Gold Silver Rate 31st March 2026 : పసిడి ప్రియులకు అలర్ట్: మళ్లీ భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gold Silver Rate 31st March 2026 : పసిడి ప్రియులకు అలర్ట్: మళ్లీ భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు

 Authored By jagadesh | The Telugu News | Updated on :31 March 2026,9:30 am

Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్ షాక్ తగులుతోంది. గత కొంతకాలంగా సామాన్యులకు కాస్త ఊరటనిస్తూ తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం మొదలైనప్పటి నుంచి పసిడి ధరల్లో తీవ్రమైన ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఒక దశలో భారీగా పతనం అయిన బంగారం రేట్లు, ఇప్పుడు మళ్లీ కొండెక్కుతున్నాయి. ముఖ్యంగా క్రూడాయిల్ ధరలు ఒక స్థాయికి చేరి స్థిరంగా ట్రేడవుతున్న వేళ, మదుపరులు Investors తమ పెట్టుబడుల కోసం మళ్లీ సురక్షిత సాధనమైన బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా రాత్రికి రాత్రే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో పసిడి ధర భారీ జంప్ చేసింది.

Gold Silver Rate 31st March 2026 పసిడి ప్రియులకు అలర్ట్ మళ్లీ భగ్గుమంటున్న బంగారం వెండి ధరలు

Gold Silver Rate 31st March 2026 : పసిడి ప్రియులకు అలర్ట్: మళ్లీ భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు

Gold Silver Rate 31st March 2026  అంతర్జాతీయ మార్కెట్‌లో రాత్రికి రాత్రే బిగ్ జంప్

సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అనిశ్చిత పరిస్థితులు ఎదురైనా, ఆర్థిక మాంద్యం భయాలు ఉన్నా.. ప్రజలు, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారానికే అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ, యుద్ధం కారణంగా క్రూడాయిల్ రేట్లు విపరీతంగా పెరగడంతో గత కొద్ది రోజులుగా ఈ ట్రెండ్ కనిపించలేదు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే, కేవలం మూడు నాలుగు రోజులు మినహాయించి, మిగతా 20 రోజులకు పైగా బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. గరిష్ఠ స్థాయిల నుంచి చూసుకుంటే ఏకంగా రూ. 30 వేలకు పైగానే పతనం కావడం గమనార్హం.

ఇలా ధరలు తగ్గడం వల్ల భౌతికంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సామాన్యులకు ఊరట లభించినప్పటికీ, పెట్టుబడిదారులను మాత్రం తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి ప్రధాన కారణం.. ద్రవ్యోల్బణం పెరగడంతో యూఎస్ ఫెడ్ US Fed వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడమే. దీంతో డాలర్ ఇండెక్స్ బలపడి, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు తమ ఆకర్షణను కోల్పోయాయి. కానీ ఇప్పుడు సీన్ మళ్లీ రివర్స్ అయింది. కనిష్ఠ స్థాయిల వద్ద మార్కెట్ స్థిరపడటంతో మదుపరులు మళ్లీ పసిడిపై భారీగా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు.

నిన్నటి వరకు అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4,450 డాలర్ల స్థాయిలో ఉండగా.. అది కాస్తా ఇప్పుడు ఒక్కసారిగా 4600 డాలర్ల మార్కును దాటేసింది. అంటే రాత్రికి రాత్రే 150 డాలర్లకు పైగా పెరిగిందన్నమాట. అదే సమయంలో సిల్వర్ రేటు కూడా ఏమాత్రం తగ్గలేదు. ఔన్సు వెండి ధర 68 డాలర్ల స్థాయి నుంచి ఏకంగా 73 డాలర్ల మార్కుకు చేరింది. ఇక భారత కరెన్సీ విషయానికి వస్తే, డాలరుతో పోలిస్తే రూపాయి విలువ ప్రస్తుతం రూ. 94.61 వద్ద ట్రేడ్ అవుతోంది.

Gold Silver Rate 31st March 2026  హైదరాబాద్‌లో నేటి పసిడి, వెండి ధరలు

ఇంటర్నేషనల్ మార్కెట్ ధరల్లో వచ్చిన భారీ మార్పుల ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 31 ఉదయం 8 గంటల సమయానికి హైదరాబాద్ నగరంలో నమోదైన వివరాల ప్రకారం పసిడి, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

22 క్యారెట్ల బంగారం ధర: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల ఆభరణాల తయారీకి ఉపయోగించే పసిడి ధర స్వల్పంగా రూ. 150 మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల (తులం) గోల్డ్ రేటు రూ. 1,35,900 వద్ద కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా ఈ ధరల పెరుగుదల ట్రెండ్ కొనసాగుతోంది. మార్చి 27న రూ. 950, మార్చి 28న రూ. 2300 చొప్పున పెరిగింది.

24 క్యారెట్ల బంగారం ధర: స్వచ్ఛమైన 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములపై మరో రూ. 170 మేర పెరిగి, ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 1,48,260 వద్ద ట్రేడవుతోంది.

మండిపోతున్న వెండి ధరలు

బంగారంతో పాటుగా వెండి కూడా సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకుంటోంది. హైదరాబాద్ మార్కెట్‌లో కేజీ వెండి ధరపై ఏకంగా మరో రూ. 5 వేల రూపాయలు పెరిగింది. ఈ భారీ జంప్‌తో ప్రస్తుతం కిలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ. 2.55 లక్షల వద్ద మార్కెట్లో విక్రయించబడుతోంది. పారిశ్రామికంగా కూడా వెండికి డిమాండ్ పెరుగుతుండటం దీనికి ఒక కారణం.

గమనిక: పైన పేర్కొన్న ధరలు ఉదయం సమయానికి సంబంధించినవి. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల Global Market Fluctuations కు అనుగుణంగా దేశీయంగా ఉదయం 10 గంటల తర్వాత బులియన్ మార్కెట్లలో ధరలు మరింతగా మారే అవకాశం ఉంది. కాబట్టి, ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారులు స్థానిక జ్యువెలరీ షాపుల్లో తాజా ధరలను ఒకసారి విచారించుకుని వెళ్లడం ఉత్తమం. ధరల పెరుగుదల ట్రెండ్ ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పసిడి రేట్లు ఆల్ టైమ్ హై రికార్డులను సృష్టించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది