Women : మహిళలకి శుభవార్త.. రూ.50 వేలు అందిస్తున్న మోదీ సర్కారు.. ఇలా నెలకి 50,000 సంపాదన
ప్రధానాంశాలు:
Women : మహిళలకి శుభవార్త.. రూ.50 వేలు అందిస్తున్న మోదీ సర్కారు.. ఇలా నెలకి 50,000 సంపాదన
Women : మహిళలని ప్రోత్సహించేందుకు మోదీ సర్కారు అనేక పథకాలు తీసుకొస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిలో ముద్రా యోజన స్కీం ఒకటి. ఇది మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నటువంటి స్కీం అని చెప్పవచ్చు. ముద్ర యోజన ద్వారా అతి తక్కువ వడ్డీ రేటుకే రుణాలను పొందడం ద్వారా మీరు ఈ బిజినెస్ లో చక్కటి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ముద్ర రుణాలు ప్రస్తుతం 50 వేల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.

Women : మహిళలకి శుభవార్త.. రూ.50 వేలు అందిస్తున్న మోదీ సర్కారు.. ఇలా నెలకి 50,000 సంపాదన
Women మంచి బిజినెస్..
అయితే ఈ రుణాలను ప్రభుత్వ బ్యాంకులు అటు ప్రైవేట్ బ్యాంకులు సైతం అందిస్తున్నాయి. కనుక ఈ రుణాలను మీరు సులభంగా నెల వాయిదాలతో తీర్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో మీరు మహిళలు ముద్ర రుణం ఉపయోగించుకొని తమ స్వశక్తితో ఆదాయం పొందవచ్చు. మహిళలు ఇంటి వద్ద ఉంటూనే చేయగలిగే బిజినెస్ లలో నర్సరీ గార్డెనింగ్ బిజినెస్ కూడా ఒకటి అని చెప్పవచ్చు. మీ ఇంటి వద్ద ఖాళీ స్థలం ఉన్నట్లయితే మీరు నర్సరీ ఏర్పాటు చేసుకొని ప్రతి నెల డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది.
నర్సరీ నిర్వహణ కోసం 100 గజాల నుంచి 200 గజాల స్థలం ఉన్నట్లయితే చక్కగా సరిపోతుంది. ఆకర్షణీమైన మొక్కలను, పూల మొక్కలను, ఔషధ మొక్కలను, పండ్ల మొక్కలను, అలాగే వాస్తు మొక్కలను విక్రయించడం ద్వారా మీరు సంపాదించే అవకాశం ఉంటుంది. ఈ మొక్కలతోపాటు ఎరువులు, కుండీలు, ఇతర గార్డెనింగ్ పరికరాలను అందుబాటులో ఉంచినట్లయితే మీ వ్యాపారం చక్కగా సాగుతుంది. ఈ బిజినెస్ చేయడం ద్వారా నెలకు 30 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల వరకు సంపాదించే ఛాన్స్ ఉంటుంది.