Ysrcp : వైసీపీ కి మరో భారీ షాక్ తగలబోతుందా..?
ప్రధానాంశాలు:
Ysrcp : వైసీపీ కి మరో భారీ షాక్ తగలబోతుందా..?
Ysrcp : ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్ పదవిపై సాగుతున్న పోరాటం ఇప్పుడు పరాకాష్టకు చేరుకుంది. రాష్ట్రంలో అధికార మార్పు తర్వాత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రస్తుత మేయర్ హరి వెంకట కుమారి పదవి ప్రమాదంలో పడింది. మున్సిపల్ చట్టం ప్రకారం మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే నాలుగేళ్ల గడువు పూర్తికావాలి. ఇప్పుడు ఆ గడువు ముగియడంతో, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేయర్ పదవిని చేజిక్కించుకోవడానికి వ్యూహాలను అమలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఎన్డీఏ కూటమి చేతిలోకి వెళ్లిన నేపథ్యంలో విశాఖ మేయర్ పదవి గెలుచుకోవడం కూటమికి ప్రతిష్టాత్మకంగా మారింది.

Ysrcp : వైసీపీ కి మరో భారీ షాక్ తగలబోతుందా..?
Ysrcp వైజాగ్ మున్సిపల్ కార్పోరేషన్ పై టీడీపీ కన్ను
ప్రస్తుత GVMCలో మొత్తం 98 కార్పొరేటర్లలో, వైసీపీ 58 మంది సభ్యులతో మెజారిటీని కలిగి ఉంది. అయితే, స్టాండింగ్ కమిటీ ఎన్నికల సమయంలో 12 మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించి, టీడీపీ, జనసేన వైపు చేరారు. దీంతో వైసీపీ బలం 46కి తగ్గిపోయింది, కూటమి బలం 49కి చేరింది. కానీ అవిశ్వాస తీర్మానం విజయవంతం కావాలంటే 64 మంది మద్దతు అవసరం. ఈ నేపధ్యంలో, టీడీపీ, జనసేన నేతలు వైసీపీకి చెందిన మరిన్ని కార్పొరేటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కూటమి వ్యూహానికి సవాలుగా, వైసీపీ అధినాయకత్వం తన పార్టీ కార్పొరేటర్లను చైతన్యం చేస్తూ, వారిని పార్టీతోనే ఉంచేందుకు కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది.
గ్రేటర్ విశాఖ మేయర్ పదవి కోసం జరుగుతున్న ఈ రాజకీయ పోరాటం ఉత్కంఠగా మారింది. ఒకవేళ టీడీపీ, జనసేన కూటమి మేయర్ పదవిని చేజిక్కించుకోగలిగితే, అది వైసీపీకి రాష్ట్ర స్థాయిలో మరో పెద్ద షాక్ అవుతుంది. మరోవైపు మేయర్ హరి వెంకట కుమారి తన బలాన్ని నిరూపించుకోలేకపోతే కొత్త మేయర్ ఎన్నిక తప్పనిసరి అవుతుంది. వైసీపీ మున్సిపల్ పాలనపై అభ్యంతరాలు తెలుపుతూ మేయర్కు వ్యతిరేకంగా నోటీసులు సమర్పించాల్సి ఉంది. ఈ పరిస్థితులన్నీ రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.