Home » Devotional » Crystal Shiva Lingam To Worship In Home
Devotional

Crystal Shiva Lingam : ఇంట్లో శివుడి స్పటిక లింగాన్ని పూజించడం వలన ఏమవుతుందో తెలుసా…?

Authored By
aruna
The Telugu News | Published on: August 15, 2022, 6:00 am
Advertisement

Crystal Shiva Lingam : మనం ఇంట్లో సాధారణంగా శివుడిని చిత్రపటాల రూపంలో పూజిస్తుంటాం. లింగం రూపంలో ఎక్కువగా పూజించరు. ఎందుకంటే విగ్రహం అయితే రోజు నియమ నిష్ఠలతో పూజలు చేయాలి. కనుకనే చాలామంది లింగం రూపంలో ఉన్న శివుడిని పూజిస్తారు. అయితే శివలింగాల్లో స్పటిక లింగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ లింగాన్ని పూజిస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని అంటుంటారు. శివుడి స్పటిక లింగాన్ని పూజించడం వలన మనకు ఏం జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం. మన ఇంట్లో కొన్ని కారణాల వలన ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. దీనివల్ల ఇంట్లోని వారందరికీ ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అయితే శివుడు స్పటిక లింగాన్ని పూజించడం వలన ఇంట్లో ఎలాంటి దోషాలు, నెగటివ్ ఎనర్జీ, దిష్టి ఉండవు.

Advertisement

దీంతో అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే శివుడిని పూజించడం వలన ఇంట్లోని వారందరూ ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. అలాగే శివుడి స్పటిక లింగం సంపదకు, ఆనందానికి ప్రతిరూపం. కనుక లింగాన్ని పూజిస్తే మనకు ధనం ప్రాప్తిస్తుంది. ఇంట్లోని వారంతా సుఖసంతోషాలతో జీవిస్తారు. అలాగే తీరని కోరికలు నెరవేరుతాయి. వ్యాపారంలో మంచి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ లింగాన్ని పూజిస్తే అనుకున్న పనులు విజయవంతం అవుతాయి అని పురాణాలు చెబుతున్నాయి. శివుడి స్పటిక లింగాన్ని గరిక గడ్డి ఉంచిన నీటితో అభిషేకించడం వలన పోయిన డబ్బు తిరిగి వస్తుంది. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే మృత్యు భయం ఉండదు.

Crystal Shiva Lingam To Worship In Home

Advertisement

ఆవుపాలతో చేస్తే అన్ని సౌఖ్యాలు కలుగుతాయి. పెరుగుతో చేస్తే బలం, కీర్తి ప్రఖ్యాతలు కలుగుతాయి. ఆవు నెయ్యితో చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. చెరుకు రసంతో చేస్తే ధన వృద్ధి కలుగుతుంది. మెత్తని చక్కెరతో చేస్తే దుఃఖం ఉండదు. అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు ఆకులను ఉంచిన నీటితో అభిషేకం చేస్తే అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు. అలాగే స్పటిక లింగాన్ని తేనెతో అభిషేకం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. పువ్వులను ఉంచిన నీటితో చేస్తే భూ లాభం కలుగుతుంది. కొబ్బరినీళ్ళతో అభిషేకం చేస్తే సకల సంపదలు కలుగుతాయి. అలాగే పసుపు నీటితో చేస్తే ఎంతో మంగళకరంగా ఉంటుంది. అనుకున్న పనులు విజయం సాధిస్తారు. ఈ విధంగా స్పటిక లింగాన్ని పూజించడం వలన శివుడి ఆశీస్సులను పొందవచ్చని మన పురాణాలు తెలుపుతున్నాయి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి