జగన్ – షర్మిల తాజా రాజీతో ఏపీ రాజకీయం ఎలా మారుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్లోని…
Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…
Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…
This website uses cookies.