Home » Devotional » Mukkoti Ekadasi Pooja Niyamalu In Telugu
Devotional

Mukkoti Ekadasi Pooja : డిసెంబర్ 23 ముక్కోటి ఏకాదశి నాడు ఈ చెట్టును తాకితే చాలు.. వైకుంఠవాసం కలుగుతుంది..!

Authored By
Jyothi Marikanti
The Telugu News | Published on: December 22, 2023, 7:00 am
Advertisement

Mukkoti Ekadasi Pooja : ముక్కోటి ఏకాదశి రోజు ఈ చెట్టుని తాకితే చాలు వైకుంఠ వాసం కలుగుతుంది. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. ఏ వ్యక్తి అయిన కానీ ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం తప్పకుండా చేసుకోవాలి. మార్గశిర మాసంలో పౌర్ణమి కి ముందు వచ్చే ఏకాదశి ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అని ముక్కోటి ఏకాదశి అని వైకుంఠ ఏకాదశి అని పలు రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి ప్రవేశాన్ని కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని మోక్షం సిద్ధిస్తుంది. అనేది మోక్షత ఏకాదశి అని కూడా ఏకాదశి పిలుస్తూ ఉంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఎక్కువ మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణ ని దర్శించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. వైకుంఠం యొక్క వాఖ్యలు తెరుచుకుని పర్వతనం రోజున శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిచ్చారు.

Advertisement

రాక్షసులు బాధలు భరించలేక దేవతలంతా ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణ నుండి దర్శించుకుని తమ బాధలు విన్నవించుకున్నారు. ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ట నియమాలతో వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ కూడా ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశి మరణించే వారికి స్వర్గం తలుపులు తెరిచే ఉంటాయని కూడా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి స్తుతించే వారికి మోక్షం కూడా ప్రాప్తిస్తుంది. అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటలకి లేచి సూచిక స్నానం ఆచరించాలి. గడపకు పసుపు, కుంకుమలు తోరణాలు ముక్కులతో అలంకరించుకోవాలి. తలస్నానం చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజ మందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమలు అలంకరించుకోవాలి. విష్ణు మూర్తి పటం లేదా విగ్రహం ముందు కలసాన్ని పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రంతో కప్పి టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామర పువ్వులు, తులసి దళాలు ఉపయోగించాలి. వైకుంఠ ఏకాదశి రోజున మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చని పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున మధ్యాహ్నం 12 గంటల లోపే మీరు పూజలు పూర్తి చేయాలి. దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించాలి. అలాగే దీపారాధనకు కొబ్బరి నూనె మాత్రమే వాడాలి. ఓం నమో నారాయణాయ అని మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉసిరి చెట్టుని తాకి నమస్కరిస్తే చాలు.. ఎందుకంటే ఉసిరిలో విష్ణు కొలువై ఉంటాడు. కాబట్టి ఆ చెట్టును తాకిన ఆ చెట్టుకి పూజ చేసిన ఎంతో పుణ్య ఫలం దక్కుతుంది. వైకుంఠవాసం నీకు కలుగుతుంది..

Jyothi Marikanti

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి