
Ysrcp : టీడీపీ జనసేన అసంతృప్తుల కోసం గాలం వేస్తున్న వైసీపీ...!
Ysrcp : టీడీపీ జనసేన టికెట్ల వివాదం వలసలకు దారి తీసేలా కనిపిస్తుంది. గోదావరి జిల్లాలోకి టీడీపీ జనసేన పార్టీ శ్రేణుల లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. మరోవైపు అసంతృప్తిగా ఉన్న నేతల కోసం వైసీపీ గాలం వేస్తుంది. ముఖ్య నేతలను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని వైసీపీ కోరుతుంది. టీడీపీ జనసేన అధినేతలు స్పందించాల్సిందే అంటూ అసంతృప్తి నేతలు అల్టిమేట్ జారీ చేస్తున్నారు.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే టీడీపీ జనసేన ఉమ్మడి గోదావరి జిల్లాలో అసంతృప్తుల సెగలు రగులుకుంటున్నాయి. ఎక్కడికక్కడ అంత టీడీపీ క్యాడర్ మరియు జనసేన క్యాడర్ ఇద్దరు కూడా అసంతృప్తులను వెలగెక్కుతున్నారు. అలాగే నిరసనలు కూడా ఎక్కడికక్కడ వినిపించడం జరుగుతుంది. ఇక ఎక్కడైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వారిని తమ పార్టీలోకి ఆహ్వానించడానికి వైసీపీ అధిష్టానం నుంచి వైసీపీ నేతలు వరకు తమ ప్రయత్నాలను ప్రారంభించడం జరుగుతుంది. ఇక అంబేద్కర్ కోన సీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గం లో జనసేన ఇన్ ఛార్జ్ బండర శ్రీనివాస్ కి టికెట్ లభించకపోవడంతో ఆయన కూడా కాస్త అసంతృప్తితో ఉన్నారు. దానితో క్యాడర్ మొత్తం నిన్న నిరసనలు తెలియజేశారు.
అలాగే పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాలు ఫ్లెక్సీలు పీకి వేసి ఆ తర్వాత వాటిని ధ్వంసం చేయడం జరిగింది. స్థానిక వైసిపి అభ్యర్థి మరియు సిట్టింగ్ ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి వెళ్లి జనసేన ఇన్ ఛార్జ్ బండర శ్రీనివాస్ ని కలవడం జరిగింది. దీనితో అక్కడ రాజకీయం ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న ఎన్నికల్లో ఆయనకి టికెట్ రాని కారణంగా తనకి మద్దతు ఇవ్వాలని జగ్గిరెడ్డి శ్రీనివాస్ ను కోరినట్లు సమాచారం. అలాగే జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నుంచి టికెట్ ఆశించి బంగపడిన సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా కొద్దిరోజుల నుంచి వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలలో దూరంగా ఉంటున్నారు. అయితే చంటిబాబు క్యాడర్ మొత్తం కూడా టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు. వారు కూడా త్వరలోనే టీడీపీ లోకి చేరడం కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు కూడా టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది.
అయితే స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఉండడం తో ఆయన ఆ పార్టీలో చేరడం అనేది కొద్దిగా ఆలస్యం అవుతుందని చెప్పాలి. అయితే టీడీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే జ్యోతుల చంటిబాబు కూడా టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఇది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో టికెట్లు ప్రకటించిన తర్వాత ఈ రకంగా అసంతృప్తులు బయటకి రావడం జరుగుతుంది. అధికార పార్టీలో కూడా కొంతమంది టిక్కెట్ ఆశించి బంగపడిన నేతలు కూడా ఇదే రకమైన అసంతృప్తితో కొనసాగడం జరుగుతుంది. మరి ఈ అసంతృప్తుల సగ అనేది వచ్చే ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
This website uses cookies.