YS Sharmila : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు జోరుగా ప్రచారాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా వైయస్ఆర్ కుటుంబానికి చెందిన జగన్ మోహన్ రెడ్డి మరియు వైయస్ షర్మిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఇరువురు నువ్వా నేనా అన్న రీతిలో ఒకరిపై ఒకరు విస్తృతంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..వైయస్ షర్మిల కట్టుకున్న చీరపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పసుపు చీర కట్టుకుందని చంద్రబాబుతో అంతర్గతంగా పొత్తుకుదురుచుకుందని షర్మిలను ఉద్దేశిస్తూ జగన్ ఆరోపణలు చేశారు.
అయితే తాజాగా జగన్ వ్యాఖ్యలపై స్పందించిన వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ…మా జగనన్న షర్మిల పసుపు చీర కట్టుకుందని కోట్లాదిమంది ప్రజల సమక్షంలో సొంత చెల్లి అని కూడా చూడకుండా నేను కట్టుకున్న చీర గురించి హేళన చేస్తున్నారు. పసుపు చీర కట్టుకుందని చంద్రబాబుతో అంతర్గత పొత్తు పెట్టుకుంది అంటూ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నాడు. పసుపు రంగు కట్టుకుంటే తప్పా.. అదేమైనా చంద్రబాబు కొన్నాడా అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. సాక్షి పేపర్ మొదటి పేజీ కూడా పసుపు రంగులోనే ఉంటుంది కదా.. ఆ పత్రికకు ఇప్పుడు మీరే యజమానులు కదా దానికి ఏం సమాధానం చెబుతారు అంటూ షర్మిల ప్రశ్నించింది.
సాక్షి పత్రికను ప్రారంభించినప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు పసుపు రంగు ఉన్న పర్లేదని పత్రికను స్థాపించారు. పసుపు రంగు ఉన్నంత మాత్రాన అది వారిది కాదంటూ రాజశేఖర్ రెడ్డి ఆనాడు చెప్పినట్లు తెలిపారు. అంతేకాక పసుపు అనేది మంచికి శుభ శకునం కాబట్టి దానిని రాజశేఖర్ రెడ్డి గారు సాక్షి పత్రికలో కూడా ఉపయోగించారని తెలియజేశారు. అదేవిధంగా ఇంట్లో కూడా పసుపును వినియోగిస్తున్నాం కదా అది కూడా చంద్రబాబుదేనా అంటూ ఈ సందర్భంగా షర్మిల ఎద్దేవా చేశారు. జగన్ మోహన్ రెడ్డి గారు ఎవడో రాసిచ్చిన పేపర్ ను అమాంతం అలాగే చదివేస్తున్నాడని , కాస్త తెలివి ఉపయోగించి మాట్లాడాల్సిందిగా షర్మిల తెలిపింది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.