
Ys Sharmila : షర్మిల ఓవరాక్షన్ .. వైఎస్ జగన్ కు బెనిఫిట్..!
Ys Sharmila : ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా పగ్గాలు దక్కిన వెంటనే వై.యస్.షర్మిల కార్యక్షేత్రంలోకి దిగిపోయారు. ఇచ్చాపురం నుంచి యాత్ర కూడా మొదలుపెట్టారు. అచ్చంగా ఎన్నికలు వచ్చేసిన స్థాయిలో వ్యవహరిస్తున్నారు. బస్సు ప్రయాణం అంటే గిమ్మిక్కులు బహుశా ఈ దశలో ఆమెకు అవసరం కావచ్చు కానీ చాలా దూకుడుగా మాట్లాడే స్వభావం ఉన్న షర్మిల ప్రతిపక్షాలను విమర్శించడంలో కాస్త అతి చేస్తున్నారని అభిప్రాయం కొందరికి కలుగుతుంది. ఆమె అతి చేయడం ఒక ఎత్తు అయితే అన్న వై.యస్.జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేస్తున్నారు అనే భ్రమలో ఆయన అవకాశాలకు గండి కొట్టాలని ఆలోచన లో షర్మిల చేస్తున్న అతి జగన్ కే మేలు చేసేలా ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు అనేది జగన్ సర్కార్ మీద షర్మిల వేస్తున్న ప్రధాన నింద. అభివృద్ధి ఉంటే చూపించండి నేను వస్తా అని ఆమె సవాల్ విసురుతున్నారు.
కానీ ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా చేయని విధంగా నాతోపాటు ప్రతిపక్ష నాయకులను కూడా తీసుకొస్తా అని, మేధావులను కూడా తీసుకొస్తా అని, అభివృద్ధిని చూపించండి అని సవాలుకు కండిషన్స్ పెడుతున్నారు. దీంతో చాలామంది ఎమ్మెల్యేలు స్ట్రైట్ గా తమ నియోజకవర్గానికి రమ్మని, అభివృద్ధిని చూపిస్తామని ప్రతి సవాళ్లు విసురుతున్నారు. అయితే షర్మిల ప్రతిపక్షాలను కూడా తీసుకువస్తానని అనడంతో ఆమె చంద్రబాబు నాయుడు గూటి చిలకగా ఈ పలుకులు పలుకుతుందని అందరికీ అర్థమవుతుంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని విలన్ గా చిత్రీకరించడానికి షర్మిల ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఆమె వైయస్సార్ సీపీ ప్రభుత్వానికి బీజేపీతో సంబంధం అంటగడుతున్నారు. జగన్ సర్కార్ బీజేపీ చేతిలో కీలుబొమ్మలా మారిపోతుందని విమర్శిస్తున్నారు. రాహుల్ ని ప్రధాని చేయడం తన లక్ష్యం అంటున్న షర్మిల కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు మనసును చురగొనడానికి పదేపదే ఏపీలో మనుగడలో లేని బీజేపీని పెద్ద భూతంగా చిత్రీకరిస్తూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఆమె చేస్తున్న అతి కూడా జగన్ కు లాభమే అని పలువురు అంటున్నారు.
ఏపీలో బీజేపీ పార్టీ గెలిచేంత సత్తా లేకపోయినా వారికి కనీసం ఒక్క శాతం స్థిరమైన ఓటు బ్యాంకు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇప్పుడు అయోధ్య రామ మందిర్ ప్రారంభం జరిగిన తర్వాత మోడీ పట్ల అభిమానం పెరిగిన తర్వాత ఓటు బ్యాంకు కనీసం ఒక శాతం వరకు ఉండవచ్చు. వీరు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారు. టీడీపీ కూటమిలో బీజేపీ చేరకపోతే ఒంటరిగా పోటీ చేస్తుంది. అయినా ఒక్క స్థానంలో కూడా డిపాజిట్ తెచ్చుకోలేదు. అలాంటప్పుడు బిజెపికి ఓటు వేసి వృధా చేసుకునే బదులుగా బిజెపితో సత్సంబంధాలు ఉన్న జగన్ కి ఓటు వేస్తే మేలు కదా అనే భావన వారిలో కలిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి భావన పుట్టించడానికి షర్మిల మాటలు దారి తీయవచ్చు. నేరుగా కనిపించకపోయిన బీజేపీకి జగన్ కు సంబంధాన్ని అంటగడుతూ షర్మిల చేస్తున్న ప్రచారం ఎంతో కొంత జగన్ కు మేలు చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. జగన్ ఓట్లను షర్మిల ఏ మేరకు చీల్చగలదో తెలియదు కానీ ఆమె చేస్తున్న అతి వల్ల కొంత మేర జగన్ కు లాభం ఉంటుందని ఊహిస్తున్నారు.
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్లోని…
Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…
Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…
This website uses cookies.