Nara Lokesh : లోకేష్ ప్లానింగ్ చూసి బిత్తరపోతున్న వైసీపీ..!
ప్రధానాంశాలు:
Nara Lokesh : లోకేష్ ప్లానింగ్ చూసి బిత్తరపోతున్న వైసీపీ..!
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది. అదే నారా లోకేష్ మార్క్ పాలిటిక్స్. ఒకప్పుడు లోకేష్ను పప్పు అని, సరిగ్గా మాట్లాడలేడని ఎగతాళి చేసిన ప్రత్యర్థులే ఇప్పుడు ఆయన వేస్తున్న ఎత్తుగడలు చూసి నోరెళ్లబెడుతున్నారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన లోకేష్ ఇప్పుడు పార్టీకి అసలైన పవర్ సెంటర్గా మారారు. వారసత్వంతో పదవి దక్కిందని ఎవరూ వేలెత్తి చూపకుండా తనను తాను నిరూపించుకున్న తర్వాతే ఆయన ఈ పీఠం ఎక్కారు. అందుకే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లోకేష్ వ్యూహాలు అస్సలు అంతుచిక్కడం లేదు. గతంలో లోకేష్ అంటే సాఫ్ట్ అనుకునేవారు కానీ ఇప్పుడు ఆయన చూపిస్తున్న 2.0 వెర్షన్ ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది.
Nara Lokesh : లోకేష్ ప్లానింగ్ చూసి బిత్తరపోతున్న వైసీపీ..!
గత ఐదేళ్లలో లోకేష్ ఎదుర్కొన్న విమర్శలు, అవమానాలు మామూలవి కావు. ముఖ్యంగా బాడీ షేమింగ్ దగ్గర నుంచి ఆయన మాట తీరు వరకు ప్రతి విషయాన్ని వైసీపీ సోషల్ మీడియా వేదికగా హేళన చేసింది. కానీ ఆ అవమానాలనే లోకేష్ తన ఎదుగుదలకి పునాదిగా మార్చుకున్నారు. యువగళం పాదయాత్రతో ఊరు వాడ తిరిగి జనం నాడి పట్టుకున్నారు. వేల కిలోమీటర్ల నడక ఆయనకు పట్టుదలను నేర్పడమే కాకుండా కార్యకర్తల్లో ఒక కొత్త ఊపు తీసుకొచ్చింది. అప్పటి వరకు లోకేష్ అంటే ఒకలా ఉండే అభిప్రాయం ఆ యాత్రతో పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆయన ప్లానింగ్ మరీ వింతగా ఉంది. ఆయన చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ అన్నట్టు కాకుండా సైలెంట్గా పని ముగించేసి రిజల్ట్ చూపిస్తున్నారు.
లోకేష్ రెడ్ బుక్ పాలిటిక్స్ ఇప్పుడు వైసీపీ నాయకులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఆయన పట్టుకున్న ఆ ఎర్ర డైరీ కేవలం ఒక పుస్తకం కాదని అది తప్పు చేసిన అధికారులకు, అరాచకాలకు పాల్పడిన నేతలకు ఒక వార్నింగ్ అని ఆయన నిరూపిస్తున్నారు. లోకేష్ ప్లానింగ్ ఎలా ఉందంటే ఎక్కడా హడావుడి కనిపించదు కానీ చట్టం మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. ఎవరైతే గత ప్రభుత్వంలో అతి చేశారో వారందరి లెక్కలు బయటకు తీస్తూ ఒక పద్ధతి ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఈ సైలెంట్ అటాచ్మెంట్ను ఎలా ఎదుర్కోవాలో తెలియక వైసీపీ నేతలు అయోమయంలో పడిపోయారు. అసలు లోకేష్ మైండ్లో ఏముందో ఎవరికీ అర్థం కావడం లేదు.
నాయకుడిగా ఎదగడమే కాదు తన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడంలో కూడా లోకేష్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అసెంబ్లీలో తన తల్లిపై జరిగిన వ్యాఖ్యల విషయంలో ఆయన వెనక్కి తగ్గకుండా పోరాటం చేసిన తీరు అప్పట్లో కార్యకర్తల్లో పెద్ద భరోసా నింపింది. అలాగే పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల పేర్లను కూడా గుర్తు పెట్టుకుని మరీ వారికి అండగా నిలబడటం ఆయన ప్రత్యేకత. కార్యకర్తలకు ఏదైనా ఆపద వస్తే తానున్నానంటూ ఆయన ఇచ్చే ధైర్యం పార్టీకి పెద్ద బలం. మొత్తానికి లోకేష్ వ్యూహాలు ఇప్పుడు చాలా పకడ్బందీగా ఉంటున్నాయి. ప్రత్యర్థులు ఏమనుకుంటున్నారో ముందే ఊహించి దానికి తగ్గట్టుగా కౌంటర్ ప్లాన్స్ వేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో లోకేష్ ప్లానింగ్ చూసి అటు విపక్షం ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా బిత్తరపోతున్నారు.