
Business Idea in entrepreneur quits job to farm organic fruits earns lakhs
Business Idea : సాధించాలన్న తపన ఉండాలే కానీ బీడు భూమిలో కూడా బంగారం పండించొచ్చు. అదే చేసి చూపాడు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన స్వస్తిక్ ఫార్మ్స్ వ్యవస్థాపకుడు మన్ దీప్ వర్మ. సేంద్రీయ పద్ధతుల్లో కీవి పండ్లను పండిస్తూ ఏడాదికి రూ. 40 లక్షలు సంపాదిస్తున్నాడు వర్మ.హిమాలయాల దిగువన ఉన్న సోలాన్ జిల్లా షిల్లీ అనే గ్రామంలో పుట్టాడు మన్ దీప్ వర్మ. ఎంబీఏ పూర్తి చేసి ఢిల్లీలో ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం రావడంతో రాజధానికి వెళ్లాడు. నాలుగున్నరేళ్లుగా పని చేసినా వర్మకు… తన చేస్తున్న పనిలో ఏమాత్రం సంతృప్తి దొరకలేదు. కెరీర్ గ్రోత్ కూడా అంతగా లేకపోవడంతో తన ఉద్యోగం మానేసి ఏదైనా భిన్నంగా చేయాలనుకున్నాడు.
కానీ ఏం చేయాలి ఎలా చేయాలో తనకు తెలీదు. కొంత సమయం వెచ్చించి పరిశోధన ప్రారంభించాడు. ఆఖరికి సేంద్రీయ వ్యవసాయం చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. స్వగ్రామం షిల్లిలో 4.84 ఎకరాలు భూమి ఉండటంతో దానిలోనే ఏదైనా చేయాలనుకున్నాడు. కానీ అది పూర్తిగా బీడు భూమి కావడంతో దానిని చదును చేశాడు. హిమాలయాల దిగువన భూముల్లో సహజసిద్ధ పోషకాలు, భూసారం ఉంటుందని దానితోనే సాగు చేయాలని బలంగా అనుకున్నాడు.ఇంటర్నెట్ని ఉపయోగించాలని అవగాహన పెంచుకున్నాడు. వందలాది వీడియోలను చూశాడు. సేంద్రీయ మరియు సహజ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి ఆహారాన్ని పండించడానికి అవసరమైన వివిధ అంశాల గురించి నేను తెలుసుకున్నాడు.
Business Idea in entrepreneur quits job to farm organic fruits earns lakhs
వ్యవసాయ పత్రికలను రోజూ చదివేవాడు. స్థానిక అధికారులు మరియు ఉద్యానవన శాఖలో పనిచేసే నిపుణుల నుండి కొంత జ్ఞానం సంపాదించాడు. ఇలా వివరాలు, సబ్జెక్టు నేర్చుకుంటున్న సమయంలోనే కోతుల బెడద గురించి తెలిసింది. దీని గురించి నిపుణుల ముందు ప్రస్తావించినప్పుడు కివీ పండ్లు పండించమని వారు సలహా ఇచ్చారు. కివీ పండ్లు మొదట పుల్లగా ఉండటంతో పాటు జుట్టు లాంటి ఉపరితలం కలిగి ఉంటాయి. అందుకే ఈ పండ్ల జోలికి కోతులు రావని వాటినే సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన భూమిలో ఇప్పుడు కివీ పండ్లు పండిస్తూ ఏడాదికి సుమారు రూ. 40 లక్షలు సంపాదిస్తున్నాడు మన్ దీప్ వర్మ. ఇవి పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో పండి పండ్లు కావడంతో మంచి గిరాకీ ఉందని చెబుతున్నాడు వర్మ.
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
This website uses cookies.