Eating : వాస్తు శాస్త్ర ప్రకారం సకార శక్తులను ఏ విధంగా ఆహ్వానించవచ్చు. మరియు ఇంటిలోకి సుఖ సంవృద్ధులను తీసుకురావడానికి ఏమేం పాటించాలి. అనేది వివరంగా చెప్పారు. ఆధునిక యుగంలో ఎన్నో మార్పులు ఏర్పడ్డాయి. తద్వారా ప్రజలు మన ప్రాచీన సంస్కృతిని మర్చిపోతున్నారు. దాని ప్రభావం వారి జీవితాలపై పడుతుంది. భోజనం చేసేవారు తద్వారా భూమి మరియు వారి శరీరంలో ఉన్నటువంటి శక్తులు కలిసి వారికి మరింత శక్తి చేకూరేది. ఇప్పుడు మనం చూసినట్లయితే మనుషుల్లో అనేకమైన బలహీనతలు ఏర్పడుతున్నాయి. అందుకే తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి అని పూర్వీకులు చెప్పారు. గ్రహాలు మనం తినే ఆహారం పై ప్రభావం చూపుతాయి అని తెలియజేశారు. అలాగే మనం భోజనం చేసే విధానం గ్రహాలపై కూడా ప్రభావం చూపిస్తుంది అని చెప్పారు. వాస్తవంగా చూసినట్లయితే భోజనం చేసే దిక్కు చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
భోజనం చేసే దిక్కు అనేది లేదా స్థలం అనేది బృహస్పతి యొక్క స్థానమని ఋషులు మునులు పేర్కొన్నారు. ఇలా చేస్తే ఆయుర్వృత్తి కలుగుతుంది. కింద కూర్చొని భోజనం చేస్తే చాలా మంచిది. అప్పుడు భూమి నీరు మరియు మనం తీసుకునే ఆహారం ఈ మూడింటి యొక్క శక్తి మన శరీరానికి అందుతుంది. అందుకే భూమి మీద కూర్చుని భోజనం చేయడం వల్ల మన శరీరానికి మరియు మన శిరస్సుకి శక్తి చేకూర్తుంది. అలాగే మన మనసును శాంతింప చేస్తుంది. మనలో ఉన్నటువంటి కోపాన్ని అణచివేస్తుంది. దక్షిణ మరియు తూర్పు దిశలకు మధ్యగా అనగా ఆగ్నేయ దిశగా కూర్చుని భోంచేస్తే యవన సంబంధ దోషాలు మరియు స్వప్న దోషాలు అనేవి కలుగుతాయి. అలాగే నేలపై బాసంపట్టు వేసుకుని కూర్చుని భోజనం చేయడం అనేది అన్నిటికంటే ఉత్తమమైనది.
కుర్చీ పైన కూర్చుని కాళ్లు ఊపుతూ భోజనం చేయడం అనేది చాలా దోషాలను మనకు తెస్తుంది. మనకు దరిద్రాన్ని కూడా తెస్తుంది. ఇక ఎవరికైతే ధనాన్ని ప్రాప్తించుకోవాలి అనే కోరిక ఉంటుందో డబ్బు కొదవగా ఉంటుందో వారు పశ్చిమ దిశకు కూర్చుని పశ్చిమ వైపు కూర్చుని భోజనం చేయడం అనేది ఉత్తమమైన పని. ఇలా చేయడం వల్ల వారికి ధనం ప్రాప్తిస్తుంది. తన సమయంలో మన ఒంట్లో ఉన్నటువంటి లివర్ నుండి వేడి అనేది బయటకు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అలా బయటకు వస్తున్న వేడిని భూమి ఆకర్షించి మన శరీరాన్ని చల్లబరుస్తుంది. ఎప్పుడైతే మనం బెడ్ పైన కూర్చుని తింటామో ఒంటిలోని వేడిని భూమి ఆకర్షించకపోగా మరింత పెరుగుతుంది. భోజనం చేసిన తర్వాత కొందరు అన్నం తిన్నటువంటి కంచంలోనే చేయగదుగుతారు.
ఇలా చేస్తే మాత్రం అన్నపూర్ణ దేవిని అవమానించినట్టే… మరియు చంద్ర శుక్ర గ్రహాలు ఆగ్రహిస్తాయి. అలాగే కొంతమంది భోజనాన్ని ప్లేట్లు వదిలేస్తూ ఉంటారు. అలా చేయడం వలన మాత అన్నపూర్ణమ్మను అవమానించినట్టే.. ఇలా చేస్తే వారికి ముందు ముందు అన్నం దొరకడం కష్టమవుతుంది. అందుకే ఎంత అవసరమో అంతే భోజనాన్ని మనం పెట్టుకోవాలి. ఇక భోజనానికి ముందు మరియు తర్వాత కూడా లగు సంఖ్య చేయాలి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.