
how do lord sri mahavishnu pooja in tholi ekadashi festival
Tholi Ekadashi : ప్రాచీన కాలం తొలి ఏకాదశి రోజుని ఈ సంవత్సరం ప్రారంభంగా పరిగణించేవారట. ఇప్పుడు వర్షాకాలం మొదలయ్యే సమయం కాబట్టి మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. లంఖణం పరమ ఔషధం అను ఉపవాస దీక్షకు తొలి ఏకాదశే నాంది. పురాణాల ప్రకారం ఆషాడమాసంలో పౌర్ణమికి ముందు ఏకాదశి వస్తుంది. దీనిని తొలి ఏకాదశి అంటారు. అయితే ఈ ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. నారాయణుడు నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున రోజంతా ఉపవాసం ఉండి, జాగరణ చేసి మరుసటి రోజు ఉదయం విష్ణుమూర్తిని ఆరాధించి తీర్థప్రసాదాలను తీసుకోవాలి. ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. తొలి ఏకాదశి రోజున నిద్రపోయే స్వామి వారు మరల నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మళ్లీ నిద్ర నుంచి మేల్కొంటాడు. స్వామివారి యోగ నిద్ర ద్వారా భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయని చెబుతుంటారు.
అలాగే కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దేవుని వరంతో దేవతలను, ఋషులను హింసించాడని కథ పురాణాల్లో ఉంది. అయితే విష్ణు నారాయణుడు ఆ రాక్షసుడితో వెయ్యేళ్లు పోరాడి, అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటాడు. ఆ సమయంలో స్వామివారి తనువు నుంచి ఒక కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుడిని హతమార్చిందని చెబుతారు. అందుకు సంతోషించిన నారాయణుడు ఆ కన్యను ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి బదులుగా ఆమె విష్ణు ప్రియ గా పూజలు అందుకోవాలి అని కోరుకుంటుంది. ఆ రోజు నుంచి ఏకాదశి తిధి గా వాడుకలోకి వచ్చిందని చెబుతారు. ఏకాదశి రోజున ఉపవాసం ఎందుకు చేయాలంటే ఏకాదశి అనగా పదకొండు. అంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం పదకొండు. మనిషి దేవుడిని పూజించేటప్పుడు వీటిని తన ఆధీనంలోకి తీసుకొచ్చి ఒకటిగా చేసి దేవుడికి నివేదన ఇవ్వాలి. దీని వలన మనిషికి బద్ధకం దూరమవుతుంది. అలాగే రోగాలు కూడా రాకుండా ఉంటాయి.
how do lord sri mahavishnu pooja in tholi ekadashi festival
స్వామివారు నిద్రించే ఈ నాలుగు నెలల కాలాన్ని అత్యంత పవిత్రంగా భావించి చతుర్మాస దీక్ష చేస్తారు. ఈ దీక్ష ను చేసేవారు నాలుగు నెలల పాటు ఎటువంటి ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను వదిలేస్తారు. ఆహారం విషయంలో కొన్ని నియమాలను పాటిస్తారు. ఉపవాసం చేయడం వలన జీర్ణ కోసం పరిశుద్ధమై శరీరం నూతన ఉత్తేజాన్ని రూపొందించుకుంటుంది. శరీరం తట్టుకోలేని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడం కోసం ఈ కఠినమైన ఉపవాసాలు, నియమాలు ఏర్పడ్డాయి. వీటి వలన మనిషి కామ క్రోధాధులను వదిలించుకోగలుగుతాడు. అయితే ఈ తొలి ఏకాదశి రోజున పేలపిండిని తినే సాంప్రదాయం ఉంది. పేలాల్లో బెల్లం, యాలకులను వేసి దంచి ఈ పిండిని తయారు చేస్తారు. ఈ పిండి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. వర్షాకాలం ప్రారంభ సమయం కాబట్టి శరీరానికి ఈ పేలపిండి వేడిని కలిగిస్తుంది. అలాగే మన శరీరానికి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.