how do lord sri mahavishnu pooja in tholi ekadashi festival
Tholi Ekadashi : ప్రాచీన కాలం తొలి ఏకాదశి రోజుని ఈ సంవత్సరం ప్రారంభంగా పరిగణించేవారట. ఇప్పుడు వర్షాకాలం మొదలయ్యే సమయం కాబట్టి మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. లంఖణం పరమ ఔషధం అను ఉపవాస దీక్షకు తొలి ఏకాదశే నాంది. పురాణాల ప్రకారం ఆషాడమాసంలో పౌర్ణమికి ముందు ఏకాదశి వస్తుంది. దీనిని తొలి ఏకాదశి అంటారు. అయితే ఈ ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. నారాయణుడు నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున రోజంతా ఉపవాసం ఉండి, జాగరణ చేసి మరుసటి రోజు ఉదయం విష్ణుమూర్తిని ఆరాధించి తీర్థప్రసాదాలను తీసుకోవాలి. ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. తొలి ఏకాదశి రోజున నిద్రపోయే స్వామి వారు మరల నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మళ్లీ నిద్ర నుంచి మేల్కొంటాడు. స్వామివారి యోగ నిద్ర ద్వారా భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయని చెబుతుంటారు.
అలాగే కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దేవుని వరంతో దేవతలను, ఋషులను హింసించాడని కథ పురాణాల్లో ఉంది. అయితే విష్ణు నారాయణుడు ఆ రాక్షసుడితో వెయ్యేళ్లు పోరాడి, అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటాడు. ఆ సమయంలో స్వామివారి తనువు నుంచి ఒక కన్య ఆవిర్భవించి ఆ రాక్షసుడిని హతమార్చిందని చెబుతారు. అందుకు సంతోషించిన నారాయణుడు ఆ కన్యను ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి బదులుగా ఆమె విష్ణు ప్రియ గా పూజలు అందుకోవాలి అని కోరుకుంటుంది. ఆ రోజు నుంచి ఏకాదశి తిధి గా వాడుకలోకి వచ్చిందని చెబుతారు. ఏకాదశి రోజున ఉపవాసం ఎందుకు చేయాలంటే ఏకాదశి అనగా పదకొండు. అంటే ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం పదకొండు. మనిషి దేవుడిని పూజించేటప్పుడు వీటిని తన ఆధీనంలోకి తీసుకొచ్చి ఒకటిగా చేసి దేవుడికి నివేదన ఇవ్వాలి. దీని వలన మనిషికి బద్ధకం దూరమవుతుంది. అలాగే రోగాలు కూడా రాకుండా ఉంటాయి.
how do lord sri mahavishnu pooja in tholi ekadashi festival
స్వామివారు నిద్రించే ఈ నాలుగు నెలల కాలాన్ని అత్యంత పవిత్రంగా భావించి చతుర్మాస దీక్ష చేస్తారు. ఈ దీక్ష ను చేసేవారు నాలుగు నెలల పాటు ఎటువంటి ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను వదిలేస్తారు. ఆహారం విషయంలో కొన్ని నియమాలను పాటిస్తారు. ఉపవాసం చేయడం వలన జీర్ణ కోసం పరిశుద్ధమై శరీరం నూతన ఉత్తేజాన్ని రూపొందించుకుంటుంది. శరీరం తట్టుకోలేని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడం కోసం ఈ కఠినమైన ఉపవాసాలు, నియమాలు ఏర్పడ్డాయి. వీటి వలన మనిషి కామ క్రోధాధులను వదిలించుకోగలుగుతాడు. అయితే ఈ తొలి ఏకాదశి రోజున పేలపిండిని తినే సాంప్రదాయం ఉంది. పేలాల్లో బెల్లం, యాలకులను వేసి దంచి ఈ పిండిని తయారు చేస్తారు. ఈ పిండి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. వర్షాకాలం ప్రారంభ సమయం కాబట్టి శరీరానికి ఈ పేలపిండి వేడిని కలిగిస్తుంది. అలాగే మన శరీరానికి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.