yv subba reddy talks about changing sitting mlas in ysrcp
YV Subba Reddy : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయమే ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ అఖండ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. ఏపీలో 175 స్థానాలకు 175 స్థానాలు గెలుపే లక్ష్యంగా మరోసారి 2024 లో బరిలోకి దిగుతోంది వైసీపీ పార్టీ. 2019 ఎన్నికల్లో 150కి పైగా సీట్లు వస్తే ఈసారి మాత్రం 175 సీట్లకు 175 సీట్లు రావాల్సిందే అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే పార్టీలో పలు సంస్కరణలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. వైసీపీలో భారీ ప్రక్షాళన జరుగుతోంది. సిట్టింగ్ లను మార్చుతున్నారు. అది వైసీపీకి పెద్ద దెబ్బ అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న రచ్చ, హడావుడికి ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి చెక్ పెట్టారు. తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైతే మార్పు అవసరం అని భావించామో అక్కడే ఇన్ చార్జీలను మార్చామన్నారు. సిట్టింగ్ లను పక్కన పెడుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. 175 స్థానాలకు 175 స్థానాలు గెలవాలంటే ఖచ్చితంగా అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేర్పులు చేయాల్సిందే. అది తప్పదు.. ఏ పార్టీ అయినా అలాగే చేస్తుందన్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుంది.. దాని కోసం నాయకులు కూడా సహకరించాలి. కేవలం 175 స్థానాల్లో వైసీపీ గెలిచేందుకే ఈ మార్పులు తప్పితే వేరే ఉద్దేశంతో కాదు.. పార్టీని కొందరు వీడుతున్నా.. ఈ నిర్ణయం ఎవ్వరికి నచ్చకున్నా కూడా ఇబ్బందేం లేదు. ప్రజల ఆశీస్సులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్నాయి. ప్రజల ఆశీస్సులతో మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. చంద్రబాబు కాదు.. పవన్ కళ్యాణ్ కాదు.. ఇద్దరు కలిసి వచ్చినా కూడా జగన్ ను ఏం చేయలేరు. వాళ్లు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా జగన్ ఈక కూడా పీకలేరు.. అని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
విశాఖకు పరిపాలన రాజధాని మార్పుపై కోర్టులో కేసు నడుస్తుండటం వల్లనే రాజధాని ఏర్పాటు ఆలస్యం అవుతోంది. బీసీలకు న్యాయం చేయడం కోసమే కొన్ని చోట్ల ఇన్ చార్జ్ లను మారుస్తున్నాం. వంశీకృష్ణ యాదవ్ కు కూడా ఎమ్మెల్సీ ఇచ్చింది అందుకే.. అంటూ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
This website uses cookies.