
YSRCP : త్వరలో జగన్ మేనిఫెస్టో విడుదల... ఆ వర్గాల వారికి బంపర్ పథకం...!
YSRCP : ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టినటువంటి సిద్ధం సభలు ఏవైతే ఉన్నాయో ఈనెల 18న ఆఖరి సభతో ముగించాలని వైసీపీ పార్టీ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ముగింపు సభ కోసం అనంతపూర్ లో భారీగానే ప్లాన్స్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆఖరి సభలో ఎన్నికలకు సంబంధించిన తన మేనిఫెస్టోను విడుదల చేసేందుకు జగన్ నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో నవరత్నాలు అనే కాన్సెప్ట్ తో 2019లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్ అధికారంలోకి రావడానికి నవరత్నాలు ఎలాగైతే ఉపయోగపడ్డాయో ,ఇక ఇప్పుడు విడుదల చేసే మేనిఫెస్టోలో కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ హామీ లు ప్రజల కోసం తాను చేసేవి, కొత్తవి తీసుకురావాలి అనే అంశాలను మేనిఫెస్టో రూపంలో ప్రజల ముందు ప్రకటించబోతున్నారని సమాచారం. అయితే జగన్ విడుదల చేయబోయే మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది…?దానివలన ప్రతిపక్ష పార్టీలకు దెబ్బ తగులుతుందా…? అనే చర్చలు ఇప్పుడు బాగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే…
మేనిఫెస్టో తో ప్రతిపక్ష పార్టీలకు కచ్చితంగా దెబ్బ తగులుతుందని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ మేనిఫెస్టోలో మధ్యతరగతి పేద అలాగే మహిళలకు ప్రాధాన్యత ఉండబోతుందని అదేవిధంగా బీసీలకు ఇప్పటికి మించి వరాలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే రైతు రుణమాఫీల పై కూడా హామీ ఇచ్చే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక 2019లో ప్రకటించిన నవరత్నాల కు మించి 2024 ఎన్నికలు మేనిఫెస్టో లో హామీలు ఉండబోతున్నట్లుగా పార్టీ వర్గాల నుండి సమాచారం. ఇక జగన్ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఇంతకుముందు చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసినటువంటి సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టో పోల్చి చూడడం మొదలవుతుందని అంటున్నారు. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే చంద్రబాబు మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను తర్వాత నెరవేర్చడం లేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారంలోకి రావడానికి ఇష్టం వచ్చినట్లుగా హామీలను ఇస్తున్నారని చంద్రబాబుపై ఆరోపణలు వస్తున్నా. అయితే జగన్ మోహన్ రెడ్డి పై కూడా ఇలాంటి ఆరోపణలే వస్తున్నాయి.. ఇలా ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇద్దరి నాయకుల పైన ఒకే విధమైన ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు కేవలం వారు అధికారంలోకి రావడానికి మాత్రమే అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
ఎందుకంటే వారు ఎన్నికల నేపథ్యంలో ఇచ్చే హామీలు కొన్ని రాష్ట్రాన్ని దివాళా తీపించే దిశగా ఉంటాయని అందుకే వాటిలో కొన్ని ఎప్పటికీ జరగనివి కూడా మేనిఫెస్టోలో విడుదల చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. అంటే కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే వారు అలాంటి హామీలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు జగన్ తీసుకురాబోయి మేనిఫెస్టోలో ఎవరు ఊహించని హామీ ఒకటి ఉందని అంటున్నారు. అదే రైతు రుణమాఫీ. అయితే ఈ రైతు రుణమాఫీ ఎంతవరకు చేస్తామనేది కచ్చితంగా చెప్పి మేనిఫెస్టో విడుదల చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే 2014లో రైతు రుణమాఫీ అని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని చేయలేదని ప్రధాన ఆరోపణ ఒకటి ఉంది. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే చేస్తాడు అని తన పార్టీ తరఫు నుంచి ఏవైతే మాటలు వినిపిస్తున్నాయో వాటిని నెరవేర్చి దిశగా ఈనెల 18న ముగిసే సిద్ధం సభలో జగన్ ఈ మేనిఫెస్టోను విడుదల చేస్తూనే దానిలో రైతు రుణమాఫీని హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఏవైతే రైతు కుటుంబాలు ఉన్నాయో వారి ఓట్లను తన వైపు లాక్కునే ప్రయత్నం వైసీపీ పార్టీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Health Insurance : భారత ప్రభుత్వం ఇన్సూరెన్స్ రంగంలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్…
Rythu Bharosa : తెలంగాణలో రైతులకు ఆర్థికంగా తోడ్పడే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రెండో…
New Houses : ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
Gold Silver Rate 8th April 2026 : బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది కచ్చితంగా…
Karthika Deepam 2 April 8th 2026 Episode : స్టార్ మా Star Maa ఛానెల్లో ప్రసారం అవుతున్న…
Kissing Disease : ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పిన మాటకు కొత్త అర్థం ఇస్తున్నాయి తాజా వైద్య పరిశోధనలు.…
Chanakyaniti : ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి జీవన విధానం గురించి అలాగే కుటుంబం ఎలా ఉండాలి…
zodiac : ఏప్రిల్ 17న ఏర్పడుతున్న అక్షతి అమావాస్య జ్యోతిష్య పరంగా ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజు గ్రహాల స్థాన…
Ajit Doval : ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో భారత్ మరియు రష్యా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.…
Trisha : దక్షిణాది చిత్రసీమతో పాటు జాతీయ మీడియా, సోషల్ మీడియాలో సీనియర్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ పేరు ఇటీవలి…
Police Academy : దేశంలోని ప్రముఖ పోలీస్ శిక్షణ సంస్థల్లో ఒకటైన సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ…
kashmir Modi : భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద అంతర్గత సవాళ్లలో నక్సలిజం మరియు జమ్మూ కాశ్మీర్ సమస్యలు దశాబ్దాలుగా మానిపోని…
This website uses cookies.