Home » Andhra Pradesh » Ys Sunitha Press Meet In Delhi About Ys Jagan
andhra pradesh

YS Sunitha : జగన్ మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాడు.. ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేసిన వై.యస్ సునీత…!

Authored By
Ramu
The Telugu News | Published on: March 2, 2024, 2:00 pm
Advertisement

YS Sunitha  : రెండు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా ఏ రాష్ట్రంలో ఉన్న ఏ దేశం లో ఉన్నా కూడా రెండు విషయాల్లో కంపల్సరీ తెలుగు వాళ్ళు ఏకీభవిస్తారు అని చెప్పాలి . వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అయినా ఎటువైపు నిలబడిన వాళ్ళు అయిన 95% లేదా 98% తెలుగు వాళ్ళు యాక్సెప్ట్ చేసే విషయాలు రెండు ఉంటాయి. అదే చంద్రబాబు వైపు ఉన్న తప్పు అలాగే ఒకటి జగన్ వైపు ఉన్న తప్పు. అయితే చంద్రబాబు నాయుడు సీనియర్ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని తీసుకున్నారు అనే విషయాన్ని 95% తెలుగు వాళ్ళు నమ్ముతున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ,తన బాబాయ్ వివేకానంద హత్య కు ,కారణం అయినటువంటి వారి ఉండి ముద్దాయిలను ఈయన కాపాడుతున్నారు అనే అంశాన్ని కూడా 95% ప్రజలు నమ్ముతున్నారు. పార్టీతో గాని ఆయనతో గాని ఎటువంటి సంబంధం లేను వాళ్ళు కచ్చితంగా ఈ విషయాలను ఒప్పుకుంటారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు వైఎస్ వివేకానంద హత్య కేసులో పార్టీలకు అతీతంగా వైయస్ సునీత చేసినటువంటి పోరాటాన్ని ఎవరైనా సరే సపోర్ట్ చేయాల్సిందే.

Advertisement

ఎందుకంటే తన కన్న తండ్రిని చంపినప్పుడు ఒక కూతురు ఇంత స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తున్నప్పుడు ఎవరైనా సరే ఆమెకు మద్దతుగా నిలవాల్సిందే. కాని జగన్మోహన్ రెడ్డి తన చెల్లి సునీత కి సపోర్ట్ చేయకుండా ముద్దాయిలను ,కాపాడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. అంతేకాక దీనికి సంబంధించిన న్యూస్ ఎక్కడ రాకుండా కాపాడుతూ వస్తున్నారు.అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి సునీత ఎత్తుతున్న ప్రశ్నలను ఏ రోజు ఏ సందర్భంలోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెడ్డి సమాధానం చెప్పకపోగా ప్రజల మధ్య కూడా ఈ కేసు గురించి డిస్కషన్ జరగకుండా ఉండాలని చూస్తున్నారు. అలాగే తన అనుకూల పత్రిక ద్వారా వేరేవాళ్ళ మీద తోసి వేయడం లేదా పోరాటం చేసున్న సునీతను వేరే వాళ్ళు వెనకాల ఉండి నడిపిస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ అంశాలన్నింటినీ ఆధారంగా చేసుకుని వై.యస్ సునీత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ గడచిన 5 సంవత్సరాలుగా తాను పడిన ఇబ్బందులు ఏంటి…? 5 సంవత్సరాలుగా తాను పడిన కష్టం..? తనకు ఎవరు సపోర్ట్ చేశారు..? ఎవరు ఎగైనెస్ట్ గా ఉన్నారు..? ఇవన్నీ ఆమె మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డిని అడ్డంగా బుక్ చేశారు అని చెప్పాలి.

అయితే ఆమె ఏం చెబుతుందంటే హత్యలు చేసే వ్యక్తులు ఉన్నటువంటి పార్టీలో మీరు సపోర్ట్ గా నిలబడకండి. హత్యలు చేసిన వారు ఉన్న పార్టీకి మీరు ఓట్లు వేయకండి. అది ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి హానికరం అంటూ ఆమె చాలా క్లియర్ గా ప్రపంచానికి తెలియజేశారు. ఈ విధంగా వైఎస్ సునీత ఓపెన్ గానే చెబుతూ నా అన్న జగన్ మోహన్ రెడ్డి పార్టీ మోసపూరితమైనదని పొరపాటున కూడా ఆ పార్టీకి ఓటు వేయకండి అని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు. అలాగే ఇన్ని రోజులు ఆమెకు మద్దతుగా నిలిచిన వైఎస్ షర్మిల , వైయస్ విజయమ్మ గారికి ఆమె కృతజ్ఞతలు చెబుతూ ముందుకు వెళ్లారు.ఇక ఈ విషయం వైయస్ జగన్ రానున్న ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రభావితం చేస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. వైయస్ సునీత ప్రెస్ మీట్ పెట్టి మరి వైయస్ జగన్ గురించి వైయస్ జగన్ పార్టీ ఒక నీచమైన పార్టీ అని ఎవరు ఆ పార్టీకి ఓట్లు వేయొద్దని చెప్పడం జరిగింది. ఇక ఈ ప్రభావం జగన్ మీద ఎలా ఉంటుంది. ఒక వేళ ప్రభావం ఉంటే ఆయన మళ్లీ సీఎం అవుతారా లేదా అనేది చూడాలి.

Ramu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి