
Business Idea punjab farmer grows organic dragon fruit earns lakhs
Business Idea : విధి మన విజయాన్నే ముందే రాసి పెడుతుంది. గెలుపు కోసం వెతకాల్సిన అవసరం కూడా రానియ్యదు. అదే తీసుకెళ్లి మరీ విజయం అంటే ఏంటో దాని రుచి చూపిస్తుంది. విధి నడిపించిన దారిలో వెళ్లే చాలు విజయానికి సోపానాలు పడినట్లే. అలాంటిదే జరిగింది పంజాబ్ కు చెందిన అమన్ దీప్ సింగ్ సరావ్ జీవితంలో.. రాంగ్ రూటులో కారు నడుపుకుంటూ వెళ్లిన అమన్ ను విధి మాత్రం కరెక్టు దారిలోనే పెట్టింది.పంజాబ్ కు చెందిదన అమన్ దీప్ సింగ్ సరావ్ 2017 లో డిగ్రీ పూర్తి చేశాడు. తర్వాత ఒక రోజు తన స్నేహితులతో కలిసి గుజరాత్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కారులో వెళ్తుండగా ఆ మిత్రులు ప్రయాణిస్తున్న కారు ఒక చోట దారి తప్పింది. ఆ దారి వారిని పంజాబ్ రాష్ట్ర శివార్లలోకి తీసుకెళ్లింది. అసలు ప్రదేశానికి వాళ్లు తిరిగి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, కాక్టి లాగా కనిపించే తోటల శ్రేణి గుండా వెళ్ళారు.
అలా వెళ్తున్నప్పుడే వారికి ఒక ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. అమన్దీప్ మరియు అతని స్నేహితులు కారు దిగాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ఉన్న తోటల చుట్టూ తిరిగారు మరియు మొక్కలపై ఒక ప్రత్యేకమైన పండు వేలాడుతున్నట్లు గ్రహించారు.ఆ వేలాడుతున్న పండ్లు వారిని చాలా ఆకర్షించాయి. వాటి గురించి ఆరా తీయడం మొదలెట్టారు. అవి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అని చెప్పారు ఆ రైతులు. మార్కెట్లో చాలా డిమాండ్తో కూడిన విదేశీ పండు అని, ఇది ఆ రైతుకు మంచి లాభాలను సంపాదించడంలో సహాయపడిందని తెలుసుకున్నారు. తరువాత, మరింత సమాచారం కోసం పొరుగున ఉన్న నాలుగు పొలాలను సందర్శించాడు అమన్ సింగ్. పంజాబ్లోని తన పొలంలో పండ్ల రకాన్ని తిరిగి ప్రయోగించాలని నిర్ణయించుకున్నాడు అమన్.అమన్దీప్ సోషల్ మీడియా మరియు యూట్యూబ్లో డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ గురించి మరింత తెలుసుకున్నాడు.
Business Idea punjab farmer grows organic dragon fruit earns lakhs
అలాగే ఈ పండు భారతదేశంలో విపరీతమైన ఆదరణ పొందుతోందని గ్రహించాడు. ఇది లాభదాయకమైన ప్రతిపాదన, డ్రాగన్ ఫ్రూట్ కిలో ధర రూ. 200-225. మహారాష్ట్ర మరియు హైదరాబాద్లో సాగు చేస్తున్న కొంత మంది రైతులను అమన్ సందర్శించాడు. అమన్ దీప్ ఈ రాష్ట్రాల నుండి మొక్కలను సేకరించి, సాగు కోసం మాన్సా గ్రామంలోని తన పొలంలో రెండు ఎకరాల భూమిని చదును చేసి వాటిని నాటాడు. కానీ మొదటి ప్రయత్నంలోనే అతనికి విజయం దక్కలేదు. అతను ఘోరంగా విఫలమయ్యాడు. వాతావరణానికి సరిపోక పోవడంతో మొక్కలు చనిపోయాయి. ఇలా ఒకసారి కాదు రెండు సార్లు కాదు నాలుగేళ్ల నష్టాలు చవిచూశాడు. డ్రాగన్ ఫ్రూట్ మొక్కల అవసరాలు వాటి పెంపకం గురించి తెలుసుకోవడానికి అమన్ దీప్ కు సమయం పట్టింది.
కొన్ని ఎదురుదెబ్బల తర్వాత ఎలాంటి రసాయనాలు, పురుగుల మందులు వాడకుండానే డ్రాగన్ ఫ్రూట్ పండించవచ్చని తెలుసుకున్నాడు అమన్ దీప్. ఆ తర్వాత అమన్దీప్ తన విధానాన్ని మార్చుకుని సేంద్రీయ వ్యవసాయ పద్ధతిని ఎంచుకున్నాడు. హర్బంత్ మరియు గుజరాత్ నుండి అప్పటికి స్నేహితులుగా ఉన్న ఇతర రైతుల నుండి మార్గదర్శకత్వం తీసుకున్నాడు. నేల సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి జీవామృతాన్ని ఉపయోగించాడు. మరియు వేపతో పాటు ఇతర సేంద్రియ పదార్థాలను ఉపయోగించాడు. వారి సలహాలు మరియు అమన్ దీప్ ప్రయత్నాలు ఫలితాలను చూపించడం ప్రారంభించాయి. పద్దెనిమిది నెలల తరువాత, మొక్కలు ఫలాలను ఇవ్వడం ప్రారంభించాయి. ప్రస్తుతం 12 రకాల డ్రాగన్ ఫ్రూట్ లు పండిస్తూ ఎకరాకు రూ.4 లక్షల ఆదాయం పొందుతున్నాడు అమన్.
Foods High in Gelatin : ఈ రోజుల్లో చాలామంది చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, చర్మంపై ముడతలు వంటి…
Maha Shivratri : ఫిబ్రవరి 15, 2026న రానున్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా, శివాలయ సందర్శనలో భక్తులు పాటించాల్సిన…
Today Horoscope 15th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రోజు (ఆదివారం, 15 ఫిబ్రవరి 2026)…
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
This website uses cookies.