
Budget 2026 – 27: అన్నదాతల ఆశలకు కేంద్రం గుడ్ న్యూస్.. 7 సంచలన నిర్ణయాలు..?
Union Budget 2026 “: దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారు రైతులు. “జై జవాన్.. జై కిసాన్” అనే నినాదం మాటల్లోనే కాదు విధానాల్లోనూ కనిపించాలన్నదే అన్నదాతల ఆకాంక్ష. రైతులు పంటలు పండించకపోతే దేశ ఆహార భద్రతే ప్రశ్నార్థకమవుతుంది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026–27 పై దేశవ్యాప్తంగా రైతులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే నిర్ణయాలు తీసుకుంటారనే ఆశతో ఎదురుచూస్తున్నారు.
Budget 2026 – 27: అన్నదాతల ఆశలకు కేంద్రం గుడ్ న్యూస్.. 7 సంచలన నిర్ణయాలు..?
దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు నేరుగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయినా వ్యవసాయ రంగానికి కేటాయింపులు తక్కువగానే ఉంటున్నాయనే విమర్శ ఉంది. ఈసారి కనీసం ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులను మూడు రెట్లు పెంచాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలా చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి వస్తుందని అంటున్నారు. మద్దతు ధర MSP పెంపు సాగు యంత్రాలపై అధిక రాయితీలు ఎరువులు–యూరియాపై మరింత సబ్సిడీ వంటి అంశాలపై స్పష్టమైన హామీలు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. సాగు ఖర్చులు తగ్గితేనే రైతుకు మిగులు ఆదాయం దక్కుతుందన్నది వారి అభిప్రాయం.
ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యవసాయ నిపుణుడు అశోక్ బలియాన్ ఇటీవల జరిగిన ముందస్తు బడ్జెట్ సమావేశంలో కీలక సూచనలు చేశారు. రైతుల ఆదాయం పెరగాలంటే విత్తన పరిశోధనలపై పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరమన్నారు. స్వదేశీ విత్తన రకాలు అభివృద్ధి అయితే విదేశీ కంపెనీలపై ఆధారపడటం తగ్గి, పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుందని చెప్పారు. అలాగే కనీస మద్దతు ధర ప్రస్తుతం కేవలం 23 పంటలకే పరిమితమై ఉండటంపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు. అన్ని ప్రధాన పంటలకు MSP వర్తింపజేస్తే ప్రతి పంటకు గ్యారెంటీ ధర లభించి నష్టాలు తగ్గుతాయని వారు భావిస్తున్నారు. కృషీ విజ్ఞాన కేంద్రాలు కేవలం సాంకేతిక సలహాలకే కాకుండా మార్కెట్ ధరలపై అవగాహన కల్పించేలా పనిచేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.
పంట కోత అనంతరం జరిగే నష్టాలు రైతులకు పెద్ద భారంగా మారాయి. దీనిని తగ్గించేందుకు ఆధునిక గిడ్డంగులు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలకు బడ్జెట్లో పెద్దపీట వేయాలని రైతులు కోరుతున్నారు. ఇలా మౌలిక వసతులు పెరిగితే రైతులు తమ పంటను నిల్వ చేసుకుని ధరలు అనుకూలంగా ఉన్నప్పుడు అమ్ముకునే అవకాశం ఉంటుంది. మధ్యవర్తుల పాత్ర కూడా తగ్గుతుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు FPOలు బలోపేతం కావాలంటే ప్రస్తుతం ఉన్న సంక్లిష్ట నిబంధనలను సులభతరం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సమూహ సాగు ద్వారా రైతుల చర్చా శక్తి పెరుగుతుంది. అంతేకాదు ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ సాగు చేస్తున్న రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రసాయన రహిత సాగు వల్ల పర్యావరణం, ప్రజారోగ్యం రెండూ మెరుగుపడతాయని వారు చెబుతున్నారు. ఈ బడ్జెట్ తమ కష్టాలకు పరిష్కారం చూపి కొత్త ఆశలను నింపుతుందని అన్నదాతలు నమ్మకంగా ఎదురుచూస్తున్నారు.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.