Business Idea : సాధించాలన్న తపన ఉండాలే కానీ బీడు భూమిలో కూడా బంగారం పండించొచ్చు. అదే చేసి చూపాడు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన స్వస్తిక్ ఫార్మ్స్ వ్యవస్థాపకుడు మన్ దీప్ వర్మ. సేంద్రీయ పద్ధతుల్లో కీవి పండ్లను పండిస్తూ ఏడాదికి రూ. 40 లక్షలు సంపాదిస్తున్నాడు వర్మ.హిమాలయాల దిగువన ఉన్న సోలాన్ జిల్లా షిల్లీ అనే గ్రామంలో పుట్టాడు మన్ దీప్ వర్మ. ఎంబీఏ పూర్తి చేసి ఢిల్లీలో ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం రావడంతో రాజధానికి వెళ్లాడు. నాలుగున్నరేళ్లుగా పని చేసినా వర్మకు… తన చేస్తున్న పనిలో ఏమాత్రం సంతృప్తి దొరకలేదు. కెరీర్ గ్రోత్ కూడా అంతగా లేకపోవడంతో తన ఉద్యోగం మానేసి ఏదైనా భిన్నంగా చేయాలనుకున్నాడు.
కానీ ఏం చేయాలి ఎలా చేయాలో తనకు తెలీదు. కొంత సమయం వెచ్చించి పరిశోధన ప్రారంభించాడు. ఆఖరికి సేంద్రీయ వ్యవసాయం చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. స్వగ్రామం షిల్లిలో 4.84 ఎకరాలు భూమి ఉండటంతో దానిలోనే ఏదైనా చేయాలనుకున్నాడు. కానీ అది పూర్తిగా బీడు భూమి కావడంతో దానిని చదును చేశాడు. హిమాలయాల దిగువన భూముల్లో సహజసిద్ధ పోషకాలు, భూసారం ఉంటుందని దానితోనే సాగు చేయాలని బలంగా అనుకున్నాడు.ఇంటర్నెట్ని ఉపయోగించాలని అవగాహన పెంచుకున్నాడు. వందలాది వీడియోలను చూశాడు. సేంద్రీయ మరియు సహజ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి ఆహారాన్ని పండించడానికి అవసరమైన వివిధ అంశాల గురించి నేను తెలుసుకున్నాడు.
వ్యవసాయ పత్రికలను రోజూ చదివేవాడు. స్థానిక అధికారులు మరియు ఉద్యానవన శాఖలో పనిచేసే నిపుణుల నుండి కొంత జ్ఞానం సంపాదించాడు. ఇలా వివరాలు, సబ్జెక్టు నేర్చుకుంటున్న సమయంలోనే కోతుల బెడద గురించి తెలిసింది. దీని గురించి నిపుణుల ముందు ప్రస్తావించినప్పుడు కివీ పండ్లు పండించమని వారు సలహా ఇచ్చారు. కివీ పండ్లు మొదట పుల్లగా ఉండటంతో పాటు జుట్టు లాంటి ఉపరితలం కలిగి ఉంటాయి. అందుకే ఈ పండ్ల జోలికి కోతులు రావని వాటినే సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. తన భూమిలో ఇప్పుడు కివీ పండ్లు పండిస్తూ ఏడాదికి సుమారు రూ. 40 లక్షలు సంపాదిస్తున్నాడు మన్ దీప్ వర్మ. ఇవి పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో పండి పండ్లు కావడంతో మంచి గిరాకీ ఉందని చెబుతున్నాడు వర్మ.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.