
Deeparadhana : నిత్య దీపరాధనలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి...!
Deeparadhana : కొందరు నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. అసలు నిత్య దీపారాధన ఏ సమయంలో చేయాలి? అలాగే ఏ సమయంలో చేయకూడదు…? ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. నిత్య దీపారాధన అనేది గౌరీనాథ్, బద్రీనాథ్ ప్రాంతాల్లో జరుగుతుంది. కాని సంసార జీవితంలో నిత్య దీపారాధన అసలు చేయకూడదని శాస్త్రం చెబుతుంది. ఎందుకు చేయకూడదు అంటే స్త్రీలు మైలలో ఉన్నప్పుడు దూరంగా ఉండాలి. ఇంట్లో దీపం పెట్టి అంటుతో వీరు తీసుకువచ్చి భగవంతుడిని కించపరుస్తున్నారు. ఇంట్లో నిత్య దీపారాధన చేసినప్పుడు దీపంలో ఒక ఒత్తిని వేయకూడదు. ఒకవేళ దీపారాధన చేసుకోవాలి అనుకున్న వారు రెండు ఒత్తులు కలిపి దీపారాధన చేయాలి. దానిమీద ఏ విధమైన దోషపూరితమైన నీడ పడకుండా కాపాడుకోవాలి. అప్పుడు సుఖ సంతోషకరమైన జీవితాన్ని ఆనందపరమైన జీవితాన్ని పొందగలుగుతారు. అయితే నిత్య దీపారాధన అనేది ఈ కాలంలో ఎవరు కూడా చేయరానిది.
ఒకవేళ చేయాలి అనుకుంటే ఇంటిని శుద్ధిగా ఉంచినప్పుడు పెట్టుకోవాలి. నిత్య దీపాన్ని ఏ సమయంలో పెట్టాలి అంటే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి. మూడు నుండి ఆరు గంటల మధ్యలో దీపారాధన చేసినట్లయితే సర్వసుఖాలు కలుగుతాయి. సుచితో భక్తితో దీపారాధన చేసి పరం దీపం పరంజ్యోతి అని నమస్కరించుకోవాలి. విష్ణుమూర్తికి అమ్మవారికి ఆదిపరాశక్తి దీపారాధనకి ఉపయోగకరమైన మొట్టమొదటి స్థానం. నిత్య దీపారాధన చేసేటప్పుడు ఆదిపరాశక్తిని పరంజ్యోతి జ్యోతి స్వరూపిణి అంటే అమ్మవారు మాంసాహారం తినకూడదు. ఇటువంటివి దృష్టిలో పెట్టుకొని చేసుకున్నట్లయితే నిత్య దిపారాధన ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే సంధ్య కాల సమయంలో 5 దీపాలను పెట్టుకోవాలి. సంధ్యాకాలంలో శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసుపు కుంకుమలతో అర్చన చేసినట్లయితే కుటుంబ క్షేమం సౌభాగ్యం కలుగుతుంది. నిత్య దీపారాధన చేయాలి అనుకున్న వారు దీపాన్ని, భూమి మీద లేదా కింద పెట్టకూడదు.
Deeparadhana : నిత్య దీపరాధనలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి…!
దీపం కింద వస్త్రం గాని బియ్యం తమలపాకులు అరటి ఆకులు ,ప్లేట్ వంటివి పెట్టాలి. అలాగే దీపం వెలిగించిన తర్వాత తప్పకుండా కుంకుమ బొట్టుని పెట్టాలి. అయితే వెలుగుతున్న దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటితో ఊదకూడదు. అదేవిధంగా దీపాన్ని తూర్పు దిక్కున వెలిగించినట్లయితే గ్రహదోషము తొలగిపోతుంది. మరియు పశ్చిమ దిక్కున వెలిగించినట్లయితే అప్పుల బాధ తీరుతుంది. దక్షిణం వైపు దీపాలను వెలిగించకూడదు. ఉత్తర దిక్కున వెలిగించినట్లయితే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఐదు అనేది ఆడవారి దీపారాధనలో ప్రాముఖ్యత చెందినది. మండోదరి , తార , సీత, కుంతీ ద్రౌపతి ఐదుగురు ప్రతివతలు. పంచముఖ దీపంలో ఆడదాని తోటి ఎక్కువ అనుబంధం కలిగి ఉన్నది కాబట్టి దీనిని మనం మనసా వాచ నమ్ముతూ చెప్పాలి. ఇది నిత్య దీపం యొక్క పరమార్థం.
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Ranabaali Movie : టాలీవుడ్ Tollywood యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ Vijay Devarakonda మరోసారి తన సినిమా ఎంపికతో…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో మరోసారి 'రెడ్ బుక్' Red Book అంశం అధికార, ప్రతిపక్షాల…
Indiramma Houses : పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల…
Amaravati Capital : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా 'అమరావతి' ఒక ప్రధాన అంకంగా నిలిచింది. 2014లో విభజన…
Loan: లోన్ తీసుకోవాలంటే ముందుగా మంచి సిబిల్ స్కోర్ cibil score ఉండాలి ఆ తర్వాత బ్యాంకుల Banks చుట్టూ…
Tale of Two Loves : ఒడిశా రాష్ట్రానికి చెందిన 75 ఏళ్ల బాబు లోహర్ కథ నేటి కాలంలో…
Business Idea : ప్రస్తుత కాలంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, పెట్రోల్ పంప్ వ్యాపారం అనేది అత్యంత…
This website uses cookies.