Sheep For Rs. 3 Lakh : బక్రీద్ సందర్బంగా రూ.3 లక్షలు పెట్టి గొర్రెను కొనుగోలు చేసిన వ్యక్తి..దీని బరువు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
ప్రధానాంశాలు:
Sheep For Rs. 3 Lakh : బక్రీద్ సందర్బంగా రూ.3 లక్షలు పెట్టి గొర్రెను కొనుగోలు చేసిన వ్యక్తి..దీని బరువు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
Sheep For Rs. 3 Lakh : ముస్లిం సోదరుల పవిత్ర పండుగ ఈద్-ఉల్-అధా (బక్రీద్) రానుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల కొనుగోళ్లకు విపరీతమైన ఉత్సాహం నెలకొంది. ఈ పండుగ సందర్భంగా బలి ఇవ్వడం ముస్లింలు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని సోలాపూర్ నగరానికి చెందిన మిరప వ్యాపారి తౌఫిక్ కళ్యాణి, మధ్యప్రదేశ్లోని దేవాస్ గ్రామం నుంచి 190 కిలోల బరువుతో ప్రత్యేక శిరోలి జాతి గొర్రెను తీసుకొచ్చారు. ఈ గొర్రెను చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున కళ్యాణి ఇంటి వద్దకు చేరుకుంటున్నారు.
Sheep For Rs. 3 Lakh : బక్రీద్ సందర్బంగా రూ.3 లక్షలు పెట్టి గొర్రెను కొనుగోలు చేసిన వ్యక్తి

Sheep For Rs. 3 Lakh : బక్రీద్ సందర్బంగా రూ.3 లక్షలు పెట్టి గొర్రెను కొనుగోలు చేసిన వ్యక్తి..దీని బరువు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
ఈ గొర్రెకు ఇచ్చే ప్రత్యేకమైన పోషణను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రతి రోజు మొక్కజొన్న, గోధుమలు, రావి ఆకులు, జొన్నలు, కడబా వంటి ఆరోగ్యకరమైన పశుగ్రాసంతో పాటు రెండు లీటర్ల పాలను ఆహారంగా ఇస్తున్నారు. భారీగా లావు, ఆకర్షణీయమైన రూపంతో ఈ గొర్రె సోలాపూర్లోనే అత్యంత భారీ బరువుతో నిలిచింది. ఈ గొర్రె ధర సుమారుగా 3 నుండి 4 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బక్రీద్ నేపథ్యంలో సోలాపూర్ జిల్లాలోని మార్కెట్లు కళాకలాడుతున్నాయి. మంగళవార బజార్, మోహోల్, సాంగోలా, బేగంపూర్ వంటి ప్రాంతాల్లో శిరోహి, అజ్మేరి, తోతాపురి, ఉస్మానాబాది లాంటి వివిధ జాతుల గొర్రెలతో మార్కెట్లు సందడి సందడి గా మారాయి. ముస్లింలు తమ సామర్థ్యానుసారంగా గొర్రెలను ఎంచుకుని కొనుగోలు చేస్తున్నారు.