
Serilingampalli BRS Party : రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.. పదవుల కోసం ప్రజలను మోసం చేశారు : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ
Serilingampalli BRS Party : శేరిలింగంపల్లి నియోజకవర్గం బీ.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,కార్యకర్తల ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి, ప్రజాస్వామ్యానికి పునాది అయిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ, గెలిపించిన ప్రజలకు, పార్టీకి వెన్నుపోటు పొడిచిన కొంత మంది కార్పొరేటర్ల పాపాలకు నిష్కృతి లేదని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. నేటితో కార్పొరేటర్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ నాయకులు స్థానిక అంబేత్కర్ విగ్రహం వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాజ్యాంగం రాసిన మీ సాక్షిగానే.. రాజ్యాంగ స్ఫూర్తిని చంపేసిన ఫిరాయింపుదారులను ప్రజలు రాబోయే ఎన్నికల్లో తమ ఓటు ద్వారా శిక్షించాలి.
Serilingampalli BRS Party : రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు.. పదవుల కోసం ప్రజలను మోసం చేశారు : శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ
బీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచి, రెండేళ్లు పదవిని అనుభవించి, తీరా అధికారం మారగానే నైతిక విలువలను వదిలేసి కాంగ్రెస్ గూటికి చేరడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. అంబేత్కర్ గారు రాసిన రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం)ను వీరు తుంగలో తొక్కారు. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ మారడం అంటే.. పరోక్షంగా రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ను అవమానించడమే అని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం స్వలాభం కోసమే ఈ జంపింగ్లు జరిగాయని, దీనిని ప్రజలెవరూ హర్షించడం లేదని పేర్కొన్నారు.
అంబేత్కర్ విగ్రహం సాక్షిగా బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించాయి. నేటితో మీ పదవీ కాలం ముగిసింది, రేపటి నుంచి మీరు కూడా ‘మాజీ’ లే, ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడగడానికి వస్తారు? అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించిన ఈ ‘మాజీ’లకు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
అవకాశవాద రాజకీయాలకు పాల్పడిన వారిని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలివెళ్ళిన వారిని మళ్లీ డివిజన్లలో అడుగుపెట్టనివ్వొద్దు. ఓటు అనే ఆయుధంతో వారికి బుద్ధి చెప్పండి అని బీఆర్ఎస్ నేతలు ప్రజలను కోరారు. ఇలాంటి వారికి టికెట్లు ఇస్తే చిత్తుగా ఓడించేందుకు శేరిలింగంపల్లి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అంబేత్కర్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
అధికారం శాశ్వతం కాదని, నమ్ముకున్న సిద్ధాంతం, నిలబడ్డ విలువలెప్పుడూ చరిత్రలో నిలిచిపోతాయని, కానీ ఈ ఫిరాయింపు ప్రజాప్రతినిధులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని స్థానిక నేతలు ఎద్దేవా చేశారు.
ENG vs WI T20 World Cup 2026 : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ICC T20…
Velidanda Village : వెలిదండ గ్రామంలో అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం…
Ram Charan Upasana Twins : మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (ఒక బాబు,…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మొన్నటి వరకు తిరుమల లడ్డూ…
Telangana Municipal Elections : తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న వేళ ‘పీపుల్స్ పల్స్’ సంస్థ…
BB Jodi Season 2 : ఈ వారం స్టార్ మాలో ప్రసారమయ్యే బిబి జోడి సీజన్ 2 ప్రోమో…
YSRCP : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుత పరిస్థితి మరియు పార్టీ…
Ram Charan Upasana Twins : మెగా పవర్స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారనే వార్త సోషల్…
This website uses cookies.