
Ys Sharmila : కాంగ్రెస్ పెద్దల చొరవతో జగన్,షర్మిళ కలవబోతున్నారా.. ఒప్పందం ఏంటంటే..!
Ys Sharmila : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల మధ్య దూరం క్రమేపీ పెరుగుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. రాఖీ పండుగ సందర్భంగా కూడా రాజకీయాలను పక్కనపెట్టి అన్నా చెల్లెళ్ళు కలవలేదు. షర్మిల జగన్ కు రాఖీ కట్టలేదు.ఇది అందరిని ఆశ్చర్యపరచింది. గతంలో ఒక తాటి మీద నడిచిన అన్నా చెల్లెలు ఇప్పుడు రాజకీయంగా బద్ధ శత్రువులుగా మారారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా షర్మిల ప్రధానంగా వైఎస్ జగన్ పాలనను టార్గెట్ చేసి జగన్ ను ఓడించాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసింది. ఇది కాస్త పని చేసిందని కొందరు భావిస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ తన పరాజయం పై ప్రభావం చూపిన అంశాల పై ఫోకస్ చేసారు. పార్టీ ప్రక్షాళన మొదలు పెట్టారు.
షర్మిల పరంగా జరిగిన నష్టం గుర్తించారు. ఫలితంగా జగన్ – షర్మిల మధ్య రాజీ చర్చలకు ఇద్దరు పెద్దలు చొరవ తీసుకున్నారు. ఎట్టకేలకు రాజీకి వచ్చారు. రాజకీయంగా ఇప్పుడు ఈ ఇద్దరు తీసుకునే నిర్ణయం ఏపీలో ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్నికల్లో జగన్ ఓటమి పాలయ్యే వరకూ షర్మిల తన అన్న ఓటమే లక్ష్యంగా పని చేసారు. కూటమి కంటే తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. ఇక.. జగన్ తన ఓటమికి కారణాల విశ్లేషణ..దిద్దుబాటులో భాగంగా పార్టీతో పాటుగా కుటుంబంలోనూ తీసుకోవాల్సిన నిర్ణయాల పైన కసరత్తు ప్రారంభించారు. రాజకీయంగా..కుటుంబ పరంగా జగన్ – షర్మిలతో దగ్గరగా ఉండే ఇద్దరు “పెద్దలు” రంగంలోకి దిగారు. బెంగళూరు కేంద్రంగా కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. జగన్ ఎన్నికల ఫలితాల తరువాత వారంలో మూడు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటూ.. మిగిలిన రోజులు బెంగళూరులో ఉంటున్నారు.
Ys Sharmila : కాంగ్రెస్ పెద్దల చొరవతో జగన్,షర్మిళ కలవబోతున్నారా.. ఒప్పందం ఏంటంటే..!
అక్కడే అన్నా – చెల్లి మధ్య చర్చలు పలు విడతలుగా జరిగినట్టు సమాచారం.. ముందుగా జగన్ – షర్మిల మధ్య ఆర్దిక పరమైన అంశాలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. చర్చల సమయంలో షర్మిల కోరిన విధంగా ఆస్తిలో వాటాలు పంచుకోవాలని డిసైడ్ అయ్యారు. రెండు అంశాల్లో మినహా ఆస్తుల అంశాల్లో ఇద్దరి మధ్య దాదాపు రాజీ పూర్తయిందని సమాచారం. జమిలి ఎన్నికల ప్రచారం వేళ..పార్టీలో దిద్దుబాటు చర్యలతో పాటుగా.. తనను డామేజ్ చేసిన అంశాలను సరి దిద్దుకోవాలని..ఆ తరువాతనే ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ సిద్దం చేసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారు. అయితే.. ఇప్పుడు జగన్ – షర్మిల తాజా రాజీతో ఏపీ రాజకీయం ఎలా మారుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.