Puri Jagannath Temple which will be completed soon
Puri Jagannath Temple : మీ అందరికీ జగన్నాథ ఆలయం గురించి తెలుసు కదా.. మీలో చాలామంది ఆలయాన్ని దర్శించుకుని ఉంటారు. అయితే ఈరోజు మీకోసం జగన్నాధ ఆలయం యొక్క విశేషాలు చెప్పాలనుకుంటున్నాను.. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వింతలు రహస్యాలు ఈ ఆలయంలో దాగి ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి ఈరోజు చెప్తాను చూడండి.. అవి సత్య యుగం ద్వాపర యుగం కలియుగం అలాగే మన భారత దేశంలో బద్రీనాథ్ రామేశ్వరం ద్వారక మరియు జగన్నాథ్ ఆలయమని నాలుగు ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. అయితే ఇవి ఎప్పుడు కట్టబడ్డాయో తెలుసా.. బద్రీనాథ్ సత్యోగంలో స్థాపించబడింది. రామేశ్వరం త్రేతా యుగంలో స్థాపించబడింది. ద్వాపర యుగంలో ద్వారకా మరియు కలియుగంలో జగన్నాథ్ ఆలయాన్ని స్థాపించారు. అయితే ఈ రోజు మీకు నేను జగన్నాధ ఆలయం గురించి చెప్తాను. జగన్నాథ ఆలయం ఇది అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ప్రఖ్యాతి జరిగింది. ఈ ఆలయంలో జగన్నాథుడు తన అన్న మరియు సోదరితో కలిసి ఉన్నట్టుగా ఉంటుంది.
మూడు ప్రతిమలు ఈ ఆలయంలో ప్రతిష్టించబడ్డాయి. ఈ ఆలయంలో స్వామిని పూజించడమే కాదు ఒక పండగలా చేస్తారు. ఇక్కడ అయితే హిందూమతంలో అసంపూర్ణ విగ్రహాన్ని పూజించడం తప్పుగా పరిగణించబడుతుంది. ఒరిస్సాలోని తీర ప్రాంత నగరమైన పూరీలో ఉన్న ఈ ప్రపంచ ప్రసిద్ధ ఆలయం. విష్ణువు అవతారమైన కృష్ణుడికి అంకితం చేయబడింది. 800 సంవత్సరాల పైగా పురాతనమైన ఈ ఆలయంలో దాగి ఉన్న ఇలాంటి రహస్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. శ్రీకృష్ణుని గుండె నేటికీ సజీవంగా ఉందని మీకు తెలుసా.. శ్రీకృష్ణుని అంత్యక్రియలు చేస్తున్నప్పుడు తన హృదయం మాత్రం కాలిపోలేదట.. నిజానికి శ్రీకృష్ణుడి అంత్యక్రియలు జరా అనే గిరిజన వేటగాడు అయితే చివరిలో శరీరం మొత్తం కాలిపోయిన కూడా గుండె మాత్రం కాలలేదు.
Puri Jagannath Temple which will be completed soon
అయితే అతను ఆ గుండెను నీటిలో వదిలాడు. ఆ తర్వాత జగన్నాథుని భక్తుడైన రాజుకు నదిలో ఒక పెద్ద రాయి దొరుకుతుంది. ఇది తెలుసుకున్న రాజు విశ్వకర్మ చేత జగన్నాథుని విగ్రహం చేయిస్తాడు ఇదే జరుగుతుంది. మొత్తం రథయాత్ర కోసం బలరాముడు శ్రీకృష్ణుడు మరియు దేవి సుభద్ర కోసం మూడు వేరువేరు రకాలు తయారు చేయబడ్డాయి. రథయాత్రలో ముందు భాగంలో బలరాంజీరకం మధ్యలో సుభద్ర దేవి రథం అలాగే వెనకవైపు భగవాన్ శ్రీ జగన్నాథ్ రధం ఉంటాయి. భారత రాష్ట్రమైన ఒరిస్సా సప్తపురిలో ఒకటి ఇక్కడ భగవాను జగన్నాథుని ప్రపంచ ప్రసిద్ధ ఆలయం ఉంది. ఇది చార్ధామ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. లోపల ఈ ఆలయం లోపల సముద్ర శబ్దం వినిపించదు. ఆలయ సింహద్వారం నుంచి లోపలికి తొలి అడుగు వేయగానే సముద్రపు అలల శబ్దం వినపడకపోవడం నేటికీ ఆశ్చర్యకరమైన విషయం. ఏంటంటే గుడి బయట ఒక్క అడుగు వేయగానే సముద్రపు అలల చప్పుడు వినపడుతుంది.
దీని వెనక కూడా ఒక కథ ఉందని చెప్తారు. సముద్రపు అలల శబ్దం వల్ల జగన్నాథుడు సరిగా నిద్రపోలేకపోతున్నాడని నమ్ముతారు. హనుమాన్ జి ఈ సమస్య గురించి తెలుసుకున్నప్పుడు హనుమాన్ జీతన శక్తితో తనను తాను రెండు భాగాలుగా విభజించుకుని గాలికి వ్యతిరేక దిశలో వేగంగా ఆలయం దగ్గర ప్రదక్షిణ చేయడం ప్రారంభిస్తారు. దీని కారణంగా గాలి చక్రం సృష్టించబడింది. లోపలికి వెళ్ళదు. మరియు ఆలయం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అలా ఆలయంలో జగన్నాథ స్వామి హాయిగా నిద్రపోతాడు. ఇది జగన్నాథ స్వామి ఆలయంలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి.
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…
Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…
Health Benefits Vitamin F : మనము ఇప్పటివరకు విటమిన్లలో ఎ, బి, బి 1, బి 2, బి…
Ajwain Leaves : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జింక్ ఫుడ్ ని అలవాటు చేసుకుంటున్నారు. దీని వల్ల…
Seem Chintakaya : సీమ చింతకాయ, దీని గురించి ఇప్పటి ప్రజలకు అసలు తెలియదు. పల్లెల్లో హేమ చింతకాయ గురించి…
This website uses cookies.