YS Sharmila : జగన్,షర్మిళ మధ్య రాజీ కుదిరేలా లేదుగా.. సిగ్గులేదా అంటూ షర్మిళ ఆగ్రహం
YS Sharmila : గత కొద్ది రోజులుగా జగన్,షర్మిళ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే బెంగళూరు కేంద్రంగా జరుగుతున్న రాజీ చర్చలు ఫలించాయని, షర్మిల పరంగా జరిగిన నష్టం గుర్తించిన జగన్ చివరికి రాజీకి వచ్చినట్టు టాక్ నడడిచింది. ఇదంతా విని వైసీపీ క్యాడర్ ఫుల్ సంతోషిస్తున్న సమయంలో షర్మిళ పెద్ద బాంబ్ పేల్చింది. రాజీ వార్తలు బయటకు వచ్చి గంటలు గడవకముందే పీసీసీ చీఫ్ హోదాలో జగన్ మీద షర్మిల పేల్చిన డైలాగులతో మొత్తం వ్యవహారం మారింది అని అంటున్నారు. కుదిరింది వ్యక్తిగతంగా ఉన్న ఆస్తులకు సంబంధించిన వివాదమే కావచ్చు కానీ రాజకీయంగా జగన్ తో విభేదించేందుకే షర్మిల రెడి అయిందనే టాక్ వినిపిస్తుంది.
వైసీపీ కోసం షర్మిళ ఎంతో చేశారు. కానీ ఒక ఎంపీ సీటుని కూడా పొందలేకపోయారు .జగన్ జైలులో ఉన్నపుడు పార్టీని మొత్తంగా నిలబెట్టింది వేల కిలోమీటర్ల షర్మిల పాదయాత్ర అని ఇప్పటికీ అంతా చెబుతారు. కారణాలు ఏమైనా కూడా ఆమెకు రాజకీయంగా అందలం అయితే దక్కలేదు. ఆమె రాజ్యసభను కోరుకున్నారు అని దానికి కూడా చాన్స్ ఇవ్వలేదని కూడా అప్పట్లో ప్రచారం సాగింది. అయితే తాజాగా షర్మిళ జగన్పై నిప్పులు చెరగడం చర్చనీయాంశం అయింది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రూ.3,500 కోట్ల బకాయి పెట్టేందుకు సిగ్గులేదా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు.
YS Sharmila : జగన్,షర్మిళ మధ్య రాజీ కుదిరేలా లేదుగా.. సిగ్గులేదా అంటూ షర్మిళ ఆగ్రహం
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక అని ఎక్స్ వేదికగా సోమవారం ఆమె స్పష్టం చేశారు. నాడు వైఎ్సఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అద్భుతంగా అమలు చేశారని, ఆయన సొంత కొడుకై ఉండి జగన్ తన హయాంలో ఈ పథకాన్ని నీరుగార్చారని అసహనం వ్యక్తం చేశారు. రీయింబర్స్మెంట్ బకాయిలను కూటమి ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చూస్తుంటే అన్న చెల్లెళ్ల మద్య విబేధాలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
This website uses cookies.