
Ysrcp Manifesto : మరింత ఆకర్షణీయంగా వైసీపీ మేనిఫెస్టో.. ఏ పథకానికి ఏంత పెంపు..!
Ysrcp Manifesto : మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను ఇటీవల అధికార పార్టీ వైసీపీ విడుదల చేసింది. ఇక ఈ మ్యానిఫెస్టోకు నవరత్నాలు ప్లస్ అని పేరు పెట్టారు. ఈ విధంగా పేరు పెట్టడానికి గల ముఖ్య కారణం గత ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల హామీలను కొనసాగించడం అని చెప్పాలి.కానీ ఈసారి ఈ నవరత్నాల లబ్ధిని మరింత పెంచడం జరిగింది. దీంతో ఈ మేనిఫెస్టోకు నవరత్నాల ప్లస్ టైటిల్ ను జోడించారు . ఈ క్రమంలోనే తాడేపల్లి వైసీపీ పార్టీ ఆఫీసులో ఇటీవల వైయస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఈనేపథ్యంలోనే మరోసారి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రెండు పేజీలతో కూడిన మేనిఫెస్టోను తీసుకువచ్చారు. ఇక ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా నవరత్నాలు పథకాలనే మళ్లీ ప్రకటించారు. కానీ ఈ పథకాలలో కొన్ని మార్పులు చేర్పులు చేపట్టడం జరిగింది. ఇక ఈ మేనిఫెస్టోలో విద్య ,ఆరోగ్యం, వ్యవసాయం ,సామాజిక భద్రత ,అభివృద్ధి , మౌలిక వసతులు, సుపరిపాలన,పోర్ట్స్ నిర్మాణం, వాలంటీర్లు వ్యవస్థ వంటివి ఉండనున్నట్లు తెలియజేశారు.
మహిళలకు సంబంధించి వైయస్ఆర్ చేయూత పథకం ద్వారా 45 నుండి 60 ఏళ్ల వయసుగలవారికి ఐదు సంవత్సరాలలో ₹1,50,000 దాకా పెంచుకుంటూ పోతామని తెలియజేశారు.
Ysrcp Manifesto : అలాగే అమ్మఒడి పథకం కింద రూ.17,000 ఉన్నట్టు తెలియజేశారు.
అలాగే వైయస్ఆర్ కాపు నేస్తం పథకం ద్వారా గతంలో నాలుగు ధపాలలో 60 వేలు ఇవ్వగా దీనిని ఇప్పుడు వచ్చే ఐదేళ్లలో లక్ష ఇరవై వేలు చేయనున్నట్లు తెలిపారు.
Ysrcp Manifesto : మరింత ఆకర్షణీయంగా వైసీపీ మేనిఫెస్టో.. ఏ పథకానికి ఏంత పెంపు..!
అలాగే వైయస్ఆర్ కళ్యాణమస్తు ,షాది తోఫా వాటివి కొనసాగుతాయని తెలియజేశారు.
అదేవిధంగా వైయస్ఆర్ సున్నా వడ్డీ కింద పొదుపు సంఘాల వారికి 3 లక్షల దాకా సున్నా వడ్డీ పై రుణాలు వస్తాయని తెలిపారు.
పేదలకు పెన్షన్ 3000 నుండి 3500 పెంచుతామని తెలియజేశారు.
రైతులకు రైతు భరోసా పథకం ద్వారా ఇదివరకు 13,500 ఇవ్వగా ఈసారి అధికారంలోకి వస్తే దానిని 16 వేలకు పెంచుతామని తెలిపారు.
అదేవిధంగా పేదలకు ఇండ్ల నిర్మాణం కూడా కొనసాగించే విధంగా పథకాలు తీసుకొస్తామని జగన్ తెలియజేశారు. ఇక ఈ మేనిఫెస్టోను ఆన్ లైన్ లో పెడతామని ఇది అందరికీ అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. మొత్తంగా వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో చాలా పథకాల లో పెంపు లేనప్పటికీ కొన్ని పథకాలలో మాత్రం స్వల్పంగా మనీ పెంచారు. ఇక ఈ కార్యక్రమంలో వైయస్ జగన్ మాట్లాడుతూ… అధికారంలోకి వస్తే విశాఖ నుండి తమ పాలన మొదలు పెడతామని ,మూడు రాజధానుల విషయంలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామని తెలియజేశారు.
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
MODI Geo politics : ప్రస్తుతం అరబ్ దేశాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్…
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు సిద్ధమైంది. రాబోయే 2026-27…
This website uses cookies.