Gold Loan : గోల్డ్ లోన్ తీసుకునేవారికి కేంద్రం గుడ్ న్యూస్..!
Gold Loan : బంగారు తాకట్టు రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా రూ. 2 లక్షల లోపు బంగారు రుణాలు తీసుకునే చిన్న స్థాయి రుణ గ్రహీతలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించింది. తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Gold Loan : గోల్డ్ లోన్ తీసుకునేవారికి కేంద్రం గుడ్ న్యూస్..!
ఆర్బీఐ తాజాగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం.. బంగారాన్ని తాకట్టు పెట్టి ఇచ్చే రుణాల్లో బంగారం విలువలో 75 శాతం కన్నా ఎక్కువ రుణం ఇవ్వరాదని పేర్కొంది. అయితే దీనివల్ల చిన్న రైతులు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న చిన్న రుణ గ్రహీతలు తీవ్రంగా ప్రభావితమవుతారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సేవల విభాగం ఆ ముసాయిదాను సమీక్షించి, చిన్న మొత్తాల బంగారు రుణాలపై ప్రభావం లేకుండా ఉండేలా మార్పులు చేయాలని సూచించింది.
ఈ మార్గదర్శకాలు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే తుది మార్గదర్శకాల్లో కొన్ని సడలింపులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బంగారు రుణాలపై ఆధారపడే చిన్న రైతులు, చిన్న వ్యాపారుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు సామాన్యుడిపై భారం కాకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం గమనార్హం. ఆర్బీఐ త్వరలో తుది మార్గదర్శకాలను సవరిస్తుందని సమాచారం.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.