Home » Devotional » Dont Do These Mistakes Even By Mistake While Eating It Is A Great Sin
Devotional

Eating : భోజనం చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి… లేదంటే..?

Authored By
aruna
The Telugu News | Updated on: June 7, 2023 7:43 pm
Advertisement

Eating : వాస్తు శాస్త్ర ప్రకారం సకార శక్తులను ఏ విధంగా ఆహ్వానించవచ్చు. మరియు ఇంటిలోకి సుఖ సంవృద్ధులను తీసుకురావడానికి ఏమేం పాటించాలి. అనేది వివరంగా చెప్పారు. ఆధునిక యుగంలో ఎన్నో మార్పులు ఏర్పడ్డాయి. తద్వారా ప్రజలు మన ప్రాచీన సంస్కృతిని మర్చిపోతున్నారు. దాని ప్రభావం వారి జీవితాలపై పడుతుంది. భోజనం చేసేవారు తద్వారా భూమి మరియు వారి శరీరంలో ఉన్నటువంటి శక్తులు కలిసి వారికి మరింత శక్తి చేకూరేది. ఇప్పుడు మనం చూసినట్లయితే మనుషుల్లో అనేకమైన బలహీనతలు ఏర్పడుతున్నాయి. అందుకే తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి అని పూర్వీకులు చెప్పారు. గ్రహాలు మనం తినే ఆహారం పై ప్రభావం చూపుతాయి అని తెలియజేశారు. అలాగే మనం భోజనం చేసే విధానం గ్రహాలపై కూడా ప్రభావం చూపిస్తుంది అని చెప్పారు. వాస్తవంగా చూసినట్లయితే భోజనం చేసే దిక్కు చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

భోజనం చేసే దిక్కు అనేది లేదా స్థలం అనేది బృహస్పతి యొక్క స్థానమని ఋషులు మునులు పేర్కొన్నారు. ఇలా చేస్తే ఆయుర్వృత్తి కలుగుతుంది. కింద కూర్చొని భోజనం చేస్తే చాలా మంచిది. అప్పుడు భూమి నీరు మరియు మనం తీసుకునే ఆహారం ఈ మూడింటి యొక్క శక్తి మన శరీరానికి అందుతుంది. అందుకే భూమి మీద కూర్చుని భోజనం చేయడం వల్ల మన శరీరానికి మరియు మన శిరస్సుకి శక్తి చేకూర్తుంది. అలాగే మన మనసును శాంతింప చేస్తుంది. మనలో ఉన్నటువంటి కోపాన్ని అణచివేస్తుంది. దక్షిణ మరియు తూర్పు దిశలకు మధ్యగా అనగా ఆగ్నేయ దిశగా కూర్చుని భోంచేస్తే యవన సంబంధ దోషాలు మరియు స్వప్న దోషాలు అనేవి కలుగుతాయి. అలాగే నేలపై బాసంపట్టు వేసుకుని కూర్చుని భోజనం చేయడం అనేది అన్నిటికంటే ఉత్తమమైనది.

Don’t do these mistakes even by mistake while eating it is a great sin

Advertisement

కుర్చీ పైన కూర్చుని కాళ్లు ఊపుతూ భోజనం చేయడం అనేది చాలా దోషాలను మనకు తెస్తుంది. మనకు దరిద్రాన్ని కూడా తెస్తుంది. ఇక ఎవరికైతే ధనాన్ని ప్రాప్తించుకోవాలి అనే కోరిక ఉంటుందో డబ్బు కొదవగా ఉంటుందో వారు పశ్చిమ దిశకు కూర్చుని పశ్చిమ వైపు కూర్చుని భోజనం చేయడం అనేది ఉత్తమమైన పని. ఇలా చేయడం వల్ల వారికి ధనం ప్రాప్తిస్తుంది. తన సమయంలో మన ఒంట్లో ఉన్నటువంటి లివర్ నుండి వేడి అనేది బయటకు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అలా బయటకు వస్తున్న వేడిని భూమి ఆకర్షించి మన శరీరాన్ని చల్లబరుస్తుంది. ఎప్పుడైతే మనం బెడ్ పైన కూర్చుని తింటామో ఒంటిలోని వేడిని భూమి ఆకర్షించకపోగా మరింత పెరుగుతుంది. భోజనం చేసిన తర్వాత కొందరు అన్నం తిన్నటువంటి కంచంలోనే చేయగదుగుతారు.

ఇలా చేస్తే మాత్రం అన్నపూర్ణ దేవిని అవమానించినట్టే… మరియు చంద్ర శుక్ర గ్రహాలు ఆగ్రహిస్తాయి. అలాగే కొంతమంది భోజనాన్ని ప్లేట్లు వదిలేస్తూ ఉంటారు. అలా చేయడం వలన మాత అన్నపూర్ణమ్మను అవమానించినట్టే.. ఇలా చేస్తే వారికి ముందు ముందు అన్నం దొరకడం కష్టమవుతుంది. అందుకే ఎంత అవసరమో అంతే భోజనాన్ని మనం పెట్టుకోవాలి. ఇక భోజనానికి ముందు మరియు తర్వాత కూడా లగు సంఖ్య చేయాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి