Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతిదీ క్షణాల్లో వైరల్ అవుతుంది. నిత్యం వేలాది వీడియోలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో స్టూడెంట్స్ క్లాస్ రూమ్ లోనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనేది బంధువులు సమక్షంలో అందరి ముందు అంగరంగ వైభవంగా జరిగే పెద్ద వేడుక. అలాంటిది మైనర్లు పెళ్లిని బొమ్మలాటగా మార్చేశారు. ఇంటర్ చదువుతున్న ఇద్దరు మైనర్లు ఏకంగా తరగతి గదిలోనే పెళ్లి చేసుకున్నారు. ఈ విచిత్ర ఘటన రాజమండ్రిలో చోటుచేసుకుంది.
ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గత నెల మైనర్లు వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాల్లోకి వెళితే రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న ఓ మైనర్ బాలిక, మైనర్ బాలుడు క్లాస్ రూమ్ నే మండపంగా మార్చుకున్నారు. క్లాస్ రూమ్ లోనే మైనర్ బాలుడు బాలిక మెడలో మూడు ముళ్ళు వేసేశాడు. ఈ తతంగాన్ని మొత్తం ఓ బాలిక వీడియో తీసింది. ఈ విషయం బయటకు రావడంతో కాలేజీలో పెళ్లి జరిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైరల్ అయిన ఫోటోలు వీడియోలు కాలేజీ ప్రిన్సిపల్ వద్దకు వెళ్లాయి.
దీంతో ప్రిన్సిపల్ విద్యార్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చి టీసీ ఇచ్చి పంపించేశారు. పిల్లలు చేసిన ఈ పనికి ఇరు కుటుంబాలు తలలు పట్టుకున్నారు. వారు చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే విద్యార్థులు మాత్రం ఏదో సరదాగా చేసాం అని చెప్పడం గమనార్హం. సరదాగా చేసిన అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా స్టూడెంట్స్ చేసిన పని పెద్ద తప్పు. అలా చేసింది కాక సోషల్ మీడియాలో పెట్టడం మరో తప్పు. దీని వలన వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ సోషల్ మీడియా వచ్చాక పిల్లలు కూడా బాగా చెడిపోతున్నారు.
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
This website uses cookies.