Home » Devotional » Maha Shivarstri 2025 Fasting Rules
Devotional

Maha shivarstri 2025 Fasting Rules : మహా శివరాత్రి నాడు ఉపవాసం, జాగారం చేస్తున్నారా…? తప్పక ఈ నియమాలు పాటిస్తే ఫలితం చూస్తారు…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: February 26, 2025, 7:00 am
Advertisement

Maha shivaratri 2025 Fasting Rules : భక్తులకు ఎంతో ఇష్టమైన మహాశివరాత్రి పర్వదినాల వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే శివరాత్రి వేడుకలు పలు దేవాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. ఈ మహాశివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో భక్తులందరూ కూడా శివయ్యను పూజిస్తారు. ఈ పండుగ రోజున ఓం నమ: శివాయ, హర హర మహాదేవ శంభో శంకర అనే మంత్రాలతో శివాలయాలు, మారు మోగుతాయి. ఒక శివరాత్రి అంటే శివయ్యకు పూజలు, అభిషేకాలతో పాటు ఉపవాసం మరియు జాగారం తప్పనిసరి. ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగారం ఉండే వారికి కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమారు చెబుతున్నారు. ఈ నియమాలు పాటించకపోతే పూజ ఫలితం దక్కదు అంటున్నారు. ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందాం….

Advertisement

Maha shivarstri 2025 Fasting Rules : మహా శివరాత్రి నాడు ఉపవాసం, జాగారం చేస్తున్నారా…? తప్పక ఈ నియమాలు పాటిస్తే ఫలితం చూస్తారు…?

Maha shivarstri 2025 Fasting Rules మహాశివరాత్రి

మహాశివరాత్రి పర్వదినమున ఉపవాసం ఉండేవారు కొన్ని నియమాలు తప్పక పాటించాల్సి ఉంటుంది. అని మాచిరాజు చెబుతున్నారు. అయితే ఉపవాసం ఉండేవారు ఆ రోజున తలంటు స్థానం చేయకూడదని, తలస్థానం చేయాలని సూచిస్తున్నారు. చాలామందికి తల స్థానానికి మరియు తలంటు స్థానానికి తేడా తెలియదు. అలస్థానం అంటే కేవలం తల మీద నీళ్లు పోసుకోవడం. తలంటు స్థానం అంటే తలకి నూనె రాసుకుని కుంకుడుకాయ లేదా షాంపులతో స్నానం చేయడం. బట్ శివరాత్రికి ముందు రోజున తలంటు స్థానం చేసి పండుగ రోజున తలస్థానం చేయాలని సూచిస్తున్నారు.

Advertisement

– ఇక మహాశివరాత్రి రోజున ఉపవాసం చేసే వారికి కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. సాత్విక ఆహారం అనగా పాలు, పండ్లను ఆహారంగా తీసుకోవాలని చెబుతున్నారు. అల్పాహారం తీసుకోవాలి. కడుపునిండా తిని పూజ చేయవద్దు.

– కొందరు శివరాత్రి రోజున ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు. శివరాత్రి రోజున ఎవ్వరు కూడా ఇలా కఠినమైన ఉపవాస దీక్షను చేయకూడదని ధర్మశాస్త్ర గ్రంధాలు చెబుతున్నాయని అంటున్నారు. కనీసం, పాలు, పండ్లు, తీసుకుంటే మంచిది. అలా తీసుకుంటే ఆ రోజంతా కొంతైనా శక్తి మీకు ఉంటుంది. అందరూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. ఇలా ఉంటే నీరసించిపోతారు. దీనివల్ల మీరు శివుని పూజ చేయడానికి నిరసించిపోతారు. జాగారం కూడా ఉండలేరు. కాబట్టి శివరాత్రి రోజున ఉపవాసం, ఆలు పండ్లు వంటివి తీసుకుంటే మంచిది. శివరాత్రి మరుసటి రోజున ఉపవాసం విరమించిన తర్వాత కేవలం సాత్విక ఆహారం తినాలని చెబుతున్నారు.

Advertisement

– ఇంకా ఉపవాస దీక్షలనే మహాశివరాత్రి రోజున గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆరోజున ఉపవాసం చేయవలసిన అవసరం లేదని చెబుతున్నారు. ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరి మంత్రం జపిస్తే ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని అంటున్నారు.

-అసౌచం ఉన్నవాళ్లు కూడా మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండకూడదని అంటున్నారు. అసౌచం అంటే, జాత సౌచం, మృతా సౌచం, ఏ బిడ్డ జన్మించినప్పుడు పురుడు ఉంటుంది. అలాగే ఇంట్లో ఎవరైనా చనిపోతే వారికి మైల ఉంటుంది. ఇంకా ఆడవారు ఋతు చక్ర సమయంలో ఉపవాస దీక్షలను పాటించకూడదు. ఇంటి పరిస్థితులు ఉన్నవారు ఉపవాస దీక్షలను అస్సలు పాటించవద్దు.

– ఉపవాసం అంటే శివునికి సమీపంలో ఉండమని అర్థం. ఉపవాసం ఉండేవారు శివనామ స్మరణ చేస్తూ పాలు, పండ్లు స్వీకరించి ఉపవాసం ఉండాలని చెబుతున్నారు. వాసం చేసేటప్పుడు మాత్రం, నమః శివాయ లేదా శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని కచ్చితంగా స్మరించుకోవాలని సూచిస్తున్నారు.

మహాశివరాత్రి నాడు శివునికి ఇష్టమైన ప్రసాదాలు మరియు నైవేద్యాలు పెడితే శివయ్య సంతోషిస్తాడు :

Advertisement

Maha shivarstri 2025 జాగరణ నియమాలు

జాగరణ అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం అని అర్థమని మాచిరాజు చెబుతున్నారు. అయితే కొంతమంది శివరాత్రి రోజున జాగరణ పేరుతో సినిమాలకు వెళుతుంటారు. ఇలా చేస్తే జాగరణ ఫలితం ఉండదు. శివ సంబంధమైన సినిమాలను చూడవచ్చు. కానీ వినోదాత్మకమైన కార్యక్రమాలకు వెళ్ళకూడదు అంటున్నారు మాచిరాజు. వీలైతే శివాలయంలో లేదా ఇంట్లో శివుని సూత్రాలు వింటూ జాగరణ చేస్తే ఇంకా మంచి ఫలితం దక్కుతుంది. నియమాలను పాటిస్తూ శివరాత్రి రోజున ఉపవాసం మరియు జాగరణ ఉండటం వల్ల శివుని సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు అని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి