ys sharmila as kadapa mp candidate
YS Sharmila : వైఎస్ షర్మిల.. ఈ పేరు మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో బాగా వినిపించింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ తరుపున ప్రచారం చేసి ఆ పార్టీ గెలిచిన తర్వాత వైఎస్ షర్మిల సైలెంట్ అయ్యారు. 2019 లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన చెల్లెలును పట్టించుకోలేదు అనేది వాస్తవం. అందుకే తన తల్లి విజయమ్మ కూడా వైసీపీని వీడి తన కూతురు పెట్టిన వైఎస్సార్టీపీ పార్టీ చెంతకు చేరారు. కొన్నేళ్ల పాటు తెలంగాణలో రాజకీయాలు చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తారు అని అంతా భావించారు. వైఎస్సార్టీపీ పార్టీ తరుపున తను పాలేరులో పోటీ చేస్తారని.. తన తల్లి విజయమ్మ కూడా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తారని భావించారు. కానీ.. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి షర్మిల చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. చివరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం షర్మిల యూటర్న్ తీసుకొని ఏపీ రాజకీయాల వైపు మళ్లినట్టు తెలుస్తోంది.
వైఎస్ షర్మిల ఏపీలో అడుగుపెట్టబోతున్నారు. ఏదో ఊరికే అడుగుపెట్టడం కాదు.. ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ లో తను కీలకంగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతో ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించాలని హైకమాండ్ కోరినట్టు తెలుస్తోంది. ఇది ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి షాక్ అనే చెప్పుకోవాలి. వైఎస్సార్ మరణం తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పార్టీ భూస్థాపితం అయింది. ఏపీలో నాశనం అయిపోయిన కాంగ్రెస్ పార్టీని మళ్లీ బతికించడం కోసం హైకమాండ్ ట్రై చేస్తోంది. జగన్ కు వ్యతిరేకంగా తన చెల్లెలునే హైకమాండ్ దింపుతోంది.
కడప లోక్ సభ స్థానం గురించి తెలుసు కదా. జగన్ అడ్డ అది. కానీ.. అక్కడే అన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నారట. ఎందుకంటే.. కడప ఎంపీ సీటులో ఆమె నిలబడితే.. కడప ప్రజలు అటు జగన్ కు మద్దతు ఇస్తారా? లేక వైఎస్సార్ కూతురు షర్మిలకు మద్దతు ఇస్తారా అనేది వేచి చూడాల్సిందే.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.