kaliyugam Facts : కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు తిరిగి తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని పరిపాలిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఒక రోజు ధర్మరాజు లేని సమయంలో శ్రీకృష్ణుడు హస్తినపురానికి వస్తాడు. కృష్ణుడి రాకతో ఎంతో సంతోషించిన తక్కిన పాండవులు మాధువునికి అతిధి మర్యాదలు చేసి ఆసనం మీద కూర్చోబెట్టి సఫర్లు చేస్తూ గోవిందా త్వరలో ద్వాపరయుగ ముగియబోతోంది. తర్వాత రాబోయే కలియుగం ఎలా ఉండబోతుందో కొంచెం చెప్పమని అడుగుతారు. పాండవుల ప్రశ్నకు చిరునవ్వు నవ్విన శ్రీకృష్ణుడు. రాబోయే కలియుగం ఎలా ఉండబోతుందో మీ కళ్ళతో మీరే చూడండి. అని నాలుగు దిక్కులకు నాలుగు బాణాలు వదిలి మీ నలుగురు ఆ నాలుగు బాణాలను తీసుకురండి అని చెబుతారు.శ్రీకృష్ణుడు స్పందించిన బాణాల కోసం వెతుకుతున్న క్రమంలో అర్జునుడికి ముందుగా బాణం కనిపిస్తుంది. ఆ బాణం తీస్తుండగా వెనుక నుండి ఒక మధుర గానం వినిపిస్తుంది. దాంతో వెనక్కు తిరిగి అర్జునుడికి ఒక కోయిల తీయగా పాడుతూ తన కాళ్ళు కింద సజీవంగా ఉన్న కొందేలుని పొడుచుకు తింటూ కనిపిస్తుంది. ఆ దృశ్యం చూసి అవాకైనా అర్జునుడు బాణం తీసుకుని పరుగున శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి నిశ్నేష్టుడై నిలబడతాడు. కాసేపటికి భీముడికి కూడా బాణం కనిపిస్తుంది.
చుట్టూ ఉన్న నాలుగు భావుల్లో నీరు పుష్కలంగా ఉండి పొంగిపొర్లుతున్న మధ్యలో ఉన్న బావి మాత్రం పూర్తిగా ఎండిపోయి కనిపిస్తుంది. ఇది చూసి నిర్ధాంత పోయిన భీముడు బాణం తీసుకుని కృష్ణుడి దగ్గరకు వచ్చేస్తాడు. మూడవ బాణాన్ని నక్లుడు గుర్తిస్తాడు. అక్కడ ఒక ఆవు అప్పుడే పుట్టిన దూడను దానిమీద ఉన్న వాత్సల్యంతో గాయాలయ్యే వరకు నాకుతూ ఉంటుంది. దూడకు గాయం పెద్దదైతుండడంతో అక్కడ ఉన్న వారంతా ఆ రెండిటిని విడదీస్తారు. ఇక సహదేవుడికి బాణం జరిగిన చోట మీద నుంచి బండరాయి దొర్లుకుంటూ వస్తూ మార్గం మధ్యలో అనేక చెట్లను పెకిలించి వేస్తుంది. చివరికి అది ఒక చిన్న మొక్కను ఆగిపోతుంది. ఈ దృశ్యాలను చూసిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుడితో దీనిలో ఉన్న మర్మం ఏమిటి అని చెప్పమని అడుగుతారు. పాండవుల మాటలు విన్న శ్రీకృష్ణుడు కలియుగంలో సాధువులు జ్ఞానులు కోకిల మాదిరిగా మధురంగా మాట్లాడుతూ కపుట నాటకంతో అమాయక భక్తులను కుందేలును పొడుచుకున్నట్లు హింసిస్తూ దోపిడీ చేస్తారు.
కలియుగంలో అన్ని నిండుగా ఉన్నా సంపన్నులు తమ పక్కనే ఉన్న పేదలకు పైసలు కూడా సహాయం చేయరు. ఆవు దూడలు గాయాలు అయ్యేవరకు ఎలా నాకిందో అలానే కలియుగంలో తల్లిదండ్రులు బిడ్డల మీద ఉన్న ప్రేమతో వారిని అతిగారాభం చేస్తూ వారి జీవితాన్ని నాశనం చేస్తారు. కలియుగంలో ప్రజలు బండరాయిలా దొర్లుకుంటూ తమ వినాశనం వైపు పరుగులు తీస్తారు. వీరిని బంధుమిత్రులు సంపద వంటివి ఏమీ రక్షించలేము. వారిని భగం నామం అనే చిన్న ముక్క తప్ప ఏది రక్షించ లేదు అని శ్రీకృష్ణుడు కలియుగం గురించిన సత్యాలను పాండవులకు చెప్తాడు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.